ETV Bharat / business

టెల్కోల పిటిషన్​పై నేడు సుప్రీం విచారణ!

ఏజీఆర్​ వివాదంలో బకాయిల చెల్లింపునకు మరింత సమయం కావాలని కోరుతూ టెలీకాం సంస్థలు సుప్రీంకోర్టులో పిటిషన్​ దాఖలు చేశాయి. వ్యాజ్యాన్ని పరిశీలించిన అత్యున్నత న్యాయస్థానం నేడు విచారణ చేపట్టనుంది.

author img

By

Published : Feb 14, 2020, 5:20 AM IST

Updated : Mar 1, 2020, 6:54 AM IST

SC to hear telecom companies' plea on AGR-related dues on Friday
టెల్కోల పిటిషన్​పై వచ్చేవారం సుప్రీంలో విచారణ!

సవరించిన స్థూల ఆదాయం(ఏజీఆర్​)​ వివాదంలో టెల్కోలు దాఖలు చేసిన పిటిషన్​పై నేడు విచారణ చేపట్టనుంది సుప్రీం కోర్టు. టెలికాం శాఖకు బకాయిల చెల్లింపులకు సంబంధించి గడువును పొడగించాలని భారతీ ఎయిర్​టెల్​, వొడాఫోన్​-ఐడియా, టాటా టెలీసర్వీసెస్​ తాజాగా వ్యాజ్యం దాఖలు చేశాయి.

బకాయిలు చెల్లించాలన్న సుప్రీం తీర్పును వివాదం చేయట్లేదని.. చెల్లింపులకు సంబంధించి మాకు మరింత సమయం కావాలని మాత్రమే కోరుతున్నట్లు టెల్కోలు స్పష్టం చేశాయి.

ఈ మేరకు దాఖలైన వ్యాజ్యాలను పరిశీలించిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్​ ఎస్​ఏ బోబ్డే నేతృత్వంలోని ధర్మాసనం.. నేడు విచారించనుంది. బహిరంగ విచారణ జరగాలని పిటిషన్​దారులు కోరగా.. ఆ విషయంపై ధర్మాసనం నిర్ణయం తీసుకుంటుందని స్పష్టం చేశారు.

అక్టోబర్ తీర్పు..

2019 అక్టోబర్​ 24న ఇచ్చిన తీర్పు ప్రకారం.. 2020 జనవరి 23 లోపు టెలికాం సంస్థలు రూ.1.47 లక్షల కోట్ల బకాయిలు చెల్లించాల్సిందేనని స్పష్టం చేసింది సుప్రీం. ఇందులో ఏజీఆర్​పై టెలికాం విభాగం (డీఓటీ) నిర్వచనాన్ని సుప్రీం కోర్టు సమర్థించింది.

ఏజీఆర్​ అంటే..

స్పెక్ట్రం వినియోగ ఛార్జీలు, లైసెన్స్‌ ఫీజులను కలుపుకొని ఏజీఆర్‌ ఛార్జీలుగా చెబుతారు. వీటిల్లో 3-5శాతం స్పెక్ట్రం వినియోగ చార్జీలు, 8 శాతం లైసెన్స్‌ ఫీజుగా చెల్లించాలి. ఈ మొత్తాన్ని టెలికాం శాఖకు చెల్లించాలి. 1999 తర్వాత ఆదాయంలో వాటా విధానం (రెవెన్యూ షేరింగ్‌) కింద ఏజీఆర్‌ ఛార్జీలను ప్రవేశపెట్టారు. ఈ ఛార్జీలను లెక్కగట్టే విధానంపైనే అసలు వివాదం రాజుకొంది.

బకాయిల వివరాలు ఇలా..

నవంబర్​లో జరిగిన పార్లమెంట్​ సమావేశాల్లో టెలికాం మంత్రి రవిశంకర్ ప్రసాద్.. టెల్కోలు​ మొత్తం రూ.1.47 లక్షల కోట్లు బకాయిపడ్డట్లు ప్రకటించారు. ప్రస్తుతానికి ఈ అపరాధ రుసుములపై వడ్డీ తగ్గించే ప్రతిపాదనేదీ లేదనే విషయాన్నీ వెల్లడించారు.

టెలికాం కంపెనీలు చెల్లించాల్సిన ఈ బకాయిలలో రూ.92,642 కోట్లు చెల్లింపులు చేయని లైసెన్సు రుసుములు, రూ.55,054 కోట్లు స్పెక్ట్రమ్​ వినియోగ బకాయిలుగా పేర్కొన్నారు రవి శంకర్ ప్రసాద్.

కంపెనీల వారీగా బాకాయిలు ఇలా..

  • ఎయిర్​టెల్ రూ.21,682.13 కోట్లు
  • వొడాఫోన్ రూ.19,823.71 కోట్లు
  • ఆర్​కాం రూ.16,456.47 కోట్లు
  • బీఎస్​ఎన్​ఎల్​ రూ.2,098.72 కోట్లు
  • ఎంటీఎన్​ఎల్​ రూ.2,537.48 కోట్లు

సవరించిన స్థూల ఆదాయం(ఏజీఆర్​)​ వివాదంలో టెల్కోలు దాఖలు చేసిన పిటిషన్​పై నేడు విచారణ చేపట్టనుంది సుప్రీం కోర్టు. టెలికాం శాఖకు బకాయిల చెల్లింపులకు సంబంధించి గడువును పొడగించాలని భారతీ ఎయిర్​టెల్​, వొడాఫోన్​-ఐడియా, టాటా టెలీసర్వీసెస్​ తాజాగా వ్యాజ్యం దాఖలు చేశాయి.

బకాయిలు చెల్లించాలన్న సుప్రీం తీర్పును వివాదం చేయట్లేదని.. చెల్లింపులకు సంబంధించి మాకు మరింత సమయం కావాలని మాత్రమే కోరుతున్నట్లు టెల్కోలు స్పష్టం చేశాయి.

ఈ మేరకు దాఖలైన వ్యాజ్యాలను పరిశీలించిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్​ ఎస్​ఏ బోబ్డే నేతృత్వంలోని ధర్మాసనం.. నేడు విచారించనుంది. బహిరంగ విచారణ జరగాలని పిటిషన్​దారులు కోరగా.. ఆ విషయంపై ధర్మాసనం నిర్ణయం తీసుకుంటుందని స్పష్టం చేశారు.

అక్టోబర్ తీర్పు..

2019 అక్టోబర్​ 24న ఇచ్చిన తీర్పు ప్రకారం.. 2020 జనవరి 23 లోపు టెలికాం సంస్థలు రూ.1.47 లక్షల కోట్ల బకాయిలు చెల్లించాల్సిందేనని స్పష్టం చేసింది సుప్రీం. ఇందులో ఏజీఆర్​పై టెలికాం విభాగం (డీఓటీ) నిర్వచనాన్ని సుప్రీం కోర్టు సమర్థించింది.

ఏజీఆర్​ అంటే..

స్పెక్ట్రం వినియోగ ఛార్జీలు, లైసెన్స్‌ ఫీజులను కలుపుకొని ఏజీఆర్‌ ఛార్జీలుగా చెబుతారు. వీటిల్లో 3-5శాతం స్పెక్ట్రం వినియోగ చార్జీలు, 8 శాతం లైసెన్స్‌ ఫీజుగా చెల్లించాలి. ఈ మొత్తాన్ని టెలికాం శాఖకు చెల్లించాలి. 1999 తర్వాత ఆదాయంలో వాటా విధానం (రెవెన్యూ షేరింగ్‌) కింద ఏజీఆర్‌ ఛార్జీలను ప్రవేశపెట్టారు. ఈ ఛార్జీలను లెక్కగట్టే విధానంపైనే అసలు వివాదం రాజుకొంది.

బకాయిల వివరాలు ఇలా..

నవంబర్​లో జరిగిన పార్లమెంట్​ సమావేశాల్లో టెలికాం మంత్రి రవిశంకర్ ప్రసాద్.. టెల్కోలు​ మొత్తం రూ.1.47 లక్షల కోట్లు బకాయిపడ్డట్లు ప్రకటించారు. ప్రస్తుతానికి ఈ అపరాధ రుసుములపై వడ్డీ తగ్గించే ప్రతిపాదనేదీ లేదనే విషయాన్నీ వెల్లడించారు.

టెలికాం కంపెనీలు చెల్లించాల్సిన ఈ బకాయిలలో రూ.92,642 కోట్లు చెల్లింపులు చేయని లైసెన్సు రుసుములు, రూ.55,054 కోట్లు స్పెక్ట్రమ్​ వినియోగ బకాయిలుగా పేర్కొన్నారు రవి శంకర్ ప్రసాద్.

కంపెనీల వారీగా బాకాయిలు ఇలా..

  • ఎయిర్​టెల్ రూ.21,682.13 కోట్లు
  • వొడాఫోన్ రూ.19,823.71 కోట్లు
  • ఆర్​కాం రూ.16,456.47 కోట్లు
  • బీఎస్​ఎన్​ఎల్​ రూ.2,098.72 కోట్లు
  • ఎంటీఎన్​ఎల్​ రూ.2,537.48 కోట్లు
Last Updated : Mar 1, 2020, 6:54 AM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.