ETV Bharat / city

AP Corona Cases: ఏపీలో కొత్తగా 82 కరోనా కేసులు.. ఒకరు మృతి

author img

By

Published : Dec 26, 2021, 10:18 PM IST

AP Corona Cases: ఏపీలో కొత్తగా 82 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. వైరస్ సోకి ఒకరు మృతి చెందారు. ప్రస్తుతం రాష్ట్రంలో 1,116 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నట్లు వైద్యారోగ్యశాఖ వెల్లడించింది.

AP Corona Cases: ఏపీలో కొత్తగా 82 కరోనా కేసులు.. ఒకరు మృతి
AP Corona Cases: ఏపీలో కొత్తగా 82 కరోనా కేసులు.. ఒకరు మృతి

AP Corona Cases: ఏపీలో గడిచిన 24 గంటల్లో 25,086 మందికి కరోనా పరీక్షలు చేయగా.. కొత్తగా 82 కరోనా కేసులు నిర్ధారణ అయ్యాయి. వైరస్ బారిన పడి కృష్ణా జిల్లాలో ఒకరు మృతి చెందారు. కరోనా నుంచి మరో 164 మంది బాధితులు కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 1,166 కరోనా యాక్టివ్‌ కేసులు ఉన్నట్లు వైద్యారోగ్యశాఖ వెల్లడించింది.

  • #COVIDUpdates: 26/12/2021, 10:00 AM
    రాష్ట్రం లోని నమోదైన మొత్తం 20,73,597 పాజిటివ్ కేసు లకు గాను
    *20,57,941 మంది డిశ్చార్జ్ కాగా
    *14,490 మంది మరణించారు
    * ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 1,166#APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/HuVwmc4nKG

    — ArogyaAndhra (@ArogyaAndhra) December 26, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

దేశంలో పెరుగుతున్న ఒమిక్రాన్ కేసులు..
మరోవైపు దేశంలో ఒమిక్రాన్​ కేసులు పెరిగిపోతున్నాయి. తాజాగా.. మధ్యప్రదేశ్​, హిమాచల్​ప్రదేశ్​లకూ విస్తరించింది. మధ్యప్రదేశ్ ఇందోర్​లో ఒక్కరోజే 8 ఒమిక్రాన్​ కేసులు నమోదైనట్లు ఆ రాష్ట్ర హోం మంత్రి నరోత్తమ్​ మిశ్రా పేర్కొన్నారు. ఇందులో ఆరుగురు కోలుకొని డిశ్చార్జ్​ అయినట్లు వెల్లడించారు. విదేశాల నుంచి ఇటీవల రాష్ట్రంలోకి 3 వేల మందికి పైగా రాగా అందులో 26 మంది వైరస్​ బారినపడినట్లు తెలిపారు.

Himachal Pradesh reports first Omicron case: హిమాచల్​ ప్రదేశ్​లోనూ ఒమిక్రాన్​ తొలి కేసు నమోదైంది. కొద్దిరోజుల క్రితమే మండీ జిల్లాలో ఓ వ్యక్తికి ఈ వైరస్​ సోకినట్లు అధికారులు నిర్ధరించారు. కెనడా నుంచి వచ్చిన మహిళకు డిసెంబర్​ 12నే వైరస్​ పాజిటివ్​గా తేలినట్లు వైద్యులు పేర్కొన్నారు. ఈ 24న మళ్లీ నెగెటివ్​ వచ్చినట్లు వెల్లడించారు.

Odisha reports four new omicron cases: ఒడిశాలో ఆదివారం మరో నలుగురికి ఒమిక్రాన్​ సోకింది. వీరిలో ఇద్దరు నైజీరియా, మరో ఇద్దరు యూఏఈ నుంచి వచ్చినట్లు అధికారులు తెలిపారు. రాష్ట్రంలో మొత్తం ఒమిక్రాన్​ బాధితుల సంఖ్య 8కి చేరింది.

3 నుంచి పిల్లలకు టీకా.. ప్రధాని మోదీ ప్రకటన
దేశంలో 15-18 ఏళ్ల వయసు వారికి కొవిడ్‌ టీకా పంపిణీ కార్యక్రమాన్ని జనవరి 3న ప్రారంభించనున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ శనివారం తెలిపారు. ఒమిక్రాన్‌ రకం వైరస్‌ విస్తృతి నేపథ్యంలో భయపడాల్సిన పని లేకపోయినా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని చెప్పారు. 60 ఏళ్ల వయసు దాటి, ఇతరత్రా ఆరోగ్య సమస్యలున్నవారికి వైద్యుల సలహాపై 'ముందు జాగ్రత్త (ప్రికాషన్‌) డోసు' టీకా అందించనున్నామని, ఆరోగ్య విభాగ సిబ్బందికి దీన్ని జనవరి 10 నుంచి వేయనున్నట్లు ప్రకటించారు.

ఏంటీ బూస్టర్ డోసు?
What is booster dose: వ్యాక్సినేషన్ పూర్తి చేసుకున్నవారికి అదనంగా ఇచ్చే డోసునే బూస్టర్ డోసు అంటారు. మూడో డోసు వల్ల రోగనిరోధక శక్తి మరింత పెరుగుతుంది. కరోనా వైరస్​ను సమర్థంగా అడ్డుకుంటుంది. మూడో డోసు తీసుకుంటే కొత్త వేరియంట్లను ఎదుర్కొనే సామర్థ్యం ఎక్కువగా ఉంటుందని అధ్యయనాలు చెబుతున్నాయి.

ఏఏ దేశాల్లో పంపిణీ చేస్తున్నారు?
అభివృద్ధి చెందిన అనేక దేశాల్లో మూడో డోసు పంపిణీ ప్రారంభమైంది. జర్మనీ, ఆస్ట్రియా, కెనడా, అమెరికా వంటి దేశాలు మూడో డోసు అందిస్తున్నాయి. ఎక్కువ బూస్టర్ డోసులు అగ్రరాజ్యంలోనే పంపిణీ అయ్యాయి.

మన దేశంలో ఎప్పటి నుంచి పంపిణీ చేస్తారు?
మన దేశంలోనూ మూడో డోసు పంపిణీ ప్రారంభించాలని కేంద్రం నిర్ణయించింది. జనవరి 10 నుంచి ఈ కార్యక్రమం ప్రారంభం కానుంది. ముందుజాగ్రత్త (ప్రికాషన్) డోసు పేరుతో దీన్ని పంపిణీ చేయనున్నారు.

ఎవరికి ఇస్తారు?
Who will get Booster dose india: మూడో డోసు ప్రారంభంలోనే అందరికీ అందుబాటులో ఉండదు. 60 ఏళ్ల వయసు దాటి, ఇతరత్రా ఆరోగ్య సమస్యలున్నవారికి ముందుగా ప్రికాషన్ డోసు అందిస్తారు. వైద్యుల సలహా మేరకు పంపిణీ చేస్తారు. అనంతరం, ఇతర వయసుల వారికీ దీన్ని అందుబాటులోకి తెచ్చే అవకాశం ఉంది.

రెండు డోసులు తీసుకున్న తర్వాత ఎన్నిరోజులకు తీసుకోవాలి?
booster dose gap: రెండో డోసు తీసుకున్న తర్వాత 9 నుంచి 12 నెలలకు ప్రికాషన్ డోసు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. టీకా పంపిణీపై ఏర్పాటైన జాతీయ సాంకేతిక సలహా బృందం ఈ మేరకు కాలవ్యవధిపై సమాలోచనలు చేస్తోంది. శాస్త్రీయ పద్ధతుల్లో అంచనా వేసి దీనిపై తుది నిర్ణయం తీసుకోనున్నారు. త్వరలోనే దీనిపై ప్రకటన వచ్చే అవకాశం ఉంది.

ఇవీ చదవండి:

AP Corona Cases: ఏపీలో గడిచిన 24 గంటల్లో 25,086 మందికి కరోనా పరీక్షలు చేయగా.. కొత్తగా 82 కరోనా కేసులు నిర్ధారణ అయ్యాయి. వైరస్ బారిన పడి కృష్ణా జిల్లాలో ఒకరు మృతి చెందారు. కరోనా నుంచి మరో 164 మంది బాధితులు కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 1,166 కరోనా యాక్టివ్‌ కేసులు ఉన్నట్లు వైద్యారోగ్యశాఖ వెల్లడించింది.

  • #COVIDUpdates: 26/12/2021, 10:00 AM
    రాష్ట్రం లోని నమోదైన మొత్తం 20,73,597 పాజిటివ్ కేసు లకు గాను
    *20,57,941 మంది డిశ్చార్జ్ కాగా
    *14,490 మంది మరణించారు
    * ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 1,166#APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/HuVwmc4nKG

    — ArogyaAndhra (@ArogyaAndhra) December 26, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

దేశంలో పెరుగుతున్న ఒమిక్రాన్ కేసులు..
మరోవైపు దేశంలో ఒమిక్రాన్​ కేసులు పెరిగిపోతున్నాయి. తాజాగా.. మధ్యప్రదేశ్​, హిమాచల్​ప్రదేశ్​లకూ విస్తరించింది. మధ్యప్రదేశ్ ఇందోర్​లో ఒక్కరోజే 8 ఒమిక్రాన్​ కేసులు నమోదైనట్లు ఆ రాష్ట్ర హోం మంత్రి నరోత్తమ్​ మిశ్రా పేర్కొన్నారు. ఇందులో ఆరుగురు కోలుకొని డిశ్చార్జ్​ అయినట్లు వెల్లడించారు. విదేశాల నుంచి ఇటీవల రాష్ట్రంలోకి 3 వేల మందికి పైగా రాగా అందులో 26 మంది వైరస్​ బారినపడినట్లు తెలిపారు.

Himachal Pradesh reports first Omicron case: హిమాచల్​ ప్రదేశ్​లోనూ ఒమిక్రాన్​ తొలి కేసు నమోదైంది. కొద్దిరోజుల క్రితమే మండీ జిల్లాలో ఓ వ్యక్తికి ఈ వైరస్​ సోకినట్లు అధికారులు నిర్ధరించారు. కెనడా నుంచి వచ్చిన మహిళకు డిసెంబర్​ 12నే వైరస్​ పాజిటివ్​గా తేలినట్లు వైద్యులు పేర్కొన్నారు. ఈ 24న మళ్లీ నెగెటివ్​ వచ్చినట్లు వెల్లడించారు.

Odisha reports four new omicron cases: ఒడిశాలో ఆదివారం మరో నలుగురికి ఒమిక్రాన్​ సోకింది. వీరిలో ఇద్దరు నైజీరియా, మరో ఇద్దరు యూఏఈ నుంచి వచ్చినట్లు అధికారులు తెలిపారు. రాష్ట్రంలో మొత్తం ఒమిక్రాన్​ బాధితుల సంఖ్య 8కి చేరింది.

3 నుంచి పిల్లలకు టీకా.. ప్రధాని మోదీ ప్రకటన
దేశంలో 15-18 ఏళ్ల వయసు వారికి కొవిడ్‌ టీకా పంపిణీ కార్యక్రమాన్ని జనవరి 3న ప్రారంభించనున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ శనివారం తెలిపారు. ఒమిక్రాన్‌ రకం వైరస్‌ విస్తృతి నేపథ్యంలో భయపడాల్సిన పని లేకపోయినా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని చెప్పారు. 60 ఏళ్ల వయసు దాటి, ఇతరత్రా ఆరోగ్య సమస్యలున్నవారికి వైద్యుల సలహాపై 'ముందు జాగ్రత్త (ప్రికాషన్‌) డోసు' టీకా అందించనున్నామని, ఆరోగ్య విభాగ సిబ్బందికి దీన్ని జనవరి 10 నుంచి వేయనున్నట్లు ప్రకటించారు.

ఏంటీ బూస్టర్ డోసు?
What is booster dose: వ్యాక్సినేషన్ పూర్తి చేసుకున్నవారికి అదనంగా ఇచ్చే డోసునే బూస్టర్ డోసు అంటారు. మూడో డోసు వల్ల రోగనిరోధక శక్తి మరింత పెరుగుతుంది. కరోనా వైరస్​ను సమర్థంగా అడ్డుకుంటుంది. మూడో డోసు తీసుకుంటే కొత్త వేరియంట్లను ఎదుర్కొనే సామర్థ్యం ఎక్కువగా ఉంటుందని అధ్యయనాలు చెబుతున్నాయి.

ఏఏ దేశాల్లో పంపిణీ చేస్తున్నారు?
అభివృద్ధి చెందిన అనేక దేశాల్లో మూడో డోసు పంపిణీ ప్రారంభమైంది. జర్మనీ, ఆస్ట్రియా, కెనడా, అమెరికా వంటి దేశాలు మూడో డోసు అందిస్తున్నాయి. ఎక్కువ బూస్టర్ డోసులు అగ్రరాజ్యంలోనే పంపిణీ అయ్యాయి.

మన దేశంలో ఎప్పటి నుంచి పంపిణీ చేస్తారు?
మన దేశంలోనూ మూడో డోసు పంపిణీ ప్రారంభించాలని కేంద్రం నిర్ణయించింది. జనవరి 10 నుంచి ఈ కార్యక్రమం ప్రారంభం కానుంది. ముందుజాగ్రత్త (ప్రికాషన్) డోసు పేరుతో దీన్ని పంపిణీ చేయనున్నారు.

ఎవరికి ఇస్తారు?
Who will get Booster dose india: మూడో డోసు ప్రారంభంలోనే అందరికీ అందుబాటులో ఉండదు. 60 ఏళ్ల వయసు దాటి, ఇతరత్రా ఆరోగ్య సమస్యలున్నవారికి ముందుగా ప్రికాషన్ డోసు అందిస్తారు. వైద్యుల సలహా మేరకు పంపిణీ చేస్తారు. అనంతరం, ఇతర వయసుల వారికీ దీన్ని అందుబాటులోకి తెచ్చే అవకాశం ఉంది.

రెండు డోసులు తీసుకున్న తర్వాత ఎన్నిరోజులకు తీసుకోవాలి?
booster dose gap: రెండో డోసు తీసుకున్న తర్వాత 9 నుంచి 12 నెలలకు ప్రికాషన్ డోసు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. టీకా పంపిణీపై ఏర్పాటైన జాతీయ సాంకేతిక సలహా బృందం ఈ మేరకు కాలవ్యవధిపై సమాలోచనలు చేస్తోంది. శాస్త్రీయ పద్ధతుల్లో అంచనా వేసి దీనిపై తుది నిర్ణయం తీసుకోనున్నారు. త్వరలోనే దీనిపై ప్రకటన వచ్చే అవకాశం ఉంది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.