ETV Bharat / business

అత్యంత యువ సంపన్నుల్లో బెంగళూరోళ్లు భళా!

అత్యంత యువ సంపన్నులకు బెంగళూరు కేంద్రంగా మారింది. ముఖ్యంగా స్వయం కృషితో సాంకేతిక ఆధారంగా పని చేసే అంకుర సంస్థలను స్థాపించి.. బిలియనీర్లుగా మారిన యువత ఇక్కడే ఎక్కువగా ఉండటం విశేషం. బెంగళూరులోని యువ పారిశ్రామిక వేత్తలు స్థాపించిన సంస్థలు, వారి ఆస్తుల వివరాలు మీ కోసం.

author img

By

Published : Dec 22, 2019, 7:00 AM IST

STARTUP CAPITAL
అత్యంత యువ సంపన్నుల్లో బెంగళూరోళ్లు భళా!

భారత ఐటీ నగరంగా పేరొందిన బెంగళూరు ఇప్పుడు సంస్థల నిలయంగా మారింది. ఇటీవల ప్రకటించిన.. హరూన్​ ఇండియా అత్యధిక సంపన్నుల జాబితా 2019లో 40 ఏళ్లలోపు బిలియనీర్లలో తొలి 17 మందిలో 10 మంది బెంగళూరుకు చెందిన వారే కావడం విశేషం.

బెంగళూరులో జెరోధా స్థాపకుడు నితీశ్​ కామత్, ఫ్లిప్​కార్ట్ సహ వ్యవస్థాపకుడు సచిన్​ బన్సాల్​లు మిలీనియల్ బిలియనీర్లుగా జాబితాలో తొలి స్థానాల్లో ఉన్నారు.

బెంగళూరు సంపన్న అంకురాల వ్యవస్థాపకులు..

నితిన్​ కామత్​

బెంగళూరులో అత్యంత పిన్న వయస్సు బిలియనీర్​గా నితిన్​ కామత్​ ఉన్నారు. ప్రముఖ డిస్కౌంట్​ బ్రోకరేజీ సంస్థ జెరోధా వ్యవస్థాపకుల్లో ఈయన ఒకరు. ప్రస్తుతం నితిన్​ కామత్​ వయస్సు 39 ఏళ్లు. సంపద దాదాపు రూ.6,600 కోట్లు.

2010లో స్థాపించిన జెరోధా బ్రోకరేజి ఇప్పుడు.. 15 శాతం వాటాతో భారత రిటైల్ ట్రేడింగ్​లో అగ్రగామిగా నిలిచింది. జెరోధాకు దాదాపు 15 లక్షల మంది వినియోగదారులు ఉన్నారు.

నితిన్​ కాలేజీ రోజుల నుంచే స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ చేయడం ప్రారంభించాడు. కొన్నాళ్లు టెలిమార్కెటింగ్ ఎగ్జిక్యుటివ్​గా పనిచేసిన నితిన్... 'జెరోధా' నెలకొల్పిన తర్వాత వెనుదిరిగి చూసుకోలేదు.

సచిన్​ బన్సాల్​

ఈ జాబితాలో రూ.6,100 కోట్లతో సచిన్​ బన్సాల్​, రూ.5,500 కోట్లతో బిన్నీ బన్సాల్​ తర్వాతి స్థానాల్లో ఉన్నారు. ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్​లో ఉన్నత స్థాయి ఉద్యోగాలు వీడి దేశీయ ఈ కామర్స్​ సంస్థ ఫ్లిప్​కార్ట్​ను ప్రారంభించారు. అంచెలంచెలుగా ఎదుగుతూ దేశీయ దిగ్గజంగా ఫ్లిప్​కార్ట్​ అవతరించింది. ఫ్లిప్​కార్ట్​లో 77 శాతం వాటాను గత ఏడాది అమెరికాకు చెందిన వాల్​మార్ట్​ కొనుగోలు చేసింది.

ఇందులో సచిన్​ బన్సాల్​కు చెందిన 5.5-6 శాతం వాటాను బిలియన్​ డాలర్లకు విక్రయించారు. అప్పటికి ఫ్లిప్​కార్ట్​లో బిన్నీ బన్సాల్​ వాటా 700-800 మిలియన్​ డాలర్లుగా ఉన్నట్లు అంచనా.

నిఖిల్​​ కామత్​

నితిన్​ కామత్​ సోదరుడు నిఖిల్​ కామత్​ బెంగళూరులో అత్యంత యువ సంపన్నుల్లో నాలుగో స్థానంలో ఉన్నారు. ఈయన సంపద 4,400 కోట్లుగా అంచనా. నిఖిల్​ ట్రూబెకాన్​, జెరోధాల వ్యవస్థాపకుల్లో ఒకరు.

రిజూ రవీంద్రన్​

ఆన్​లైన్​ లెర్నింగ్​ యాప్​ 'బైజూస్' సహ వ్యవస్థాపకుడే రిజూ రవీంద్రన్​. ప్రస్తుతం ఈయన సంపద రూ.3,600 కోట్లుగా అంచనా. బెంగళూరు కేంద్రంగా పని చేస్తోన్న 'థింక్​ & లెర్నింగ్​ ప్రైవేట్​ లిమిటెడ్'​కు చెందిన ఈ అంకుర సంస్థ విలువ జులైలో 5.5 బిలియన్​ డాలర్లుగా ఉంది.

బైజూస్​ సహ వ్యవస్థాపకురాలు, బైజూ రవీంద్రనర్​ భార్య దివ్యా గోకుల్​నాథ్​ కూడా అత్యంత యువ ధనవంతుల్లో ఒకరు. ఈమె సంపద దాదాపు రూ.1,800 కోట్లుగా అంచనా.

ఫ్లిప్​కార్ట్ మాజీ ఎగ్జిక్యూటివ్​లు

ఫ్లిప్​కార్ట్​ మాజీ ఎగ్జిక్యూటివ్​లు అమోద్​ మాల్వియా, సుజీత్​ కుమార్, వైభవ్​ గుప్తాలు.. 40 ఏళ్ల లోపు బిలియనీర్ల జాబితాలో చోటు సంపాదించారు. వీరి సంపద ఒక్కొక్కరికి రూ.3,500 కోట్లుగా అంచనా.

భవిశ్​ అగర్వాల్

ప్రముఖ ఆన్​లైన్​ క్యాబ్​ సేవల సంస్థ వ్యవస్థాపకుడు భవిశ్​ అగర్వాల్ ఈ జాబితాలో ఉన్నారు. ఈయన సంపద రూ.3,100 కోట్లుగా అంచనా. మూడేళ్ల పాటు మైక్రోసాఫ్ట్​లో ఉద్యోగం చేసిన తర్వాత ఈయన.. 2010లో తన సొంత కంపెనీ 'ఏఎన్​ఐ టెక్నాలజీస్'​ను స్థాపించారు. ఈ సంస్థ వేగంగా అభివృద్ధి చెందిన అంకురాలలో ఒకటిగా నిలిచింది. ఓలా సహ వ్యవస్థాపకుడు, ఛీఫ్​ టెక్నాలజీ అధికారి అంకిత్​ భేతి కూడా అత్యంత సంపన్నుల జాబితాలో ఉన్నారు. ఈయన సంపద రూ.1,400 కోట్లుగా అంచనా.

స్వయం కృషితో.. కోటీశ్వరులుగా ఎదిగిన వారిలో ఎక్కువ మంది సాంకేతికతతో కూడుకున్న సంస్థలనే నమ్ముకోవడం విశేషం. 40 ఏళ్లలోపు యువ పారిశ్రామికవేత్తల సగటు వయస్సు 35. వీరి సంపద మొత్తం రూ.40,000 కోట్లు. ఒక్కొక్కరి సగటు సంపద రూ.4,200 కోట్లు.

40 ఏళ్లలోపు పారిశ్రామికవేత్తల్లో.. అత్యంత పిన్న వయస్కుడు ఓయో రూమ్స్​ వ్యవస్థాపకుడు రితేశ్​ అగర్వాల్ (దిల్లీ)​. ఈయన సంపద రూ. 7,500 కోట్లు. అత్యం సంపన్న యువ పారిశ్రామిక వేత్త దివ్యాంక్​ తురాకియా(దుబాయ్​). ఈయన 2010లో 'మీడియా డాట్‌నెట్‌'ను స్థాపించారు. ప్రపంచంలోని ఐదు అతిపెద్ద ఆన్‌లైన్‌ వ్యాపార ప్రకటనల సంస్థల్లో మీడియా డాట్‌నెట్‌ ఒకటి.

2016లో మీడియా డాట్‌ నెట్‌ను దివ్యాంక్‌ విక్రయించారు. ప్రపంచవ్యాప్తంగా ఆన్‌లైన్‌ వ్యాపార ప్రకటనల విభాగంలో చోటుచేసుకున్న మూడో అతిపెద్ద విక్రయ లావాదేవీగా ఇది నిలిచింది. దివ్యాంక్ సంపద దాదాపు రూ.13,000 కోట్లుగా అంచనా.

ఇదీ చూడండి:దేశంలో అధిక వేతనాలు ఉన్న నగరాల్లో ఇదే టాప్!​

భారత ఐటీ నగరంగా పేరొందిన బెంగళూరు ఇప్పుడు సంస్థల నిలయంగా మారింది. ఇటీవల ప్రకటించిన.. హరూన్​ ఇండియా అత్యధిక సంపన్నుల జాబితా 2019లో 40 ఏళ్లలోపు బిలియనీర్లలో తొలి 17 మందిలో 10 మంది బెంగళూరుకు చెందిన వారే కావడం విశేషం.

బెంగళూరులో జెరోధా స్థాపకుడు నితీశ్​ కామత్, ఫ్లిప్​కార్ట్ సహ వ్యవస్థాపకుడు సచిన్​ బన్సాల్​లు మిలీనియల్ బిలియనీర్లుగా జాబితాలో తొలి స్థానాల్లో ఉన్నారు.

బెంగళూరు సంపన్న అంకురాల వ్యవస్థాపకులు..

నితిన్​ కామత్​

బెంగళూరులో అత్యంత పిన్న వయస్సు బిలియనీర్​గా నితిన్​ కామత్​ ఉన్నారు. ప్రముఖ డిస్కౌంట్​ బ్రోకరేజీ సంస్థ జెరోధా వ్యవస్థాపకుల్లో ఈయన ఒకరు. ప్రస్తుతం నితిన్​ కామత్​ వయస్సు 39 ఏళ్లు. సంపద దాదాపు రూ.6,600 కోట్లు.

2010లో స్థాపించిన జెరోధా బ్రోకరేజి ఇప్పుడు.. 15 శాతం వాటాతో భారత రిటైల్ ట్రేడింగ్​లో అగ్రగామిగా నిలిచింది. జెరోధాకు దాదాపు 15 లక్షల మంది వినియోగదారులు ఉన్నారు.

నితిన్​ కాలేజీ రోజుల నుంచే స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ చేయడం ప్రారంభించాడు. కొన్నాళ్లు టెలిమార్కెటింగ్ ఎగ్జిక్యుటివ్​గా పనిచేసిన నితిన్... 'జెరోధా' నెలకొల్పిన తర్వాత వెనుదిరిగి చూసుకోలేదు.

సచిన్​ బన్సాల్​

ఈ జాబితాలో రూ.6,100 కోట్లతో సచిన్​ బన్సాల్​, రూ.5,500 కోట్లతో బిన్నీ బన్సాల్​ తర్వాతి స్థానాల్లో ఉన్నారు. ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్​లో ఉన్నత స్థాయి ఉద్యోగాలు వీడి దేశీయ ఈ కామర్స్​ సంస్థ ఫ్లిప్​కార్ట్​ను ప్రారంభించారు. అంచెలంచెలుగా ఎదుగుతూ దేశీయ దిగ్గజంగా ఫ్లిప్​కార్ట్​ అవతరించింది. ఫ్లిప్​కార్ట్​లో 77 శాతం వాటాను గత ఏడాది అమెరికాకు చెందిన వాల్​మార్ట్​ కొనుగోలు చేసింది.

ఇందులో సచిన్​ బన్సాల్​కు చెందిన 5.5-6 శాతం వాటాను బిలియన్​ డాలర్లకు విక్రయించారు. అప్పటికి ఫ్లిప్​కార్ట్​లో బిన్నీ బన్సాల్​ వాటా 700-800 మిలియన్​ డాలర్లుగా ఉన్నట్లు అంచనా.

నిఖిల్​​ కామత్​

నితిన్​ కామత్​ సోదరుడు నిఖిల్​ కామత్​ బెంగళూరులో అత్యంత యువ సంపన్నుల్లో నాలుగో స్థానంలో ఉన్నారు. ఈయన సంపద 4,400 కోట్లుగా అంచనా. నిఖిల్​ ట్రూబెకాన్​, జెరోధాల వ్యవస్థాపకుల్లో ఒకరు.

రిజూ రవీంద్రన్​

ఆన్​లైన్​ లెర్నింగ్​ యాప్​ 'బైజూస్' సహ వ్యవస్థాపకుడే రిజూ రవీంద్రన్​. ప్రస్తుతం ఈయన సంపద రూ.3,600 కోట్లుగా అంచనా. బెంగళూరు కేంద్రంగా పని చేస్తోన్న 'థింక్​ & లెర్నింగ్​ ప్రైవేట్​ లిమిటెడ్'​కు చెందిన ఈ అంకుర సంస్థ విలువ జులైలో 5.5 బిలియన్​ డాలర్లుగా ఉంది.

బైజూస్​ సహ వ్యవస్థాపకురాలు, బైజూ రవీంద్రనర్​ భార్య దివ్యా గోకుల్​నాథ్​ కూడా అత్యంత యువ ధనవంతుల్లో ఒకరు. ఈమె సంపద దాదాపు రూ.1,800 కోట్లుగా అంచనా.

ఫ్లిప్​కార్ట్ మాజీ ఎగ్జిక్యూటివ్​లు

ఫ్లిప్​కార్ట్​ మాజీ ఎగ్జిక్యూటివ్​లు అమోద్​ మాల్వియా, సుజీత్​ కుమార్, వైభవ్​ గుప్తాలు.. 40 ఏళ్ల లోపు బిలియనీర్ల జాబితాలో చోటు సంపాదించారు. వీరి సంపద ఒక్కొక్కరికి రూ.3,500 కోట్లుగా అంచనా.

భవిశ్​ అగర్వాల్

ప్రముఖ ఆన్​లైన్​ క్యాబ్​ సేవల సంస్థ వ్యవస్థాపకుడు భవిశ్​ అగర్వాల్ ఈ జాబితాలో ఉన్నారు. ఈయన సంపద రూ.3,100 కోట్లుగా అంచనా. మూడేళ్ల పాటు మైక్రోసాఫ్ట్​లో ఉద్యోగం చేసిన తర్వాత ఈయన.. 2010లో తన సొంత కంపెనీ 'ఏఎన్​ఐ టెక్నాలజీస్'​ను స్థాపించారు. ఈ సంస్థ వేగంగా అభివృద్ధి చెందిన అంకురాలలో ఒకటిగా నిలిచింది. ఓలా సహ వ్యవస్థాపకుడు, ఛీఫ్​ టెక్నాలజీ అధికారి అంకిత్​ భేతి కూడా అత్యంత సంపన్నుల జాబితాలో ఉన్నారు. ఈయన సంపద రూ.1,400 కోట్లుగా అంచనా.

స్వయం కృషితో.. కోటీశ్వరులుగా ఎదిగిన వారిలో ఎక్కువ మంది సాంకేతికతతో కూడుకున్న సంస్థలనే నమ్ముకోవడం విశేషం. 40 ఏళ్లలోపు యువ పారిశ్రామికవేత్తల సగటు వయస్సు 35. వీరి సంపద మొత్తం రూ.40,000 కోట్లు. ఒక్కొక్కరి సగటు సంపద రూ.4,200 కోట్లు.

40 ఏళ్లలోపు పారిశ్రామికవేత్తల్లో.. అత్యంత పిన్న వయస్కుడు ఓయో రూమ్స్​ వ్యవస్థాపకుడు రితేశ్​ అగర్వాల్ (దిల్లీ)​. ఈయన సంపద రూ. 7,500 కోట్లు. అత్యం సంపన్న యువ పారిశ్రామిక వేత్త దివ్యాంక్​ తురాకియా(దుబాయ్​). ఈయన 2010లో 'మీడియా డాట్‌నెట్‌'ను స్థాపించారు. ప్రపంచంలోని ఐదు అతిపెద్ద ఆన్‌లైన్‌ వ్యాపార ప్రకటనల సంస్థల్లో మీడియా డాట్‌నెట్‌ ఒకటి.

2016లో మీడియా డాట్‌ నెట్‌ను దివ్యాంక్‌ విక్రయించారు. ప్రపంచవ్యాప్తంగా ఆన్‌లైన్‌ వ్యాపార ప్రకటనల విభాగంలో చోటుచేసుకున్న మూడో అతిపెద్ద విక్రయ లావాదేవీగా ఇది నిలిచింది. దివ్యాంక్ సంపద దాదాపు రూ.13,000 కోట్లుగా అంచనా.

ఇదీ చూడండి:దేశంలో అధిక వేతనాలు ఉన్న నగరాల్లో ఇదే టాప్!​

RESTRICTION SUMMARY: PART MUST CREDIT WOI; PART NO ACCESS DES MOINES; PART NO USE BY US BROADCAST NETWORKS, PART NO RE-SALE, RE-USE OR ARCHIVE; PART MUST CREDIT POLK COUNTY JAIL
SHOTLIST:
WOI - MUST CREDIT WOI, NO ACCESS DES MOINES MARKET, NO USE BY US BROADCAST NETWORKS, NO RE-SALE, RE-USE OR ARCHIVE
Clive, Iowa - 20 December 2019
1. Wide of Michael Venema, Clive police chief, entered news conference room
++VIDEO AS INCOMING (CAMERA JUMPS AROUND BEFORE FINDING FOCUS)++
2. SOUNDBITE (English) Michael Venema, Clive Police Chief:
"On December 9th, shortly before 5 p.m., a 14-year-old girl was walking on the sidewalk on her way to an activity at Indian Hills Junior High School. During that time, a vehicle left the, the roadway and ran this girl over. She suffered numerous injuries. The driver of the vehicle left the scene without rendering aid to the girl."
POLK COUNTY JAIL HANDOUT - MUST CREDIT POLK COUNTY JAIL
Date unknown - Des Moines, Iowa
3. STILL of suspect Nicole Marie Poole Franklin
WOI - MUST CREDIT WOI, NO ACCESS DES MOINES MARKET, NO USE US BROADCAST NETWORKS, NO RE-SALE, RE-USE OR ARCHIVE
Clive, Iowa - 20 December 2019
4. SOUNDBITE (English) Michael Venema, Clive Police Chief:
"Earlier, the Clive Police Department had requested the public's help in locating the driver. At that time, it appeared to be a hit and run accident. Yesterday, the Clive Police Department identified the driver of the suspect vehicle as Nicole Marie Poole Franklin, 42, of Des Moines."
++SOUNDBITES SEPARATED BY BLACK++
5. SOUNDBITE (English) Michael Venema, Clive Police Chief:
"Detectives interviewed her at the Polk County Jail, where she was being held on other charges. During the interview, Franklin admitted to being not only the driver of the car that struck this girl, but also that she had done so intentionally. Franklin told investigators that she ran the girl over because she was, in her words, a Mexican."
++SOUNDBITES SEPARATED BY BLACK++
6. SOUNDBITE (English) Michael Venema, Clive Police Chief:
"She went on to make a number of derogatory statements about Latinos to our investigators. Franklin was charged with attempted murder and is currently being held in the Polk County Jail."
++SOUNDBITES SEPARATED BY BLACK++
7. SOUNDBITE (English) Michael Venema, Clive Police Chief:
"I want to say in the strongest terms possible that there is no place in our community, or any other for that matter, for this type of hatred or violence."
++SOUNDBITES SEPARATED BY BLACK++
8. SOUNDBITE (English) Michael Venema, Clive Police Chief:
"Obviously, she made a decision at that moment in time when she saw this young girl and made a determination about her ethnicity and chose to purposely do that."
STORYLINE:
A Des Moines woman was charged with attempted murder after she told police that she intentionally ran over a 14-year-old girl because she believed the teenager was Mexican, authorities said Friday.
Natalia Miranda suffered a concussion and severe bruising in the attack but is expected to make a full recovery.
Clive Police Chief Michael Venema said Friday during a news conference that Nicole Marie Poole Franklin, 42, admitted to steering her SUV onto a sidewalk on Dec. 9 in the suburban Des Moines community and running over the teenager, who was walking to school to watch a basketball game. Franklin then fled the scene.
Franklin made several derogatory statements about Latinos during a police interview in which she admitted she intentionally ran over the teenager, police said.
"I want to say in the strongest terms possible that there is no place in our community ... for this type of hatred or violence," Venema said.
Natalia was hospitalized for two days.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.