ETV Bharat / business

టాటా సన్స్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్​ పదవి నాకు వద్దు: మిస్త్రీ - టాటా సన్స్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్​ పదవి వద్దన్న సైరస్​ మిస్త్రీ

సైరస్​ మిస్త్రీ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. ఎన్​సీఎల్​ఏటీ తీర్పు తనకు అనుకూలంగా వచ్చినప్పటికీ టాటా సన్స్ ఎగ్జిక్యూటివ్​ ఛైర్మన్​గా బాధ్యతలు చేపట్టేది లేదని స్పష్టం చేశారు. టాటా గ్రూప్​ ప్రయోజనాల కోసమే తానీ నిర్ణయం తీసుకున్నానని, వ్యక్తిగత ప్రయోజనాల కన్నా సంస్థ ప్రయోజనాలే తనకు ముఖ్యమని మిస్త్రీ వ్యాఖ్యానించారు.

Cyrus Mistry says no to chairmanship of Tata Sons
టాటా సన్స్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్​ పదవి నాకొద్దు: సైరస్​ మిస్త్రీ
author img

By

Published : Jan 5, 2020, 8:10 PM IST

జాతీయ కంపెనీ లా అప్పీలేట్ ట్రైబ్యునల్ ఇచ్చిన తీర్పుపై సైరస్​ మిస్త్రీ స్పందించారు. టాటా సన్స్​ కార్యనిర్వాహక ఛైర్మన్​గా పునర్నియామకం చేసినా.. తిరిగి ఆ పదవి చేపట్టేది లేదని స్పష్టం చేశారు. కార్పొరేట్​ నియమాలకు విరుద్ధంగా తనను తొలగించడంపై చేసిన పోరాటానికి... ఎన్​సీఎల్​ఏటీ ఇచ్చిన తీర్పు తగిన గుర్తింపు నిచ్చిందని సైరస్​ మిస్త్రీ పేర్కొన్నారు.

"ఎన్​సీఎల్ఏటీ తీర్పు నాకు అనుకూలంగా వచ్చినా.. తిరిగి 'టాటా సన్స్​' కార్యనిర్వాహక ఛైర్మన్ పదవిని చేపట్టను. టీసీఎస్​, టాటా టెలీసర్వీసెస్​, టాటా ఇండస్ట్రీస్​ డైరెక్టర్​షిప్​లో కొనసాగను. అయితే బోర్డులో సభ్యత్వం కోసం, మైనారిటీ వాటాదారుల హక్కుల పరిరక్షణకు కృషిచేస్తాను."- సైరస్​ మిస్త్రీ

టాటా గ్రూప్​ ప్రయోజనాల కోసమే తానీ నిర్ణయం తీసుకున్నానని, వ్యక్తిగత ప్రయోజనాల కన్నా సంస్థ ప్రయోజనాలే తనకు ముఖ్యమని మిస్త్రీ వ్యాఖ్యానించారు.

సుప్రీంకు... టాటా

టాటా సన్స్‌ కార్యనిర్వాహక ఛైర్మన్‌గా సైరస్‌ మిస్త్రీని పునర్నియమిస్తూ... జాతీయ కంపెనీ లా అప్పీలేట్‌ ట్రైబ్యూనల్‌ గత ఏడాది డిసెంబర్‌ 18న తీర్పు వెలువరించింది. ఈ తీర్పును సవాల్​ చేస్తూ టాటాసన్స్‌ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. ఈ నెల 9న టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ బోర్డు సమావేశం ఉన్నందున ట్రైబ్యునల్‌ తీర్పుపై వెంటనే స్టే ఇవ్వాలని టాటా సన్స్‌.. సుప్రీం కోర్టును అభ్యర్థించింది.

కార్పొరేట్ ప్రజాస్వామ్యం బలహీనపరిచింది..

ఎస్​సీఎల్​ఏటీ ఇచ్చిన తీర్పుపై టాటా సన్స్​ తీవ్రంగా స్పందించింది. టాటా సన్స్ కార్యనిర్వాహక​ ఛైర్మన్​గా సైరస్​ మిస్త్రీ పునర్నియామకానికి అనుకూలంగా ఇచ్చిన తీర్పు 'కార్పొరేట్​ ప్రజాస్వామ్యాన్ని' బలహీనపరిచేదిగా ఉందని టాటా సన్స్ అభిప్రాయపడింది. అలాగే బోర్డు డైరెక్టర్ల హక్కులకు భంగం కలిగించేదిగా ఉందని పేర్కొంది.

ఇదీ చూడండి: 'ఈటీవీ భారత్'ను సందర్శించిన సూపర్​స్టార్ రజనీ

జాతీయ కంపెనీ లా అప్పీలేట్ ట్రైబ్యునల్ ఇచ్చిన తీర్పుపై సైరస్​ మిస్త్రీ స్పందించారు. టాటా సన్స్​ కార్యనిర్వాహక ఛైర్మన్​గా పునర్నియామకం చేసినా.. తిరిగి ఆ పదవి చేపట్టేది లేదని స్పష్టం చేశారు. కార్పొరేట్​ నియమాలకు విరుద్ధంగా తనను తొలగించడంపై చేసిన పోరాటానికి... ఎన్​సీఎల్​ఏటీ ఇచ్చిన తీర్పు తగిన గుర్తింపు నిచ్చిందని సైరస్​ మిస్త్రీ పేర్కొన్నారు.

"ఎన్​సీఎల్ఏటీ తీర్పు నాకు అనుకూలంగా వచ్చినా.. తిరిగి 'టాటా సన్స్​' కార్యనిర్వాహక ఛైర్మన్ పదవిని చేపట్టను. టీసీఎస్​, టాటా టెలీసర్వీసెస్​, టాటా ఇండస్ట్రీస్​ డైరెక్టర్​షిప్​లో కొనసాగను. అయితే బోర్డులో సభ్యత్వం కోసం, మైనారిటీ వాటాదారుల హక్కుల పరిరక్షణకు కృషిచేస్తాను."- సైరస్​ మిస్త్రీ

టాటా గ్రూప్​ ప్రయోజనాల కోసమే తానీ నిర్ణయం తీసుకున్నానని, వ్యక్తిగత ప్రయోజనాల కన్నా సంస్థ ప్రయోజనాలే తనకు ముఖ్యమని మిస్త్రీ వ్యాఖ్యానించారు.

సుప్రీంకు... టాటా

టాటా సన్స్‌ కార్యనిర్వాహక ఛైర్మన్‌గా సైరస్‌ మిస్త్రీని పునర్నియమిస్తూ... జాతీయ కంపెనీ లా అప్పీలేట్‌ ట్రైబ్యూనల్‌ గత ఏడాది డిసెంబర్‌ 18న తీర్పు వెలువరించింది. ఈ తీర్పును సవాల్​ చేస్తూ టాటాసన్స్‌ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. ఈ నెల 9న టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ బోర్డు సమావేశం ఉన్నందున ట్రైబ్యునల్‌ తీర్పుపై వెంటనే స్టే ఇవ్వాలని టాటా సన్స్‌.. సుప్రీం కోర్టును అభ్యర్థించింది.

కార్పొరేట్ ప్రజాస్వామ్యం బలహీనపరిచింది..

ఎస్​సీఎల్​ఏటీ ఇచ్చిన తీర్పుపై టాటా సన్స్​ తీవ్రంగా స్పందించింది. టాటా సన్స్ కార్యనిర్వాహక​ ఛైర్మన్​గా సైరస్​ మిస్త్రీ పునర్నియామకానికి అనుకూలంగా ఇచ్చిన తీర్పు 'కార్పొరేట్​ ప్రజాస్వామ్యాన్ని' బలహీనపరిచేదిగా ఉందని టాటా సన్స్ అభిప్రాయపడింది. అలాగే బోర్డు డైరెక్టర్ల హక్కులకు భంగం కలిగించేదిగా ఉందని పేర్కొంది.

ఇదీ చూడండి: 'ఈటీవీ భారత్'ను సందర్శించిన సూపర్​స్టార్ రజనీ

New Delhi, Jan 05 (ANI): Senior Bharatiya Janata Party leaders attended 'Booth Karyakarta Sammelan' in Delhi on January 05. Addressing the rally, Home Minister Amit Shah said that Attack on Nankana Sahib Gurdwara is answer to all demonstrating against CAA. "Kejriwal, Sonia ji and Rahul ji open your eyes and see how day before yesterday only, Nankana Sahib Gurdwara was attacked in Pakistan. It is an answer to all those who are protesting against CAA. Where would those Sikhs affected in the attack go?" said Amit Shah

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.