ETV Bharat / business

భరోసా ఇవ్వని ఉద్దీపనలు- నష్టాల్లో మార్కెట్లు

author img

By

Published : May 15, 2020, 9:33 AM IST

Updated : May 15, 2020, 10:27 AM IST

stock market open red
భరోసా ఇవ్వని ఉద్దీపనలు .. మార్కెట్లకు నష్టాలు

10:14 May 15

భరోసా ఇవ్వని ఉద్దీపనలు- నష్టాల్లో మార్కెట్లు

దేశీయ మార్కెట్లు ఒడుదొడుకుల మధ్య కొనసాగుతున్నాయి. తొలుత లాభాలతో ప్రారంభమైన మార్కెట్లు కొద్ది సేపటికే నష్టాల్లోకి జారుకున్నాయి. ప్రతికూల అంతర్జాతీయ సంకేతాలకు తోడు.... భారత్ అభియాన్ పథకం మార్కెట్ వర్గాలను మెప్పించలేకపోవడం, మదుపరులు ఆచితూచి వ్యవహరిస్తుండడమే ఇందుకు కారణం.  

బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్ 223 పాయింట్లు కోల్పోయి 30 వేల 899 వద్ద కొనసాగుతోంది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ 56 పాయింట్లు నష్టపోయి 9 వేల 85 వద్ద ట్రేడవుతోంది.

ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్​ ఆత్మ నిర్భర్​ భారత్ అభియాన్ పథకం రెండో విడతలో భాగంగా వలసకూలీలు, రైతులు, చిన్నవ్యాపారుల సంక్షేమం కోసం రూ.3.16 లక్షల కోట్ల ప్యాకేజీని ప్రకటించారు. బుధవారం ప్రకటించిన రూ.5.94 లక్షల కోట్ల ప్యాకేజీతో కలుపుకుంటే మొత్తం ప్యాకేజీ విలువ రూ.9,10,250 కోట్లవుతుంది. అయితే ఈ ఉద్దీపనలు... డిమాండ్​ను పెంచి ఆర్థిక వ్యవస్థను పుంజుకునేలా చేస్తాయనే భరోసాను ఇవ్వలేకపోతున్నాయి.  

లాభనష్టాల్లో...

ఓఎన్​జీసీ, టాటాస్టీల్​, భారతీ ఎయిర్​టెల్​, టైటాన్​, బ్రిటానియా, బీపీసీఎల్, టెక్ మహీంద్రా, సిప్లా రాణిస్తున్నాయి.

ఎమ్ అండ్ ఎమ్​, మారుతి సుజుకి, హెచ్​డీఎఫ్​సీ బ్యాంకు, ఐసీఐసీఐ బ్యాంకు, రిలయన్స్ ఇండస్ట్రీస్​, భారతీ ఇన్​ఫ్రాటెల్, జీ ఎంటైర్​టెన్​మెంట్ నష్టాల్లో ట్రేడవుతున్నాయి.

ఆసియా మార్కెట్లు

వాల్​స్ట్రీట్ లాభాలతో ముగిసింది. ఆసియా మార్కెట్లు షాంఘై, హాంగ్​కాంగ్​, టోక్యో, సియోల్​ కూడా లాభాలతో ట్రేడవుతున్నాయి.

ముడిచమురు

అంతర్జాతీయ మార్కెట్​లో ముడిచమురు ధర 1.47 శాతం పెరిగింది. ప్రస్తుతం బ్యారెల్ ధర 31.59 డాలర్లుగా ఉంది.  

09:24 May 15

భరోసా ఇవ్వని ఉద్దీపనలు ... ఊగిసలాడుతున్న మార్కెట్లు

దేశీయ మార్కెట్లు నష్టాలతో ప్రారంభమయ్యాయి. ప్రతికూల అంతర్జాతీయ సంకేతాలకు తోడు.... భారత్ అభియాన్ పథకం మార్కెట్ వర్గాలను మెప్పించలేకపోవడమే ఇందుకు కారణం.  

బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్ 97 పాయింట్లు కోల్పోయి 31 వేల 25 వద్ద కొనసాగుతోంది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ 26 పాయింట్లు నష్టపోయి 9 వేల 116 వద్ద ట్రేడవుతోంది.

ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్​ ఆత్మ నిర్భర్​ భారత్ అభియాన్ పథకం రెండో విడతలో భాగంగా వలసకూలీలు, రైతులు, చిన్నవ్యాపారుల సంక్షేమం కోసం రూ.3.16 లక్షల కోట్ల ప్యాకేజీని ప్రకటించారు. బుధవారం ప్రకటించిన రూ.5.94 లక్షల కోట్ల ప్యాకేజీతో కలుపుకుంటే మొత్తం ప్యాకేజీ విలువ రూ.9,10,250 కోట్లవుతుంది. అయితే ఈ ఉద్దీపనలు .... మార్కెట్ సెంటిమెంట్​ను బలపరచలేకపోయాయి.

లాభనష్టాల్లో...

ఓఎన్​జీసీ, బ్రిటానియా, బీపీసీఎల్, టెక్ మహీంద్రా, సిప్లా రాణిస్తున్నాయి.

ఎమ్ అండ్ ఎమ్​, మారుతి సుజుకి, భారతీ ఇన్​ఫ్రాటెల్, జీ ఎంటైర్​టెన్​మెంట్ నష్టాల్లో ట్రేడవుతున్నాయి.

10:14 May 15

భరోసా ఇవ్వని ఉద్దీపనలు- నష్టాల్లో మార్కెట్లు

దేశీయ మార్కెట్లు ఒడుదొడుకుల మధ్య కొనసాగుతున్నాయి. తొలుత లాభాలతో ప్రారంభమైన మార్కెట్లు కొద్ది సేపటికే నష్టాల్లోకి జారుకున్నాయి. ప్రతికూల అంతర్జాతీయ సంకేతాలకు తోడు.... భారత్ అభియాన్ పథకం మార్కెట్ వర్గాలను మెప్పించలేకపోవడం, మదుపరులు ఆచితూచి వ్యవహరిస్తుండడమే ఇందుకు కారణం.  

బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్ 223 పాయింట్లు కోల్పోయి 30 వేల 899 వద్ద కొనసాగుతోంది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ 56 పాయింట్లు నష్టపోయి 9 వేల 85 వద్ద ట్రేడవుతోంది.

ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్​ ఆత్మ నిర్భర్​ భారత్ అభియాన్ పథకం రెండో విడతలో భాగంగా వలసకూలీలు, రైతులు, చిన్నవ్యాపారుల సంక్షేమం కోసం రూ.3.16 లక్షల కోట్ల ప్యాకేజీని ప్రకటించారు. బుధవారం ప్రకటించిన రూ.5.94 లక్షల కోట్ల ప్యాకేజీతో కలుపుకుంటే మొత్తం ప్యాకేజీ విలువ రూ.9,10,250 కోట్లవుతుంది. అయితే ఈ ఉద్దీపనలు... డిమాండ్​ను పెంచి ఆర్థిక వ్యవస్థను పుంజుకునేలా చేస్తాయనే భరోసాను ఇవ్వలేకపోతున్నాయి.  

లాభనష్టాల్లో...

ఓఎన్​జీసీ, టాటాస్టీల్​, భారతీ ఎయిర్​టెల్​, టైటాన్​, బ్రిటానియా, బీపీసీఎల్, టెక్ మహీంద్రా, సిప్లా రాణిస్తున్నాయి.

ఎమ్ అండ్ ఎమ్​, మారుతి సుజుకి, హెచ్​డీఎఫ్​సీ బ్యాంకు, ఐసీఐసీఐ బ్యాంకు, రిలయన్స్ ఇండస్ట్రీస్​, భారతీ ఇన్​ఫ్రాటెల్, జీ ఎంటైర్​టెన్​మెంట్ నష్టాల్లో ట్రేడవుతున్నాయి.

ఆసియా మార్కెట్లు

వాల్​స్ట్రీట్ లాభాలతో ముగిసింది. ఆసియా మార్కెట్లు షాంఘై, హాంగ్​కాంగ్​, టోక్యో, సియోల్​ కూడా లాభాలతో ట్రేడవుతున్నాయి.

ముడిచమురు

అంతర్జాతీయ మార్కెట్​లో ముడిచమురు ధర 1.47 శాతం పెరిగింది. ప్రస్తుతం బ్యారెల్ ధర 31.59 డాలర్లుగా ఉంది.  

09:24 May 15

భరోసా ఇవ్వని ఉద్దీపనలు ... ఊగిసలాడుతున్న మార్కెట్లు

దేశీయ మార్కెట్లు నష్టాలతో ప్రారంభమయ్యాయి. ప్రతికూల అంతర్జాతీయ సంకేతాలకు తోడు.... భారత్ అభియాన్ పథకం మార్కెట్ వర్గాలను మెప్పించలేకపోవడమే ఇందుకు కారణం.  

బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్ 97 పాయింట్లు కోల్పోయి 31 వేల 25 వద్ద కొనసాగుతోంది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ 26 పాయింట్లు నష్టపోయి 9 వేల 116 వద్ద ట్రేడవుతోంది.

ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్​ ఆత్మ నిర్భర్​ భారత్ అభియాన్ పథకం రెండో విడతలో భాగంగా వలసకూలీలు, రైతులు, చిన్నవ్యాపారుల సంక్షేమం కోసం రూ.3.16 లక్షల కోట్ల ప్యాకేజీని ప్రకటించారు. బుధవారం ప్రకటించిన రూ.5.94 లక్షల కోట్ల ప్యాకేజీతో కలుపుకుంటే మొత్తం ప్యాకేజీ విలువ రూ.9,10,250 కోట్లవుతుంది. అయితే ఈ ఉద్దీపనలు .... మార్కెట్ సెంటిమెంట్​ను బలపరచలేకపోయాయి.

లాభనష్టాల్లో...

ఓఎన్​జీసీ, బ్రిటానియా, బీపీసీఎల్, టెక్ మహీంద్రా, సిప్లా రాణిస్తున్నాయి.

ఎమ్ అండ్ ఎమ్​, మారుతి సుజుకి, భారతీ ఇన్​ఫ్రాటెల్, జీ ఎంటైర్​టెన్​మెంట్ నష్టాల్లో ట్రేడవుతున్నాయి.

Last Updated : May 15, 2020, 10:27 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.