ETV Bharat / business

'అక్టోబర్​లో 57 శాతం తగ్గిన విమాన ప్రయాణికులు'

అక్టోబర్​లో దేశీయంగా 52.7 లక్షల మంది విమానాల్లో ప్రయాణాలు చేశారు. గత ఏడాది ఇదే సమయంతో పోలిస్తే ఈ సంఖ్య 57 శాతం తక్కువని డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ డేటా వెల్లడించింది. సెప్టెంబర్​తో పోలిస్తే మాత్రం ప్రయాణికుల రద్దీ గణనీయంగా పెరిగినట్లు పేర్కొంది.

author img

By

Published : Nov 19, 2020, 12:10 PM IST

Number of domestic air passengers in October
అక్టోబర్​ విమానయాన ప్యాసింజర్ల సంఖ్య

దేశీయంగా విమాన ప్రయాణికుల సంఖ్య అక్టోబర్​లో (గత ఏడాది ఇదే నెలతో పోలిస్తే) 57 శాతం తగ్గింది. డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ డేటా ప్రకారం అక్టోబర్​లో మొత్తం 52.7 లక్షల మంది విమానాల్లో ప్రయాణించినట్లు తెలిసింది. సెప్టెంబర్​తో (39.4 లక్షలు) పోలిస్తే మాత్రం ప్రయాణికుల రద్దీ భారీగా పెరిగింది. పండుగ సీజన్​లో చాలా మంది తమ గమ్య స్థానాలకు వెళ్లేందుకు విమాన ప్రయాణాలను ఎంచుకోవడం ఇందుకు కారణం.

కొవిడ్ నేపథ్యంలో విమానాల సామర్థ్యంలో 60 శాతం వరకు మాత్రమే ప్రయాణికులను అనుమతించాలని సెప్టెంబర్​లో ప్రభుత్వం అదేశించింది. ఇప్పుడు ఆ పరిమితిని 70 శాతానికి పెంచింది.

వాణిజ్య విమానాల ప్యాసింజర్​ లోడ్ ఫ్యాక్టర్ (పీఎల్​ఎఫ్​) సెప్టెంబర్​ (57-73 శాతం)తో పోలిస్తే అక్టోబర్​లో 64-74 శాతానికి పెరిగింది. అయితే గత ఏడాది అక్టోబర్​లో ఇది 76-90 శాతంగా ఉండటం గమనార్హం.

సంస్థల వారీగా ప్రయాణికుల సంఖ్య..

  • అక్టోబర్​లో 29.3 లక్షల మంది ప్రయాణికులు ఇండిగోలో ప్రయాణించారు. దీనితో 55.5 శాతం మార్కెట్ వాటాను దక్కించుకుంది.
  • అక్టోబర్​లో స్పైస్ ​జెట్​ 13.4 శాతం మార్కెట్ వాటాను దక్కించుకుంది. మొత్తం 7 లక్షల మందిని గమ్యస్థానాలుకు చేరవేసింది.
  • ఎయిర్​ఇండియాలో అక్టోబర్​లో 4.9 లక్షల మంది ప్రయాణించారు. దీనితో సంస్థ మార్కెట్ వాటా 9.4 శాతంగా నమోదైంది.
  • విస్తారా అక్టోబర్​లో 3.4 లక్షల మందిని గమ్య స్థానాలకు చేరవేసి 6.4 శాతం మార్కెట్ వాటాను దక్కించుకుంది.
  • ఎయిర్​ ఏషియా అక్టోబర్​లో 3.7 లక్షల మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరవేసింది. 7.1 శాతం మార్కెట్ వాటాను దక్కించుకుంది.
  • గోఎయిర్​లో అక్టోబర్​లో 4 లక్షల మంది ప్రయాణం చేశారు. దీనితో 7.5 శాతం మార్కెట్ వాటా దక్కింది.
  • ఈ ఏడాది జనవరి నుంచి అక్టోబర్​ మధ్య మొత్తం 4.93 కోట్ల మంది విమానాల్లో ప్రయాణించారు. గత ఏడాది ఇదే సమయంలో ఈ సంఖ్య 11.82 కోట్లుగా ఉంది.

ఇదీ చూడండి:'వివాద్​ సే విశ్వాస్​'తో ప్రభుత్వానికి రూ.72,480 కోట్లు!

దేశీయంగా విమాన ప్రయాణికుల సంఖ్య అక్టోబర్​లో (గత ఏడాది ఇదే నెలతో పోలిస్తే) 57 శాతం తగ్గింది. డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ డేటా ప్రకారం అక్టోబర్​లో మొత్తం 52.7 లక్షల మంది విమానాల్లో ప్రయాణించినట్లు తెలిసింది. సెప్టెంబర్​తో (39.4 లక్షలు) పోలిస్తే మాత్రం ప్రయాణికుల రద్దీ భారీగా పెరిగింది. పండుగ సీజన్​లో చాలా మంది తమ గమ్య స్థానాలకు వెళ్లేందుకు విమాన ప్రయాణాలను ఎంచుకోవడం ఇందుకు కారణం.

కొవిడ్ నేపథ్యంలో విమానాల సామర్థ్యంలో 60 శాతం వరకు మాత్రమే ప్రయాణికులను అనుమతించాలని సెప్టెంబర్​లో ప్రభుత్వం అదేశించింది. ఇప్పుడు ఆ పరిమితిని 70 శాతానికి పెంచింది.

వాణిజ్య విమానాల ప్యాసింజర్​ లోడ్ ఫ్యాక్టర్ (పీఎల్​ఎఫ్​) సెప్టెంబర్​ (57-73 శాతం)తో పోలిస్తే అక్టోబర్​లో 64-74 శాతానికి పెరిగింది. అయితే గత ఏడాది అక్టోబర్​లో ఇది 76-90 శాతంగా ఉండటం గమనార్హం.

సంస్థల వారీగా ప్రయాణికుల సంఖ్య..

  • అక్టోబర్​లో 29.3 లక్షల మంది ప్రయాణికులు ఇండిగోలో ప్రయాణించారు. దీనితో 55.5 శాతం మార్కెట్ వాటాను దక్కించుకుంది.
  • అక్టోబర్​లో స్పైస్ ​జెట్​ 13.4 శాతం మార్కెట్ వాటాను దక్కించుకుంది. మొత్తం 7 లక్షల మందిని గమ్యస్థానాలుకు చేరవేసింది.
  • ఎయిర్​ఇండియాలో అక్టోబర్​లో 4.9 లక్షల మంది ప్రయాణించారు. దీనితో సంస్థ మార్కెట్ వాటా 9.4 శాతంగా నమోదైంది.
  • విస్తారా అక్టోబర్​లో 3.4 లక్షల మందిని గమ్య స్థానాలకు చేరవేసి 6.4 శాతం మార్కెట్ వాటాను దక్కించుకుంది.
  • ఎయిర్​ ఏషియా అక్టోబర్​లో 3.7 లక్షల మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరవేసింది. 7.1 శాతం మార్కెట్ వాటాను దక్కించుకుంది.
  • గోఎయిర్​లో అక్టోబర్​లో 4 లక్షల మంది ప్రయాణం చేశారు. దీనితో 7.5 శాతం మార్కెట్ వాటా దక్కింది.
  • ఈ ఏడాది జనవరి నుంచి అక్టోబర్​ మధ్య మొత్తం 4.93 కోట్ల మంది విమానాల్లో ప్రయాణించారు. గత ఏడాది ఇదే సమయంలో ఈ సంఖ్య 11.82 కోట్లుగా ఉంది.

ఇదీ చూడండి:'వివాద్​ సే విశ్వాస్​'తో ప్రభుత్వానికి రూ.72,480 కోట్లు!

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.