ETV Bharat / business

2020-21 వడ్డీ చెల్లింపుపై ఈపీఎఫ్​ఓ క్లారిటీ!

author img

By

Published : Aug 11, 2021, 1:00 PM IST

2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి వడ్డీ రేట్ల జమ ఆలస్యంపై ఈపీఎఫ్ఓ క్లారిటీ ఇచ్చింది. దీనికి సంబంధించిన ప్రక్రియ కొనసాగుతోందని.. త్వరలోనే వడ్డీని చందాదారుల ఖాతాల్లో జమ చేయనున్నట్లు పేర్కొంది.

EPF Interest credit soon
త్వరలోనే ఈపీఎఫ్​ వడ్డీ జమ

ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్ఓ) చందాదారులకు కీలక విజ్ఞప్తి చేసింది. 2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి.. 6 కోట్ల లబ్దిదారులకు వడ్డీని త్వరలోనే జమ చేయనున్నట్లు ప్రకటించింది. వడ్డీ రేట్ల జమ గురించిన ప్రక్రియ కొనసాగుతోందని.. అప్పటి వరకు చందాదారులు సహనం పాటించాలని ట్విట్టర్​ ద్వారా కోరింది. వడ్డీ జమ ఆలస్యంపై పలువురు ఈపీఎఫ్​ఓను ప్రశ్నించగా.. ఈ వివరణ ఇచ్చింది.

  • The process is in pipeline and may be shown there very shortly. Whenever the interest will be credited, it will be accumulated and paid in full. There would be no loss of interest. Please maintain patience.

    — EPFO (@socialepfo) August 10, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

వడ్డీ రేట్లు ఇలా..

2020-21 ఆర్థిక సంవత్సరానికి చందాదారులకు 8.5 శాతం వడ్డీ రేటును చెల్లించాలని నిర్ణయించింది ఈపీఎఫ్ఓ​.

2018-19 ఆర్థిక సంవత్సరంలో పీఎఫ్​పై వడ్డీ రేటు 8.65 శాతం ఉండగా, 2019-20 ఆర్థిక సంవత్సరంలో ధర్మకర్తల బోర్డు దాన్ని 8.5 శాతానికి తగ్గించింది. అంతకు ముందు ఏడేళ్లతో పోలిస్తే ఇదే అత్యల్ప వడ్డీ రేటు. కరోనా కారణంగానే.. 2020-21 వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పులు చేయలేదని ఈపీఎఫ్​ఓ వివరించింది.

వడ్డీ జమ అయిన వెంటనే..చందాదారులంతా.. నాలుగు మార్గాల ద్వారా ఆ వివరాలను తెలుసుకునే వీలుంది. అయితే ఇందుకు వారి యూఏఎన్​ యాక్టివేట్ అయ్యుండాలి అనే విషయం గుర్తుంచుకోవాలి.

వడ్డీ జమ, ప్రస్తుత బ్యాలెన్స్​ తెలుసుకునే మార్గాలు..

మిస్డ్​​ కాల్​ సర్వీస్​..

ఈపీఎఫ్​ఓ వద్ద రిజిస్టర్​ అయిన మొబైల్​ నంబర్​ నుంచి '011-22901406' నంబర్​కు మిస్డ్​ కాల్ ఇవ్వాలి. దీని ద్వారా ఈపీఎఫ్​ఓ నుంచి ఎస్​ఎంఎస్​ రూపంలో బ్యాలెన్స్​ వివరాలు అందుతాయి. ఇది ఉచిత సర్వీస్​. దీనిని వినియోగించుకోవాలంటే.. చందాదారుడు కేవైసీ పూర్తి చేసి ఉండాలి.

ఎస్ఎంఎస్ సర్వీస్​..

ఈపీఎఎఫ్​ఓ చందాదారులు.. EPFOHO UAN అని టైప్​ చేసి 7738299899 నంబర్​కు ఎస్​ఎంఎస్​ పంపడం ద్వారా కూడా.. బ్యాలెన్స్ వివరాలు తెలుసుకోవచ్చు.

ఈపీఎఫ్​ఓ పోర్టల్​..

ఈపీఎఫ్​ఓ మెంబర్​ పోర్టల్​లో రిజిస్టర్​ అయిన చందాదారులు.. యూఏఎన్​ నంబర్​ పాస్​వర్డ్​తో లాగిన్ అవడం ద్వారా బ్యాలెన్స్​ వివరాలు తెలుసుకోవచ్చు. ఏ నెలలో ఎంత మొత్తం జమ అయ్యిందనే వివరాలు కూడా ఇందులో ఉంటాయి.

ఉమంగ్ యాప్​..

ఖాతా బ్యాలెన్స్​ సహా.. ఈపీఎఫ్​ఓ స్టెట్​మెంట్​ను ఉమంగ్​ మొబైల్ యాప్​ ద్వారా తెలుసుకోవచ్చు. ఈ యాప్​లో ఎంప్లాయ్​ సెంట్రిక్​ సర్వీసెస్​పై క్లిక్​ చేసి.. వ్యూ పాస్​ బుక్​ ఆప్షన్​ను ఎంపిక చేసుకోవాలి. అక్కడ యూఏఎన్ నంబర్​ను టైప్ చేసి.. రిజిస్టర్​ మొబైల్ నంబర్​కు వచ్చిన ఓటీపీని ఎంటర్ చేయడం ద్వారా బ్యాలెన్స్​ వివరాలను చూడొచ్చు.

ఇదీ చదవండి: పీఎఫ్​ ఖాతాదారులకు ఆగస్టు 31 వరకే ఆఖరి ఛాన్స్​

ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్ఓ) చందాదారులకు కీలక విజ్ఞప్తి చేసింది. 2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి.. 6 కోట్ల లబ్దిదారులకు వడ్డీని త్వరలోనే జమ చేయనున్నట్లు ప్రకటించింది. వడ్డీ రేట్ల జమ గురించిన ప్రక్రియ కొనసాగుతోందని.. అప్పటి వరకు చందాదారులు సహనం పాటించాలని ట్విట్టర్​ ద్వారా కోరింది. వడ్డీ జమ ఆలస్యంపై పలువురు ఈపీఎఫ్​ఓను ప్రశ్నించగా.. ఈ వివరణ ఇచ్చింది.

  • The process is in pipeline and may be shown there very shortly. Whenever the interest will be credited, it will be accumulated and paid in full. There would be no loss of interest. Please maintain patience.

    — EPFO (@socialepfo) August 10, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

వడ్డీ రేట్లు ఇలా..

2020-21 ఆర్థిక సంవత్సరానికి చందాదారులకు 8.5 శాతం వడ్డీ రేటును చెల్లించాలని నిర్ణయించింది ఈపీఎఫ్ఓ​.

2018-19 ఆర్థిక సంవత్సరంలో పీఎఫ్​పై వడ్డీ రేటు 8.65 శాతం ఉండగా, 2019-20 ఆర్థిక సంవత్సరంలో ధర్మకర్తల బోర్డు దాన్ని 8.5 శాతానికి తగ్గించింది. అంతకు ముందు ఏడేళ్లతో పోలిస్తే ఇదే అత్యల్ప వడ్డీ రేటు. కరోనా కారణంగానే.. 2020-21 వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పులు చేయలేదని ఈపీఎఫ్​ఓ వివరించింది.

వడ్డీ జమ అయిన వెంటనే..చందాదారులంతా.. నాలుగు మార్గాల ద్వారా ఆ వివరాలను తెలుసుకునే వీలుంది. అయితే ఇందుకు వారి యూఏఎన్​ యాక్టివేట్ అయ్యుండాలి అనే విషయం గుర్తుంచుకోవాలి.

వడ్డీ జమ, ప్రస్తుత బ్యాలెన్స్​ తెలుసుకునే మార్గాలు..

మిస్డ్​​ కాల్​ సర్వీస్​..

ఈపీఎఫ్​ఓ వద్ద రిజిస్టర్​ అయిన మొబైల్​ నంబర్​ నుంచి '011-22901406' నంబర్​కు మిస్డ్​ కాల్ ఇవ్వాలి. దీని ద్వారా ఈపీఎఫ్​ఓ నుంచి ఎస్​ఎంఎస్​ రూపంలో బ్యాలెన్స్​ వివరాలు అందుతాయి. ఇది ఉచిత సర్వీస్​. దీనిని వినియోగించుకోవాలంటే.. చందాదారుడు కేవైసీ పూర్తి చేసి ఉండాలి.

ఎస్ఎంఎస్ సర్వీస్​..

ఈపీఎఎఫ్​ఓ చందాదారులు.. EPFOHO UAN అని టైప్​ చేసి 7738299899 నంబర్​కు ఎస్​ఎంఎస్​ పంపడం ద్వారా కూడా.. బ్యాలెన్స్ వివరాలు తెలుసుకోవచ్చు.

ఈపీఎఫ్​ఓ పోర్టల్​..

ఈపీఎఫ్​ఓ మెంబర్​ పోర్టల్​లో రిజిస్టర్​ అయిన చందాదారులు.. యూఏఎన్​ నంబర్​ పాస్​వర్డ్​తో లాగిన్ అవడం ద్వారా బ్యాలెన్స్​ వివరాలు తెలుసుకోవచ్చు. ఏ నెలలో ఎంత మొత్తం జమ అయ్యిందనే వివరాలు కూడా ఇందులో ఉంటాయి.

ఉమంగ్ యాప్​..

ఖాతా బ్యాలెన్స్​ సహా.. ఈపీఎఫ్​ఓ స్టెట్​మెంట్​ను ఉమంగ్​ మొబైల్ యాప్​ ద్వారా తెలుసుకోవచ్చు. ఈ యాప్​లో ఎంప్లాయ్​ సెంట్రిక్​ సర్వీసెస్​పై క్లిక్​ చేసి.. వ్యూ పాస్​ బుక్​ ఆప్షన్​ను ఎంపిక చేసుకోవాలి. అక్కడ యూఏఎన్ నంబర్​ను టైప్ చేసి.. రిజిస్టర్​ మొబైల్ నంబర్​కు వచ్చిన ఓటీపీని ఎంటర్ చేయడం ద్వారా బ్యాలెన్స్​ వివరాలను చూడొచ్చు.

ఇదీ చదవండి: పీఎఫ్​ ఖాతాదారులకు ఆగస్టు 31 వరకే ఆఖరి ఛాన్స్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.