ETV Bharat / business

2021కి వృత్తి నిపుణుల ఆశావాద స్వాగతం - ఉద్యోగుల్లో స్థిరంగా ఆత్మ విశ్వాసం

వచ్చే ఏడాది సంఖ్య పరంగా ఉద్యోగాలు పెరుగాతాయని భారత వృత్తి నిపుణులు ఆశావాదంతో ఉన్నట్లు లింక్డ్​ఇన్ తాజా సర్వే వెల్లడించింది. దేశవ్యాప్తంగా ఉద్యోగుల ఆత్మ విశ్వాసం ఈ ఏడాది ఏప్రిల్-నవంబర్ కాలంలో 50-57 మధ్య స్థిరంగా ఉన్నట్లు పేర్కొంది.

linkedin Survey on Indian professionals
ఉద్యోగుల ఆత్మ విశ్వాసంపై లింక్డ్​ఇన్ సర్వే
author img

By

Published : Dec 17, 2020, 2:13 PM IST

భారత వృత్తి నిపుణులు 2021కి ఆశావాదంతో స్వాగతం పలుకుతున్నట్లు లింక్డ్​ఇన్​ తాజా సర్వేలో తేలింది. ముఖ్యంగా వచ్చే ఏడాది ఉద్యోగాల సంఖ్య పెరుగుతుందని వృత్తి నిపుణులు ఆశిస్తున్నట్లు తెలిసింది.

ఈ ఏడాది ఏప్రిల్ నుంచి నవంబర్ మధ్య 21,066 మంది వృత్తి నిపుణులపై ఆన్​లైన్​లో జరిపిన సర్వే ఆధారంగా ఈ విషయాలు వెల్లడించింది లింక్డ్​ఇన్​.

లింక్డ్ఇన్​ సర్వే ముఖ్యాంశాలు..

  • ప్రతి ఐదుగురిలో ఇద్దరు(40 శాతం) భారత వృత్తి నిపుణులు భారీ సంఖ్యలో కొత్త ఉద్యోగాలు పెరుగాతాయని ఆశిస్తున్నారు. ఇద్దరిలో ఒకరు వచ్చే ఏడాది ఆరు నెలల్లో తమ కంపెనీలు మెరుగ్గా రాణించాలని భావిస్తున్నారు.
  • ఉద్యోగుల్లో ఆత్మ విశ్వాసం (ఏప్రిల్ నుంచి నవంబర్​ మధ్య) 50-57 వద్ద స్థిరంగా ఉంది.
  • భారతీయ వృత్తి నిపుణుల్లో ప్రతి ఐదుగురిలో ముగ్గురు (57 శాతం).. రానున్న రోజుల్లో ఆన్​లైన్​ ద్వారా కొత్త నైపుణ్యాలు పెంచుకునే సమయం పెంచుకోనున్నట్లు వివరించారు.
  • నవంబర్ డేటా ప్రకారం ఐదుగురిలో నలుగురు ఉపాధి లేని వృత్తి నిపుణులు (78 శాతం) ఇంకా ఆందోళనలోనే ఉన్నారు. 32 శాతం మంది మాత్రమే (ముగ్గురిలో ఒకరు) వచ్చే ఏడాది తమ ఆదాయం పెరుగుతుందని భావిస్తున్నారు.
  • ఈసారి సెలవు సీజన్​లో 61 శాతం మంది వృత్తి నిపుణులు తక్కువ సమయం విరామం తీసుకుంటామని చెబుతున్నారు. 87 శాతం మంది (10లో 9 మంది) ఈ ఏడాది చివర్లో తమ ప్రాథమిక పనులకు సమాన సమయం గానీ కాస్త ఎక్కువగానీ కేటాయిస్తామని వివరించారు.

ఇదీ చూడండి:4 షరతుల పూర్తికి మరో రెండు నెలల గడువు

భారత వృత్తి నిపుణులు 2021కి ఆశావాదంతో స్వాగతం పలుకుతున్నట్లు లింక్డ్​ఇన్​ తాజా సర్వేలో తేలింది. ముఖ్యంగా వచ్చే ఏడాది ఉద్యోగాల సంఖ్య పెరుగుతుందని వృత్తి నిపుణులు ఆశిస్తున్నట్లు తెలిసింది.

ఈ ఏడాది ఏప్రిల్ నుంచి నవంబర్ మధ్య 21,066 మంది వృత్తి నిపుణులపై ఆన్​లైన్​లో జరిపిన సర్వే ఆధారంగా ఈ విషయాలు వెల్లడించింది లింక్డ్​ఇన్​.

లింక్డ్ఇన్​ సర్వే ముఖ్యాంశాలు..

  • ప్రతి ఐదుగురిలో ఇద్దరు(40 శాతం) భారత వృత్తి నిపుణులు భారీ సంఖ్యలో కొత్త ఉద్యోగాలు పెరుగాతాయని ఆశిస్తున్నారు. ఇద్దరిలో ఒకరు వచ్చే ఏడాది ఆరు నెలల్లో తమ కంపెనీలు మెరుగ్గా రాణించాలని భావిస్తున్నారు.
  • ఉద్యోగుల్లో ఆత్మ విశ్వాసం (ఏప్రిల్ నుంచి నవంబర్​ మధ్య) 50-57 వద్ద స్థిరంగా ఉంది.
  • భారతీయ వృత్తి నిపుణుల్లో ప్రతి ఐదుగురిలో ముగ్గురు (57 శాతం).. రానున్న రోజుల్లో ఆన్​లైన్​ ద్వారా కొత్త నైపుణ్యాలు పెంచుకునే సమయం పెంచుకోనున్నట్లు వివరించారు.
  • నవంబర్ డేటా ప్రకారం ఐదుగురిలో నలుగురు ఉపాధి లేని వృత్తి నిపుణులు (78 శాతం) ఇంకా ఆందోళనలోనే ఉన్నారు. 32 శాతం మంది మాత్రమే (ముగ్గురిలో ఒకరు) వచ్చే ఏడాది తమ ఆదాయం పెరుగుతుందని భావిస్తున్నారు.
  • ఈసారి సెలవు సీజన్​లో 61 శాతం మంది వృత్తి నిపుణులు తక్కువ సమయం విరామం తీసుకుంటామని చెబుతున్నారు. 87 శాతం మంది (10లో 9 మంది) ఈ ఏడాది చివర్లో తమ ప్రాథమిక పనులకు సమాన సమయం గానీ కాస్త ఎక్కువగానీ కేటాయిస్తామని వివరించారు.

ఇదీ చూడండి:4 షరతుల పూర్తికి మరో రెండు నెలల గడువు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.