ETV Bharat / business

వ్యాక్సిన్​పై ఆశలు- సెన్సెక్స్​ 622 పాయింట్లు ప్లస్

author img

By

Published : May 20, 2020, 3:39 PM IST

దేశీయ స్టాక్​మార్కెట్లు భారీ లాభాలతో ముగిశాయి. కరోనా వ్యాక్సిన్​పై చిగురిస్తున్న ఆశలు మదుపరుల సెంటిమెంటును పెంచడమే ఇందుకు కారణం. మాంద్యం భయాలు, విదేశీ పెట్టుబడుల ఉపసంహరణలు మార్కెట్లను ఏమాత్రం ప్రభావితం చేయలేకపోయాయి.

stock market closes with gains
భారీ లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

ఆర్థిక మాంద్యం భయాలు వెంటాడుతున్నా, విదేశీ పెట్టుబడులు వెనక్కి వెళుతున్నా ... దేశీయ స్టాక్​మార్కెట్లు భారీ లాభాలతో ముగిశాయి. కరోనా వ్యాక్సిన్​పై చిగురిస్తున్న ఆశలే మదుపరుల సెంటిమెంటును పెంచుతున్నాయని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.

బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్ 622 పాయింట్లు లాభపడి 30 వేల 818 వద్ద ముగిసింది. జాతీయ స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ 187 పాయింట్లు వృద్ధి చెంది 9 వేల 66 వద్ద స్థిరపడింది.

లాభనష్టాల్లో

ఎమ్ అండ్ ఎమ్, హెచ్​డీఎఫ్​సీ, ఎల్​ అండ్​ టీ, బజాజ్​ ఫైనాన్స్, టాటా స్టీల్, సన్​ఫార్మా రాణించాయి.

ఇండస్​ఇండ్ బ్యాంకు, హీరో మోటోకార్ప్, భారతీ ఎయిర్​టెల్, ఏషియన్ పెయింట్స్ నష్టపోయాయి.

ఇదీ చూడండి: భారత్​ నుంచి 1600 కోట్ల డాలర్ల విదేశీ పెట్టుబడులు వెనక్కి

ఆర్థిక మాంద్యం భయాలు వెంటాడుతున్నా, విదేశీ పెట్టుబడులు వెనక్కి వెళుతున్నా ... దేశీయ స్టాక్​మార్కెట్లు భారీ లాభాలతో ముగిశాయి. కరోనా వ్యాక్సిన్​పై చిగురిస్తున్న ఆశలే మదుపరుల సెంటిమెంటును పెంచుతున్నాయని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.

బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్ 622 పాయింట్లు లాభపడి 30 వేల 818 వద్ద ముగిసింది. జాతీయ స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ 187 పాయింట్లు వృద్ధి చెంది 9 వేల 66 వద్ద స్థిరపడింది.

లాభనష్టాల్లో

ఎమ్ అండ్ ఎమ్, హెచ్​డీఎఫ్​సీ, ఎల్​ అండ్​ టీ, బజాజ్​ ఫైనాన్స్, టాటా స్టీల్, సన్​ఫార్మా రాణించాయి.

ఇండస్​ఇండ్ బ్యాంకు, హీరో మోటోకార్ప్, భారతీ ఎయిర్​టెల్, ఏషియన్ పెయింట్స్ నష్టపోయాయి.

ఇదీ చూడండి: భారత్​ నుంచి 1600 కోట్ల డాలర్ల విదేశీ పెట్టుబడులు వెనక్కి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.