ETV Bharat / briefs

మద్యం మత్తులో పీక కోసుకున్నాడు... - kothagudemlo-atmahathya-yathnam

మద్యం మత్తులో యువకులు నానా రచ్చ చేస్తూంటారు. కనపడ్డవారితో గొడవ పడుతుంటారు. కత్తులు పట్టుకుని చంపుతామని బెదిరిస్తుంటారు. కానీ ఈ యువకుడు మాత్రం తాగిన మైకంలో చనిపోతానని బెదిరించమే కాకుండా... నిజంగానే గొంతు, చేతులు కోసుకున్నాడు. కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్నాడు.

ఎందుకలా...?
author img

By

Published : Jun 1, 2019, 12:18 AM IST

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లిలోని రామాంజనేయకాలనీకి చెందిన సాయికిరణ్​ అనే యువకుడు అరాచకానికి తెగబడ్డాడు. మద్యం మత్తులో గొంతు, చేతులు కోసుకుని బీభత్సం సృష్టించారు. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని... తీవ్రంగా గాయపడ్డ సాయికిరణ్​ను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. గతంలో కూడా సాయికిరణ్​ పలుమార్లు కాళ్లు, చేతులు కోసుకుని బెదిరించేవాడని గ్రామ ఉప సర్పంచ్​ తెలిపాడు. ఈసారి మాత్రం గొంతు కోసుకోవటం వల్ల పరిస్థితి విషమంగా మారిందని ఆందోళన వ్యక్తం చేశాడు. ప్రస్తుతం సాయికిరణ్ మాట్లాడుతున్నప్పటికీ అతని​ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందనేది వైద్యులు వెల్లడించాల్సి ఉంది. వైద్యం కొనసాగిస్తున్నారు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లిలోని రామాంజనేయకాలనీకి చెందిన సాయికిరణ్​ అనే యువకుడు అరాచకానికి తెగబడ్డాడు. మద్యం మత్తులో గొంతు, చేతులు కోసుకుని బీభత్సం సృష్టించారు. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని... తీవ్రంగా గాయపడ్డ సాయికిరణ్​ను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. గతంలో కూడా సాయికిరణ్​ పలుమార్లు కాళ్లు, చేతులు కోసుకుని బెదిరించేవాడని గ్రామ ఉప సర్పంచ్​ తెలిపాడు. ఈసారి మాత్రం గొంతు కోసుకోవటం వల్ల పరిస్థితి విషమంగా మారిందని ఆందోళన వ్యక్తం చేశాడు. ప్రస్తుతం సాయికిరణ్ మాట్లాడుతున్నప్పటికీ అతని​ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందనేది వైద్యులు వెల్లడించాల్సి ఉంది. వైద్యం కొనసాగిస్తున్నారు.

ఎందుకలా...?

ఇవీ చూడండి: నిద్రిస్తున్న గార్డును బలితీసుకున్న ట్యాంకర్​

sample description
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.