ETV Bharat / business

స్టాక్ మార్కెట్ల కుదేలు.. సెన్సెక్స్​ 416 పాయింట్లు పతనం

author img

By

Published : Jan 20, 2020, 4:01 PM IST

Updated : Feb 17, 2020, 5:46 PM IST

చమురు ధరల వృద్ధి, కీలక సంస్థల షేర్ల నష్టాలతో స్టాక్ మార్కెట్లు నేడు కుదేలయ్యాయి. సెన్సెక్స్ 416 పాయింట్లు నష్టపోయింది. నిఫ్టీ 122 పాయింట్లు క్షీణించింది.

STOCKS CLOSE
స్టాక్ మార్కెట్లు

స్టాక్ మార్కెట్లు నేడు భారీ నష్టాలతో ముగిశాయి. హెవీ వేయిట్​ షేర్లయిన రిలయన్స్, కోటక్ బ్యాంక్, హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్​, టీసీఎస్​ల నుంచి మదుపరులు లాభాల స్వీకరణకు మొగ్గుచూపడం కారణంగా సూచీలు కుదేలయ్యాయని నిపుణులు చెబుతున్నారు.

ప్రారంభంలో కాస్త సానుకూలంగా కొనసాగిన సూచీలు.. చమురు ధరల వృద్ధితో కొద్ది సేపటికే నష్టాల్లోకి జారుకున్నాయి. ఆ తర్వాత ఏ దశలోనూ తేరుకోలేదు.

బొంబాయి స్టాక్​ ఎక్స్చేంజి సూచీ-సెన్సెక్స్ 416 పాయింట్లు క్షీణించింది. చివరకు 41,529 వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్​ ఎక్స్చేంజి సూచీ-నిఫ్టీ 122 పాయింట్ల నష్టంతో 12,231 వద్దకు చేరింది.

ఇంట్రాడే సాగిందిలా..

సెన్సెక్స్​ 42,274 పాయింట్ల గరిష్ఠాన్ని తాకగా.. 41,503 పాయింట్ల కనిష్ఠాన్ని నమోదు చేసింది.
నిఫ్టీ నేడు 12,430 పాయింట్ల అత్యధిక స్థాయి.. 12,217 పాయింట్ల అత్యల్ప స్థాయిల మధ్య కదలాడింది.

లాభనష్టాల్లోనివి ఇవే..

పవర్ గ్రిడ్​ 3.09 శాతం, భారతీ ఎయిర్​టెల్​ 1.38 శాతం, ఐటీసీ 0.85 శాతం, ఏషియన్​ పెయింట్స్​ 0.82 శాతం, ఐసీఐసీఐ బ్యాంక్​ 0.74 శాతం లాభాలను నమోదు చేశాయి.
కోటక్​ బ్యాంక్​ 4.70 శాతం, రిలయన్స్ 3.08 శాతం, టీసీఎస్​ 2.16 శాతం, ఎన్​టీపీసీ 2.06 శాతం నష్టాలను మూటగట్టుకున్నాయి.

రూపాయి

రూపాయి ఇంట్రాడేలో 5 పైసలు క్షీణించి.. డాలర్​తో పోలిస్తే మారకం విలువ రూ.71.13 వద్దకు చేరింది.

ముడి చమురు

ముడి చమురు ధరల సూచీ-బ్రెంట్​ నేడు 0.66 శాతం పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్ ముడి చమురు ధర 65.28 డాలర్ల వద్ద ఉంది.

ఇదీ చూడండి:హల్వా వేడుకతో బడ్జెట్ ముద్రణ షురూ

స్టాక్ మార్కెట్లు నేడు భారీ నష్టాలతో ముగిశాయి. హెవీ వేయిట్​ షేర్లయిన రిలయన్స్, కోటక్ బ్యాంక్, హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్​, టీసీఎస్​ల నుంచి మదుపరులు లాభాల స్వీకరణకు మొగ్గుచూపడం కారణంగా సూచీలు కుదేలయ్యాయని నిపుణులు చెబుతున్నారు.

ప్రారంభంలో కాస్త సానుకూలంగా కొనసాగిన సూచీలు.. చమురు ధరల వృద్ధితో కొద్ది సేపటికే నష్టాల్లోకి జారుకున్నాయి. ఆ తర్వాత ఏ దశలోనూ తేరుకోలేదు.

బొంబాయి స్టాక్​ ఎక్స్చేంజి సూచీ-సెన్సెక్స్ 416 పాయింట్లు క్షీణించింది. చివరకు 41,529 వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్​ ఎక్స్చేంజి సూచీ-నిఫ్టీ 122 పాయింట్ల నష్టంతో 12,231 వద్దకు చేరింది.

ఇంట్రాడే సాగిందిలా..

సెన్సెక్స్​ 42,274 పాయింట్ల గరిష్ఠాన్ని తాకగా.. 41,503 పాయింట్ల కనిష్ఠాన్ని నమోదు చేసింది.
నిఫ్టీ నేడు 12,430 పాయింట్ల అత్యధిక స్థాయి.. 12,217 పాయింట్ల అత్యల్ప స్థాయిల మధ్య కదలాడింది.

లాభనష్టాల్లోనివి ఇవే..

పవర్ గ్రిడ్​ 3.09 శాతం, భారతీ ఎయిర్​టెల్​ 1.38 శాతం, ఐటీసీ 0.85 శాతం, ఏషియన్​ పెయింట్స్​ 0.82 శాతం, ఐసీఐసీఐ బ్యాంక్​ 0.74 శాతం లాభాలను నమోదు చేశాయి.
కోటక్​ బ్యాంక్​ 4.70 శాతం, రిలయన్స్ 3.08 శాతం, టీసీఎస్​ 2.16 శాతం, ఎన్​టీపీసీ 2.06 శాతం నష్టాలను మూటగట్టుకున్నాయి.

రూపాయి

రూపాయి ఇంట్రాడేలో 5 పైసలు క్షీణించి.. డాలర్​తో పోలిస్తే మారకం విలువ రూ.71.13 వద్దకు చేరింది.

ముడి చమురు

ముడి చమురు ధరల సూచీ-బ్రెంట్​ నేడు 0.66 శాతం పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్ ముడి చమురు ధర 65.28 డాలర్ల వద్ద ఉంది.

ఇదీ చూడండి:హల్వా వేడుకతో బడ్జెట్ ముద్రణ షురూ

Last Updated : Feb 17, 2020, 5:46 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.