ETV Bharat / business

వారందరితో డేటాను పంచుకుంటాం: ట్విట్టర్

కరోనాపై పోరులో భాగంగా పరిశోధకులతో తమ డేటాను పంచుకోనున్నట్టు ట్విట్టర్ పేర్కొంది​. ఈ సామాజిక మాధ్యమంలో నిత్యం కొన్ని లక్షల ట్వీట్లు వస్తుంటాయి. కరోనాపైనా అనేక మంది మేధావులు, పరిశోధకులు, శాస్త్రవేత్తలు ట్వీట్స్​ చేస్తుంటారు. తమ జ్ఞానాన్ని ఇతరులతో పంచుకుంటుంటారు. ఈ రకమైన సమాచారాన్ని ఒక్కచోటుకు చేర్చడానికి ట్విట్టర్ సిద్ధపడింది.

author img

By

Published : Apr 30, 2020, 3:44 PM IST

Twitter offers data to researchers studying virus
వారందరికీ డేటా ఇవ్వనున్న ట్విట్టర్​.. కారణం!

కరోనాపై పోరుకు తన వంతు సహాయం అందిస్తోంది సామాజిక మాధ్యమ దిగ్గజం ట్విట్టర్​. ప్రపంచ మహమ్మారిపై మరింత సమాచారం, అవగాహన పొందేందుకు తమ డేటాను పరిశోధకులతో పంచుకోనున్నట్లు ప్రకటించింది. ట్విట్టర్​ వేదికగా జరిగే సంభాషణలు.. వారి పరిశోధనలకు ఎంతో ఉపయోగపడతాయని పేర్కొంది.

వైరస్​తో కలిగే అనారోగ్యం, అసత్య వార్తలను నిరోధించడం, సంక్షోభంపై సమాచారాన్ని ఒక్క చోటకు చేర్చడం ఈ ప్రాజెక్ట్​లో భాగం.

"ఇది ప్రతిరోజు కొన్ని మిలయన్​ ట్వీట్లను చూడగలిగే ప్రత్యేకమైన డేటా సెట్​. ట్విట్టర్​లో జరిగే సంభాషణలు ఎంతో ఉపయోగకరమైనవి. కరోనాపై పోరుకు ప్రపంచ దేశాల్లోని ప్రజల్లో అవగాహన పెంచేందుకు ఇవి ఎంతో ఉపయోగపడుతాయి."

- ట్విట్టర్​

ఈ డేటాతో శాస్త్రవేత్తలు కృత్రిమ మేథస్సు సాధనాలను రూపొందించవచ్చు. వైరస్​ను కట్టడి చేయడానికి ఇవి ఉపయోగపడతాయి. ప్రజా వేదికల్లో జరిగే సంభాషణల ద్వారా అనేక విషయాలు త్వరగా నేర్చుకోవచ్చని, సమస్యలను వేగంగా పరిష్కరించవచ్చని ట్విట్టర్​ సీఈఓ జాక్​ డోర్సే అభిప్రయాపడ్డారు. ఫలితంగా మహమ్మారిపై పోరులో అందరం కలిసే ఉన్నట్టు ప్రజలకు అర్థమవుతుందని పేర్కొన్నారు.

ఇదీ చూడండి:- ఉద్యోగం కోల్పోతే బీమా హామీ ల‌భిస్తుందా?

కరోనాపై పోరుకు తన వంతు సహాయం అందిస్తోంది సామాజిక మాధ్యమ దిగ్గజం ట్విట్టర్​. ప్రపంచ మహమ్మారిపై మరింత సమాచారం, అవగాహన పొందేందుకు తమ డేటాను పరిశోధకులతో పంచుకోనున్నట్లు ప్రకటించింది. ట్విట్టర్​ వేదికగా జరిగే సంభాషణలు.. వారి పరిశోధనలకు ఎంతో ఉపయోగపడతాయని పేర్కొంది.

వైరస్​తో కలిగే అనారోగ్యం, అసత్య వార్తలను నిరోధించడం, సంక్షోభంపై సమాచారాన్ని ఒక్క చోటకు చేర్చడం ఈ ప్రాజెక్ట్​లో భాగం.

"ఇది ప్రతిరోజు కొన్ని మిలయన్​ ట్వీట్లను చూడగలిగే ప్రత్యేకమైన డేటా సెట్​. ట్విట్టర్​లో జరిగే సంభాషణలు ఎంతో ఉపయోగకరమైనవి. కరోనాపై పోరుకు ప్రపంచ దేశాల్లోని ప్రజల్లో అవగాహన పెంచేందుకు ఇవి ఎంతో ఉపయోగపడుతాయి."

- ట్విట్టర్​

ఈ డేటాతో శాస్త్రవేత్తలు కృత్రిమ మేథస్సు సాధనాలను రూపొందించవచ్చు. వైరస్​ను కట్టడి చేయడానికి ఇవి ఉపయోగపడతాయి. ప్రజా వేదికల్లో జరిగే సంభాషణల ద్వారా అనేక విషయాలు త్వరగా నేర్చుకోవచ్చని, సమస్యలను వేగంగా పరిష్కరించవచ్చని ట్విట్టర్​ సీఈఓ జాక్​ డోర్సే అభిప్రయాపడ్డారు. ఫలితంగా మహమ్మారిపై పోరులో అందరం కలిసే ఉన్నట్టు ప్రజలకు అర్థమవుతుందని పేర్కొన్నారు.

ఇదీ చూడండి:- ఉద్యోగం కోల్పోతే బీమా హామీ ల‌భిస్తుందా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.