ETV Bharat / briefs

వరుసగా ఆరో రోజు రాజ్యసభ వాయిదా

ప్రతిపక్షాల నిరసనలతో రాజ్యసభను రేపటికి వాయిదా వేశారు ఉపసభాపతి. వరుసగా ఆరో రోజు సభ కార్యక్రమాలు సజావుగా సాగలేదు.

author img

By

Published : Feb 11, 2019, 3:32 PM IST

ఉపసభాపతి హరివంశ్

కాంగ్రెస్​, తెదేపా సభ్యులు నిరసనలను కొనసాగించటంతో రాజ్యసభను ఉపసభాపతి హరివంశ్ రేపటికి వాయిదా వేశారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన పౌరసత్వం చట్టం సవరణ, ఎన్నారై వివాహ నమోదు బిల్లులను విపక్షాలు వ్యతిరేకించాయి.

ఉదయం సభ ప్రారంభమైన కొద్దిసేపటికే మధ్యాహ్నానికి వాయిదా పడింది. రెండు గంటలకు తిరిగి ప్రారంభమైన తర్వాతా ఆందోళనలు తగ్గకపోవటంతో ఐదు నిమిషాలకే వాయిదా వేశారు ఉపసభాపతి.

రాజ్యసభ వాయిదా
undefined

విపక్షాలు చెబుతున్న అభ్యంతరాలపై ఉపరాష్ట్రపతికి ఎలాంటి నోటీసులు అందలేదని, వాటిని చర్చలోకి తీసుకోలేమని సభ్యులకు ఉపసభాపతి స్పష్టం చేశారు. ప్రవేశపెట్టిన బిల్లులపై చర్చించాలని ఉపసభాపతి కోరినా విపక్షాలు ఆందోళనలను కొనసాగించారు. కాగితాలను వెల్​లోకి విసిరేస్తూ ప్రత్యేక హోదా కావాలంటూ తెదేపా ఎంపీలు నినదించారు. కర్ణాటక ఆడియో టేపులపై కాంగ్రెస్​ సభ్యులు నిరసన వ్యక్తం చేశారు.

కాంగ్రెస్​, తెదేపా సభ్యులు నిరసనలను కొనసాగించటంతో రాజ్యసభను ఉపసభాపతి హరివంశ్ రేపటికి వాయిదా వేశారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన పౌరసత్వం చట్టం సవరణ, ఎన్నారై వివాహ నమోదు బిల్లులను విపక్షాలు వ్యతిరేకించాయి.

ఉదయం సభ ప్రారంభమైన కొద్దిసేపటికే మధ్యాహ్నానికి వాయిదా పడింది. రెండు గంటలకు తిరిగి ప్రారంభమైన తర్వాతా ఆందోళనలు తగ్గకపోవటంతో ఐదు నిమిషాలకే వాయిదా వేశారు ఉపసభాపతి.

రాజ్యసభ వాయిదా
undefined

విపక్షాలు చెబుతున్న అభ్యంతరాలపై ఉపరాష్ట్రపతికి ఎలాంటి నోటీసులు అందలేదని, వాటిని చర్చలోకి తీసుకోలేమని సభ్యులకు ఉపసభాపతి స్పష్టం చేశారు. ప్రవేశపెట్టిన బిల్లులపై చర్చించాలని ఉపసభాపతి కోరినా విపక్షాలు ఆందోళనలను కొనసాగించారు. కాగితాలను వెల్​లోకి విసిరేస్తూ ప్రత్యేక హోదా కావాలంటూ తెదేపా ఎంపీలు నినదించారు. కర్ణాటక ఆడియో టేపులపై కాంగ్రెస్​ సభ్యులు నిరసన వ్యక్తం చేశారు.

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.