బడ్జెట్ 2021లో వేతన జీవులకు కేంద్రం షాకిచ్చింది. వివిధ రంగాల్లో ఉద్యోగుల భవిష్యనిధి (ఈపీఎఫ్) రూ.2.5 లక్షల వార్షిక కంట్రిబ్యూషన్పై వడ్డీ వసులు చేయనుంది కేంద్రం. 2021 ఏప్రిల్ 1 నుంచి ఇది అమలులోకి రానుంది.
నెలకు రూ.2లక్షల కన్నా తక్కువగా సంపదించే వారిపై బడ్జెట్ ప్రతిపాదనతో ఎలాంటి ప్రభావం పడదని వివరించారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.
మొత్తం పీఎఫ్ చందాదారుల్లో రూ.2.5 లక్షలు కంట్రిబ్యూషన్ చేసే వారి సంఖ్య 1 శాతంలోపేనని వ్యయాల కార్యదర్శి టీవీ సోమ్నాథన్ పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ప్రస్తుతం 6 కోట్ల మందికిపైగా పీఎఫ్ పరిధిలో ఉన్నారు.
ఇదీ చూడండి:బడ్జెట్ 2021: పర్యటకానికి షాక్- 19% కోత