ETV Bharat / city

Amaravati Farmers Maha Padayatra: గమ్యం చేరిన అమరావతి రైతుల పాదయాత్ర

author img

By

Published : Dec 14, 2021, 4:34 PM IST

Amaravati Farmers Maha Padayatra: ఏపీలోని అమరావతి రైతుల మహాపాదయాత్ర ఎట్టకేలకు గమ్యం చేరింది. 44 రోజులుగా సాగిన పాదయాత్ర అమరావతి నుంచి ఎన్నో అడ్డంకులకు ఎదురొడ్డుతూ.. చివరికి శ్రీవారి పాదాల చెంతకు చేరింది.

amaravati-farmers-maha-padayatra-ends-in-tirumala
amaravati-farmers-maha-padayatra-ends-in-tirumala

ఎట్టకేలకు గమ్యం చేరిన అమరావతి రైతుల పాదయాత్ర

Amaravati Farmers Maha Padayatra: ఏపీలోని అమరావతి రైతుల మహాపాదయాత్ర గమ్యం చేరింది. 44 రోజులుగా ఎన్నో సవాళ్లు ఎదుర్కొంటూ.. అమరావతి నుంచి తిరుపతి చేరారు. ఒకటిన్నర నెలకిందట యాత్రకు బయల్దేరిన నాటి నుంచి .. అడుగడుగునా అడ్డుంకులు ఎదురయ్యాయి. నిబంధనలు ఉల్లంఘిస్తున్నారంటూ ఆంక్షలు, కేసులు కూడా నమోదు చేశారు! వీటన్నింటినీ ఎదురొడ్డుతూనే ముందుకు సాగారు రైతన్నలు.

తొలిరోజు అమరావతి నుంచి బయల్దేరిన రైతులు.. ఆ తర్వాత గుంటూరు జిల్లా, ప్రకాశం, నెల్లూరు జిల్లాలు దాటారు. చిత్తూరు జిల్లాలోనూ అంతటి అపూర్వ స్వాగతం దక్కదేమోనని రైతులు సందేహిస్తే... అక్కడా పూలబాటే పరిచారు స్థానికులు. అనుకున్నట్లే.. శ్రీవారి పాదాల చెంతకు చేరారు. తిరుపతి నగరంలోనే 9 కి.మీ పాటు యాత్ర కొనసాగింది. దాదాపు 450కి.మీ మేర కాలినడకన వచ్చిన కర్షకులు.. చివరిగా కొబ్బరికాయలు కొట్టి తమ యాత్రను ముగించారు. ఎన్నో ఆటంకాలు ఎదుర్కొన్న తమకు.. వివిధ జిల్లాల్లోని ప్రజలు సంఘీభావం తెలపటంపై రైతులు హర్షం వ్యక్తం చేశారు. ఇకనైనా రాష్ట్ర ప్రభుత్వం తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని కోరారు.

ప్రభుత్వమే అడ్డుకుంది..

"మమ్మల్ని జనం రాళ్లతో కొడతారని ప్రభుత్వం హేళన చేసింది. కానీ.. అడుగడున జనాలు పూలబాటలు పరిచారు. మాకు జనాలు ఎంత మద్దతిచ్చారో.. మీడియా ద్వారా అందరూ చూశారు. మమ్మల్సి అడ్డుకునేందుకు ప్రభుత్వమే చిన్నాపెద్ద ఆటంకాలు కల్పించింది. ఎన్ని ఆటంకాలు కల్పించినా.. వాటన్నింటినీ దాటుకుని సంతోషంగా స్వామివారి చెంతకు చేరుకున్నాం. ప్రభుత్వానికి మాకు మధ్యలో ఆ స్వామివారే ఉన్నారు. ఆయనే మా పాదయాత్రలో మాకు తోడుగా ఉన్నారు. 45 రోజుల పాదయాత్ర ముగించుకుని.. ఎక్కడైతే అమరావతి ప్రకటన చేశారో.. అక్కడికే చేరుకుని స్వామివారికి మా మొర చెప్పుకున్నాం." - అమరావతి మహిళా రైతు.

ఇదీ చూడండి:

ఎట్టకేలకు గమ్యం చేరిన అమరావతి రైతుల పాదయాత్ర

Amaravati Farmers Maha Padayatra: ఏపీలోని అమరావతి రైతుల మహాపాదయాత్ర గమ్యం చేరింది. 44 రోజులుగా ఎన్నో సవాళ్లు ఎదుర్కొంటూ.. అమరావతి నుంచి తిరుపతి చేరారు. ఒకటిన్నర నెలకిందట యాత్రకు బయల్దేరిన నాటి నుంచి .. అడుగడుగునా అడ్డుంకులు ఎదురయ్యాయి. నిబంధనలు ఉల్లంఘిస్తున్నారంటూ ఆంక్షలు, కేసులు కూడా నమోదు చేశారు! వీటన్నింటినీ ఎదురొడ్డుతూనే ముందుకు సాగారు రైతన్నలు.

తొలిరోజు అమరావతి నుంచి బయల్దేరిన రైతులు.. ఆ తర్వాత గుంటూరు జిల్లా, ప్రకాశం, నెల్లూరు జిల్లాలు దాటారు. చిత్తూరు జిల్లాలోనూ అంతటి అపూర్వ స్వాగతం దక్కదేమోనని రైతులు సందేహిస్తే... అక్కడా పూలబాటే పరిచారు స్థానికులు. అనుకున్నట్లే.. శ్రీవారి పాదాల చెంతకు చేరారు. తిరుపతి నగరంలోనే 9 కి.మీ పాటు యాత్ర కొనసాగింది. దాదాపు 450కి.మీ మేర కాలినడకన వచ్చిన కర్షకులు.. చివరిగా కొబ్బరికాయలు కొట్టి తమ యాత్రను ముగించారు. ఎన్నో ఆటంకాలు ఎదుర్కొన్న తమకు.. వివిధ జిల్లాల్లోని ప్రజలు సంఘీభావం తెలపటంపై రైతులు హర్షం వ్యక్తం చేశారు. ఇకనైనా రాష్ట్ర ప్రభుత్వం తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని కోరారు.

ప్రభుత్వమే అడ్డుకుంది..

"మమ్మల్ని జనం రాళ్లతో కొడతారని ప్రభుత్వం హేళన చేసింది. కానీ.. అడుగడున జనాలు పూలబాటలు పరిచారు. మాకు జనాలు ఎంత మద్దతిచ్చారో.. మీడియా ద్వారా అందరూ చూశారు. మమ్మల్సి అడ్డుకునేందుకు ప్రభుత్వమే చిన్నాపెద్ద ఆటంకాలు కల్పించింది. ఎన్ని ఆటంకాలు కల్పించినా.. వాటన్నింటినీ దాటుకుని సంతోషంగా స్వామివారి చెంతకు చేరుకున్నాం. ప్రభుత్వానికి మాకు మధ్యలో ఆ స్వామివారే ఉన్నారు. ఆయనే మా పాదయాత్రలో మాకు తోడుగా ఉన్నారు. 45 రోజుల పాదయాత్ర ముగించుకుని.. ఎక్కడైతే అమరావతి ప్రకటన చేశారో.. అక్కడికే చేరుకుని స్వామివారికి మా మొర చెప్పుకున్నాం." - అమరావతి మహిళా రైతు.

ఇదీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.