ETV Bharat / business

ఇప్పట్లో ప్రభుత్వం నుంచి కొత్త పథకాలు ఉండవు!

author img

By

Published : Jun 5, 2020, 3:05 PM IST

దేశవ్యాప్త లాక్​డౌన్​తో తలెత్తిన ఆర్థిక సంక్షోభం కారణంగా.. కేంద్ర ఆర్థిక శాఖ ఖర్చులు తగ్గించుకునే పనిలో పడింది. ఇందుకోసం ఈ ఆర్థిక సంవత్సరంలో కొత్తగా ఎలాంటి పథకాలను ప్రకటించొద్దని నిర్ణయించింది.

no new schemes for this year
కొత్త పథకాలు ఇప్పట్లో వద్దు

కరోనా సంక్షోభం నేపథ్యంలో కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఎలాంటి కొత్త పథకాలు ప్రకటించొద్దని ఇతర మంత్రిత్వ శాఖలను కోరింది.

వాటికి మాత్రమే మినహాయింపు..

కరొనా సంక్షోభం నుంచి ఉపశమనం కల్పించేందుకు ప్రకటించిన గరీబ్ కల్యాణ్ యోజన, ఆత్మనిర్భర్ భారత్‌ అభియాన్ ప్యాకేజీలకు మాత్రమే ప్రస్తుతం ఖర్చుచేయనున్నట్లు తెలిపింది. ఇవి మినహా ఇతర ఏ పథకాలకు ఈ ఆర్థిక సంవత్సరంలో ఆమోదం తెలపబోమని స్పష్టం చేసింది ఆర్థిక శాఖ. ఈ నేపథ్యంలో కొత్త పథకాల కోసం తమకు అభ్యర్థనలను పంపవద్దని.. అన్ని మంత్రిత్వశాఖలకు సూచించింది.

వాటి అమలుపై నిలుపుదల..

బడ్జెట్‌లో ప్రకటించిన పథకాల ప్రారంభాన్ని వచ్చే ఏడాది మార్చి 31 వరకూ లేదా తదుపరి ఉత్తర్వులు వెలువరించే వరకూ నిలుపుదల చేస్తున్నట్లు ఆర్థిక శాఖ ఓ ప్రకటనలో వెల్లడించింది. కరోనా నేపథ్యంలో ఆర్థిక వనరులకు డిమాండ్ అధికంగా ఉందన్న.. మారుతున్న ప్రాధాన్యతలు, అవసరాలకు అనుగుణంగా వనరులను తెలివిగా ఉపయోగించాల్సిన అవసరముందని ఆర్థిక శాఖ పేర్కొంది.

ఇదీ చూడండి:'బ్యాంకుల్లో నిరర్ధక ఆస్తులు భారీగా పెరిగిపోతాయి'

కరోనా సంక్షోభం నేపథ్యంలో కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఎలాంటి కొత్త పథకాలు ప్రకటించొద్దని ఇతర మంత్రిత్వ శాఖలను కోరింది.

వాటికి మాత్రమే మినహాయింపు..

కరొనా సంక్షోభం నుంచి ఉపశమనం కల్పించేందుకు ప్రకటించిన గరీబ్ కల్యాణ్ యోజన, ఆత్మనిర్భర్ భారత్‌ అభియాన్ ప్యాకేజీలకు మాత్రమే ప్రస్తుతం ఖర్చుచేయనున్నట్లు తెలిపింది. ఇవి మినహా ఇతర ఏ పథకాలకు ఈ ఆర్థిక సంవత్సరంలో ఆమోదం తెలపబోమని స్పష్టం చేసింది ఆర్థిక శాఖ. ఈ నేపథ్యంలో కొత్త పథకాల కోసం తమకు అభ్యర్థనలను పంపవద్దని.. అన్ని మంత్రిత్వశాఖలకు సూచించింది.

వాటి అమలుపై నిలుపుదల..

బడ్జెట్‌లో ప్రకటించిన పథకాల ప్రారంభాన్ని వచ్చే ఏడాది మార్చి 31 వరకూ లేదా తదుపరి ఉత్తర్వులు వెలువరించే వరకూ నిలుపుదల చేస్తున్నట్లు ఆర్థిక శాఖ ఓ ప్రకటనలో వెల్లడించింది. కరోనా నేపథ్యంలో ఆర్థిక వనరులకు డిమాండ్ అధికంగా ఉందన్న.. మారుతున్న ప్రాధాన్యతలు, అవసరాలకు అనుగుణంగా వనరులను తెలివిగా ఉపయోగించాల్సిన అవసరముందని ఆర్థిక శాఖ పేర్కొంది.

ఇదీ చూడండి:'బ్యాంకుల్లో నిరర్ధక ఆస్తులు భారీగా పెరిగిపోతాయి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.