ETV Bharat / business

ఎస్‌బీఐ ఛైర్మన్‌గా దినేశ్‌ కుమార్‌ ఖారా

author img

By

Published : Oct 7, 2020, 6:44 AM IST

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఛైర్మన్​గా దినేశ్‌ కుమార్‌ ఖారా నియమితులయ్యారు. మూడేళ్లపాటు ఈ పదవిలో కొనసాగనున్నారు. ప్రస్తుతం ఛైర్మన్​గా ఉన్న రజనీశ్ కుమార్​ స్థానంలో ఆయన బాధ్యతలు తీసుకోనున్నారు.

Dinesh Kumar Khara as SBI chairman
బ్యాంక్ ఆఫ్ ఇండియా ఛైర్మన్​గా దినేశ్ కుమార్ ఖారా

దేశంలో అతిపెద్ద బ్యాంక్‌ అయిన స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) ఛైర్మన్‌గా దినేశ్‌ కుమార్‌ ఖారా నియమితులయ్యారు. ప్రస్తుత ఛైర్మన్‌ రజనీశ్‌ కుమార్‌ స్థానాన్ని ఆయన భర్తీ చేయనున్నారు. అక్టోబరు 7 (నేడు) నుంచి మూడేళ్ల పాటు దినేశ్‌ కుమార్‌ ఛైర్మన్‌గా వ్యవహరించనున్నారని ఆర్థిక శాఖ జారీ చేసిన నోటిఫికేషన్‌లో పేర్కొంది.

ప్రస్తుతం ఎస్‌బీఐ సీనియర్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌గా ఉన్న దినేశ్‌ కుమార్‌ పేరును ఎస్‌బీఐ తదుపరి ఛైర్మన్‌ పదవికి బ్యాంక్స్‌ బోర్డ్‌ బ్యూరో (బీబీబీ) గత నెలలో సిఫారసు చేసిన విషయం తెలిసిందే. 2017లో సైతం ఛైర్మన్‌ పదవికి పోటీ పడిన వారిలో దినేశ్‌ కుమార్‌ ఉన్నారు. దినేశ్‌కుమార్‌ 1984లో ఎస్‌బీఐలో ప్రోబేషనరీ ఆఫీసర్‌గా చేరారు. 2016 ఆగస్టులో ఎండీగా మూడేళ్ల కాలానికి నియమితులయ్యారు. 2017లో భారతీయ మహిళా బ్యాంక్‌, అయిదు అనుబంధ బ్యాంకులను ఎస్‌బీఐలో విలీనం చేయడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. ఆయన పనితీరు మెచ్చి, 2019లో రెండేళ్ల పొడిగింపు ఇచ్చారు.

అనుబంధ సంస్థగా యోనో!

డిజిటల్‌ ప్లాట్‌ఫామ్‌ యోనోను ప్రత్యేక అనుబంధ సంస్థగా మార్చేందుకు స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) చూస్తున్నట్లు బ్యాంక్‌ ఛైర్మన్‌ రజనీశ్‌ కుమార్‌ తెలిపారు. ప్రస్తుతం ఎస్‌బీఐ సమీకృత బ్యాంకింగ్‌ ప్లాట్‌ఫామ్‌గా యోనో (యూ ఓన్లీ నీడ్‌ వన్‌ యాప్‌) సేవలు అందిస్తోంది. యోనోను ప్రత్యేక అనుబంధ సంస్థగా మలిచేందుకు భాగస్వాములతో చర్చలు జరుపుతున్నట్లు రజనీశ్‌ కుమార్‌ వెల్లడించారు.

దేశంలో అతిపెద్ద బ్యాంక్‌ అయిన స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) ఛైర్మన్‌గా దినేశ్‌ కుమార్‌ ఖారా నియమితులయ్యారు. ప్రస్తుత ఛైర్మన్‌ రజనీశ్‌ కుమార్‌ స్థానాన్ని ఆయన భర్తీ చేయనున్నారు. అక్టోబరు 7 (నేడు) నుంచి మూడేళ్ల పాటు దినేశ్‌ కుమార్‌ ఛైర్మన్‌గా వ్యవహరించనున్నారని ఆర్థిక శాఖ జారీ చేసిన నోటిఫికేషన్‌లో పేర్కొంది.

ప్రస్తుతం ఎస్‌బీఐ సీనియర్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌గా ఉన్న దినేశ్‌ కుమార్‌ పేరును ఎస్‌బీఐ తదుపరి ఛైర్మన్‌ పదవికి బ్యాంక్స్‌ బోర్డ్‌ బ్యూరో (బీబీబీ) గత నెలలో సిఫారసు చేసిన విషయం తెలిసిందే. 2017లో సైతం ఛైర్మన్‌ పదవికి పోటీ పడిన వారిలో దినేశ్‌ కుమార్‌ ఉన్నారు. దినేశ్‌కుమార్‌ 1984లో ఎస్‌బీఐలో ప్రోబేషనరీ ఆఫీసర్‌గా చేరారు. 2016 ఆగస్టులో ఎండీగా మూడేళ్ల కాలానికి నియమితులయ్యారు. 2017లో భారతీయ మహిళా బ్యాంక్‌, అయిదు అనుబంధ బ్యాంకులను ఎస్‌బీఐలో విలీనం చేయడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. ఆయన పనితీరు మెచ్చి, 2019లో రెండేళ్ల పొడిగింపు ఇచ్చారు.

అనుబంధ సంస్థగా యోనో!

డిజిటల్‌ ప్లాట్‌ఫామ్‌ యోనోను ప్రత్యేక అనుబంధ సంస్థగా మార్చేందుకు స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) చూస్తున్నట్లు బ్యాంక్‌ ఛైర్మన్‌ రజనీశ్‌ కుమార్‌ తెలిపారు. ప్రస్తుతం ఎస్‌బీఐ సమీకృత బ్యాంకింగ్‌ ప్లాట్‌ఫామ్‌గా యోనో (యూ ఓన్లీ నీడ్‌ వన్‌ యాప్‌) సేవలు అందిస్తోంది. యోనోను ప్రత్యేక అనుబంధ సంస్థగా మలిచేందుకు భాగస్వాములతో చర్చలు జరుపుతున్నట్లు రజనీశ్‌ కుమార్‌ వెల్లడించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.