ETV Bharat / business

టాటాసన్స్ చేతికి ఎయిర్ ​ఇండియా పగ్గాలు?

author img

By

Published : Aug 15, 2020, 5:21 AM IST

Updated : Aug 15, 2020, 6:07 AM IST

అప్పుల ఊబిలో కూరుకుపోయిన.. ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిర్​ ఇండియా కొనుగోలుకు టాటా సన్స్ ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. ఈ నెలాఖరుతో ఎయిర్ ​ఇండియా కొనుగోలుకు బిడ్లు దాఖలు చేసే సమయం ముగియనుండటం వల్ల ఆ దిశగా టాటాసన్స్​ ముమ్మరంగా కసరత్తు చేస్తున్నట్లు సమాచారం.

tata sons ready to buy air india
ఎయిర్​ఇండియా కొనుగోలుకు టాటా ఆసక్తి

ఎయిర్‌ ఇండియా కొనుగోలుకు బిడ్లు దాఖలు చేయడానికి ఈ నెలతో గడువు ముగియనుంది. ఈ నేపథ్యంలో టాటాసన్స్‌ బిడ్ దాఖలు చేసే అవకాశం ఉందని వార్తలు వెలువడుతున్నాయి. ఇప్పటికే టాటాసన్స్‌కు విమానయాన రంగంలో వ్యాపారాలు ఉన్నాయి. దీనికి తోడు స్టీల్‌, ఆటోమొబైల్‌, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ రంగాల్లో కూడా మంచి పేరుంది.

'దీనిలో మరొక భాగస్వామిని చేర్చుకొనే ప్రతిపాదన ఏదీ లేదు' అని టాటా సన్స్‌ ప్రతినిధి ఒకరు వెల్లడించడం గమనార్హం.

ప్రస్తుతం టాటాసన్స్‌ ప్రభుత్వ ప్రతిపాదనలపై ఓ అంచనాకు వచ్చే పనిలో ఉంది. మార్చి 2019 నాటికి ఎయిర్‌ ఇండియాకు దాదాపు 7.78 బిలియన్‌ డాలర్ల రుణం ఉంది. ప్రభుత్వం కూడా చేతులెత్తేయడం వల్ల విక్రయం ఖాయమైంది.

ఈ కంపెనీని కొనుగోలు చేసేవారు కచ్చితంగా 3.10 బిలియన్‌ డాలర్ల రుణాన్ని చెల్లించాల్సి ఉంటుందని.. మిగిలినది ఎస్‌పీవీకి బదిలీ చేస్తామని ప్రభుత్వం వెల్లడించింది. 2018లోనే దీనిని విక్రయించాలని ప్రయత్నించినా ప్రభుత్వం విఫలమైంది. మరోసారి ఈ ఏడాది ప్రయత్నించగా కొవిడ్‌ కారణంగా జాప్యం జరిగింది.

ఇదీ చూడండి:ఆర్బీఐ నుంచి కేంద్రానికి రూ.57 వేల కోట్లు

ఎయిర్‌ ఇండియా కొనుగోలుకు బిడ్లు దాఖలు చేయడానికి ఈ నెలతో గడువు ముగియనుంది. ఈ నేపథ్యంలో టాటాసన్స్‌ బిడ్ దాఖలు చేసే అవకాశం ఉందని వార్తలు వెలువడుతున్నాయి. ఇప్పటికే టాటాసన్స్‌కు విమానయాన రంగంలో వ్యాపారాలు ఉన్నాయి. దీనికి తోడు స్టీల్‌, ఆటోమొబైల్‌, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ రంగాల్లో కూడా మంచి పేరుంది.

'దీనిలో మరొక భాగస్వామిని చేర్చుకొనే ప్రతిపాదన ఏదీ లేదు' అని టాటా సన్స్‌ ప్రతినిధి ఒకరు వెల్లడించడం గమనార్హం.

ప్రస్తుతం టాటాసన్స్‌ ప్రభుత్వ ప్రతిపాదనలపై ఓ అంచనాకు వచ్చే పనిలో ఉంది. మార్చి 2019 నాటికి ఎయిర్‌ ఇండియాకు దాదాపు 7.78 బిలియన్‌ డాలర్ల రుణం ఉంది. ప్రభుత్వం కూడా చేతులెత్తేయడం వల్ల విక్రయం ఖాయమైంది.

ఈ కంపెనీని కొనుగోలు చేసేవారు కచ్చితంగా 3.10 బిలియన్‌ డాలర్ల రుణాన్ని చెల్లించాల్సి ఉంటుందని.. మిగిలినది ఎస్‌పీవీకి బదిలీ చేస్తామని ప్రభుత్వం వెల్లడించింది. 2018లోనే దీనిని విక్రయించాలని ప్రయత్నించినా ప్రభుత్వం విఫలమైంది. మరోసారి ఈ ఏడాది ప్రయత్నించగా కొవిడ్‌ కారణంగా జాప్యం జరిగింది.

ఇదీ చూడండి:ఆర్బీఐ నుంచి కేంద్రానికి రూ.57 వేల కోట్లు

Last Updated : Aug 15, 2020, 6:07 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.