ETV Bharat / briefs

ఘాటెక్కిన మిర్చి .. రేణుకా చౌదరి ఉక్కిరి బిక్కిరి

ఎంతో ఉత్సాహంగా అక్కడికి ప్రచారానికి వెళ్లారు. ఓట్ల కోసం అభ్యర్థించారు. అంతలోనే మొదలైంది అసలు కథ. అభ్యర్థి నుంచి కార్యకర్తల దాకా అందరికి ఒకటే దగ్గు, తుమ్ములు. అయినా ఎన్నికల సమయం. అలాగే బిగబట్టి ప్రచారం చేశారు. ఇంత కష్టపడింది ఎవరో కాదు కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ రేణుకాచౌదరి.

author img

By

Published : Apr 8, 2019, 8:25 PM IST

రేణుకా చౌదరికి మిర్చి ఘాటు

ఖమ్మం పార్లమెంట్​ అభ్యర్థి రేణుకా చౌదరి జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్​కు ప్రచారం కోసం వెళ్లారు. మార్కెట్​లోకి వెళ్లిన కొద్దిసేపటికే కార్యకర్తలందరికీ.. మిర్చి ఘాటు తగిలింది. తుమ్ములు, దగ్గులు ప్రారంభమయ్యాయి. మిర్చిని పరిశీలిస్తున్న కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్​ అందుకు మినహాయింపు కాదు. విపరీతంగా తుమ్ములు, దగ్గులతో ఇబ్బంది పడ్డారు. కనీసం మాట్లాడేటప్పుడు కూడా అవస్థ తప్పలేదు. చేతిగుడ్డ అడ్డం పెట్టుకున్నా ఘాటును తట్టుకోలేకపోయారు. ఓవైపు భగ్గుమంటున్న ఎండ.. మరోవైపు మిర్చి మంట. రేణుకాతో పాటు కార్యకర్తలందరు పడ్డ కష్టం అంతా ఇంతా కాదు.

అందరికి అర్థమవుతోంది కదా ఈ ఘాటు. మరి నా మిర్చి రైతులు పడే అవస్థల గురించి మీరు ఆలోచించాలి.
----- రేణుకా చౌదరి, ఖమ్మం లోక్​సభ కాంగ్రెస్​ అభ్యర్థి

ఘాటు ఎక్కువగా ఉంది... వెళ్లిపోదాం మేడమ్ అని కార్యకర్తలు వారించినా వినలేదు. మిర్చి రైతుల సమస్యలు విన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మద్దతు ధర కల్పిస్తామని హామీ ఇచ్చారు. అందరూ హస్తం గుర్తుకు ఓటేసి గెలిపించాలని కోరారు.

రేణుకా చౌదరికి మిర్చి ఘాటు

ఇవీ చూడండి: ఇందూరు రైతుల పిటిషన్​ విచారణ రెండువారాలకు వాయిదా

ఖమ్మం పార్లమెంట్​ అభ్యర్థి రేణుకా చౌదరి జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్​కు ప్రచారం కోసం వెళ్లారు. మార్కెట్​లోకి వెళ్లిన కొద్దిసేపటికే కార్యకర్తలందరికీ.. మిర్చి ఘాటు తగిలింది. తుమ్ములు, దగ్గులు ప్రారంభమయ్యాయి. మిర్చిని పరిశీలిస్తున్న కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్​ అందుకు మినహాయింపు కాదు. విపరీతంగా తుమ్ములు, దగ్గులతో ఇబ్బంది పడ్డారు. కనీసం మాట్లాడేటప్పుడు కూడా అవస్థ తప్పలేదు. చేతిగుడ్డ అడ్డం పెట్టుకున్నా ఘాటును తట్టుకోలేకపోయారు. ఓవైపు భగ్గుమంటున్న ఎండ.. మరోవైపు మిర్చి మంట. రేణుకాతో పాటు కార్యకర్తలందరు పడ్డ కష్టం అంతా ఇంతా కాదు.

అందరికి అర్థమవుతోంది కదా ఈ ఘాటు. మరి నా మిర్చి రైతులు పడే అవస్థల గురించి మీరు ఆలోచించాలి.
----- రేణుకా చౌదరి, ఖమ్మం లోక్​సభ కాంగ్రెస్​ అభ్యర్థి

ఘాటు ఎక్కువగా ఉంది... వెళ్లిపోదాం మేడమ్ అని కార్యకర్తలు వారించినా వినలేదు. మిర్చి రైతుల సమస్యలు విన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మద్దతు ధర కల్పిస్తామని హామీ ఇచ్చారు. అందరూ హస్తం గుర్తుకు ఓటేసి గెలిపించాలని కోరారు.

రేణుకా చౌదరికి మిర్చి ఘాటు

ఇవీ చూడండి: ఇందూరు రైతుల పిటిషన్​ విచారణ రెండువారాలకు వాయిదా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.