ETV Bharat / business

ఎయిర్​టెల్​కు 30.6 లక్షల కొత్త యూజర్లు

టెలికాం దిగ్గజం ఎయిర్​టెల్​ యూజర్ల సంఖ్య అక్టోబర్​లోనూ భారీగా పెరిగింది. అదే నెలలో రిలయన్స్​ జియోకు 20.2లక్షల మంది యూజర్లు తోడయ్యారు. వీ (వొడాఫోన్ ఐడియా) మాత్రం 20.7 లక్షల మంది యూజర్లను కోల్పోయింది. ట్రాయ్​ నెలవారీ నివేదికలో ఈ విషయాలు వెల్లడయ్యాయి.

author img

By

Published : Dec 24, 2020, 11:51 AM IST

Airtel user base rise in October
అక్టోబర్​లో భారీగా పెరిగిన ఎయిర్​టెల్ యూజర్లు

దేశంలో టెలికాం యూజర్ల సంఖ్య అక్టోబర్​లో 1.17 బిలియన్లకు పెరిగింది. టెలికాం నియంత్రణ సంస్థ 'ట్రాయ్​' గణాంకాల్లో ఈ విషయం వెల్లడింది. ఈ నివేదిక ప్రకారం.. భారతీ ఎయిర్​టెల్​కు వరుసగా రెండో నెలలోనూ(అక్టోబర్​లో) అత్యధికంగా 30.6 లక్షల మంది కొత్త యూజర్లు పెరిగారు. అక్టోబర్ నెలకుగాను.. కొత్త యూజర్ల పెరుగుదలలో 20.2 లక్షల మందితో రిలయన్స్ జియో రెండో స్థానంలో నిలించింది. వీ(వొడాఫోన్ ఐడియా) మాత్రం అక్టోబర్​లో 20.7 లక్షల మంది యూజర్లను కోల్పోయింది.

మార్కెట్ లీడర్​గా జియో..

మొత్తం మీద అక్టోబర్​లో 40.6 కోట్ల మంది యూజర్లు, 35 శాతం మార్కెట్ వాటాతో రిలయన్స్ జియో దేశంలో అతిపెద్ద టెలికాం సంస్థగా నిలిచింది. ఎయిర్​టెల్ 33.02 కోట్ల మంది యూజర్లు 29 శాతం మార్కెట్ వాటాతో రెండో స్థానంలో ఉంది. 29.3 కోట్ల మంది యూజర్లు, 25 శాతం మార్కెట్ వాటాతో వీ మూడో స్థానంతో సరిపెట్టుకుంది.

యాక్టివ్ యూజర్​ బేస్​ పరంగా.. 97 శాతంతో ఎయిర్​టెల్ అగ్రస్థానంలో నిలిచింది. 89 శాతంతో వీ రెండో స్థానంలో ఉంది. జియో మాత్రం 79 శాతానికి పరిమితమై మూడో స్థానంలో ఉన్నట్లు ట్రాయ్​ వివరించింది.

వైర్​లైన్​లో బీఎస్​ఎన్​ఎల్​ టాప్​..

వైర్​లైన్​ సేవల్లో రిలయన్స్ జియోకు అక్టోబర్​లో కొత్తగా 2.46లక్షల మంది యూజర్లు పెరిగారు. దీనితో మొత్తం యూజర్ల సంఖ్య 20.3 లక్షలకు చేరింది. అదే నెలలో ఎయిర్​టెల్​కు 48 వేల మంది యూజర్లు పెరిగారు. మొత్తం యూజర్ల సంఖ్య 40.4 లక్షలు దాటింది. ఇదే సమయంలో ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్​ఎన్​ఎల్​కు 1.76లక్షల మంది యూజర్లు పెరిగి.. మొత్తం 70.5 లక్షల మంది వినియోగదారులతో ఈ విభాగంలో అగ్రస్థానంలో నిలిచింది.

ఇదీ చూడండి:అలీబాబా గ్రూప్​పై చైనా రెగ్యులేటరీ దర్యాప్తు

దేశంలో టెలికాం యూజర్ల సంఖ్య అక్టోబర్​లో 1.17 బిలియన్లకు పెరిగింది. టెలికాం నియంత్రణ సంస్థ 'ట్రాయ్​' గణాంకాల్లో ఈ విషయం వెల్లడింది. ఈ నివేదిక ప్రకారం.. భారతీ ఎయిర్​టెల్​కు వరుసగా రెండో నెలలోనూ(అక్టోబర్​లో) అత్యధికంగా 30.6 లక్షల మంది కొత్త యూజర్లు పెరిగారు. అక్టోబర్ నెలకుగాను.. కొత్త యూజర్ల పెరుగుదలలో 20.2 లక్షల మందితో రిలయన్స్ జియో రెండో స్థానంలో నిలించింది. వీ(వొడాఫోన్ ఐడియా) మాత్రం అక్టోబర్​లో 20.7 లక్షల మంది యూజర్లను కోల్పోయింది.

మార్కెట్ లీడర్​గా జియో..

మొత్తం మీద అక్టోబర్​లో 40.6 కోట్ల మంది యూజర్లు, 35 శాతం మార్కెట్ వాటాతో రిలయన్స్ జియో దేశంలో అతిపెద్ద టెలికాం సంస్థగా నిలిచింది. ఎయిర్​టెల్ 33.02 కోట్ల మంది యూజర్లు 29 శాతం మార్కెట్ వాటాతో రెండో స్థానంలో ఉంది. 29.3 కోట్ల మంది యూజర్లు, 25 శాతం మార్కెట్ వాటాతో వీ మూడో స్థానంతో సరిపెట్టుకుంది.

యాక్టివ్ యూజర్​ బేస్​ పరంగా.. 97 శాతంతో ఎయిర్​టెల్ అగ్రస్థానంలో నిలిచింది. 89 శాతంతో వీ రెండో స్థానంలో ఉంది. జియో మాత్రం 79 శాతానికి పరిమితమై మూడో స్థానంలో ఉన్నట్లు ట్రాయ్​ వివరించింది.

వైర్​లైన్​లో బీఎస్​ఎన్​ఎల్​ టాప్​..

వైర్​లైన్​ సేవల్లో రిలయన్స్ జియోకు అక్టోబర్​లో కొత్తగా 2.46లక్షల మంది యూజర్లు పెరిగారు. దీనితో మొత్తం యూజర్ల సంఖ్య 20.3 లక్షలకు చేరింది. అదే నెలలో ఎయిర్​టెల్​కు 48 వేల మంది యూజర్లు పెరిగారు. మొత్తం యూజర్ల సంఖ్య 40.4 లక్షలు దాటింది. ఇదే సమయంలో ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్​ఎన్​ఎల్​కు 1.76లక్షల మంది యూజర్లు పెరిగి.. మొత్తం 70.5 లక్షల మంది వినియోగదారులతో ఈ విభాగంలో అగ్రస్థానంలో నిలిచింది.

ఇదీ చూడండి:అలీబాబా గ్రూప్​పై చైనా రెగ్యులేటరీ దర్యాప్తు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.