ETV Bharat / briefs

'మేమూ ఆత్మగౌరవంతో బతకగలం'

ట్రాన్స్​జెండర్ అంటేనే సమాజంలో ఓ చిన్నచూపు ఉంటుంది. చాలా మంది ఏహ్యభావంతో చూస్తారు. సమాజంలో డబ్బులు అడుగుతూ జీవిస్తారని భావిస్తుంటారు. అయితే మేమూ అత్మగౌరవంతో జీవించగలమని నిరూపించారు కర్ణాటక చిత్రదుర్గలోని కొందరు ట్రాన్స్​జెండర్లు.

author img

By

Published : Mar 9, 2019, 8:10 PM IST

Updated : Mar 9, 2019, 9:31 PM IST

ట్రాన్స్​జెండర్లు నిర్వహిస్తున్న హోటల్

కర్ణాటక చిత్రదుర్గలో జాతీయ రహదారికి 4 కిలోమీటర్ల దూరంలో ఓ దాబా ఉంది. పట్టణంలో మంచి రుచికర భోజనం దొరికే ప్రదేశాల్లో ఇదీ ఒకటి. చిత్రదుర్గ కోటను సందర్శించేందుకు వచ్చిన వారిని 'సతారా దాబా' ఆహ్వానిస్తుంది. అయితే ఈ దాబాను నడిపేది ట్రాన్స్​జెండర్లు.

ట్రాన్స్​జెండర్లు నిర్వహిస్తున్న హోటల్

తమకూ ఆత్మగౌరవముందని తెలియజెప్పేందుకే ఈ ప్రయత్నమని వారు చెబుతున్నారు. ఎవరూ సాయం చేయకపోయినా స్వతంత్రంగా సాధికారత సాధించగలమని నిరూపించారు హాటల్​ నిర్వహిస్తోన్న భావన బృందం.

"స్వతంత్రంగా జీవించేందుకు బ్యాంకు రుణానికి ప్రయత్నించాం. వారు ఎలాంటి సాయం చేయలేదు. దీన్ని ఓ సవాలుగా తీసుకున్నాను. పెట్టుబడి కోసం నా దగ్గర ఉన్న వస్తువులను తాకట్టు పెట్టాను."
-భావన, హోటల్​ నిర్వాహకురాలు

ప్రస్తుతం రోజుకు రూ. ఐదు నుంచి ఆరు వేల వరకూ ఆదాయం లభిస్తోందని భావన చెబుతున్నారు. హోటల్​ నుంచి వచ్చిన కొంత ఆదాయాన్ని ప్రజాసేవ కోసం వినియోగించటం కొసమెరుపు. స్థానిక ప్రజల కోసం నీటి శుద్ధియంత్రాన్ని తమ సొంత డబ్బుతో కొనుగోలు చేశారు.

ఇదీ చూడండి:అమెరికాలో మేయర్​గా మేక!

కర్ణాటక చిత్రదుర్గలో జాతీయ రహదారికి 4 కిలోమీటర్ల దూరంలో ఓ దాబా ఉంది. పట్టణంలో మంచి రుచికర భోజనం దొరికే ప్రదేశాల్లో ఇదీ ఒకటి. చిత్రదుర్గ కోటను సందర్శించేందుకు వచ్చిన వారిని 'సతారా దాబా' ఆహ్వానిస్తుంది. అయితే ఈ దాబాను నడిపేది ట్రాన్స్​జెండర్లు.

ట్రాన్స్​జెండర్లు నిర్వహిస్తున్న హోటల్

తమకూ ఆత్మగౌరవముందని తెలియజెప్పేందుకే ఈ ప్రయత్నమని వారు చెబుతున్నారు. ఎవరూ సాయం చేయకపోయినా స్వతంత్రంగా సాధికారత సాధించగలమని నిరూపించారు హాటల్​ నిర్వహిస్తోన్న భావన బృందం.

"స్వతంత్రంగా జీవించేందుకు బ్యాంకు రుణానికి ప్రయత్నించాం. వారు ఎలాంటి సాయం చేయలేదు. దీన్ని ఓ సవాలుగా తీసుకున్నాను. పెట్టుబడి కోసం నా దగ్గర ఉన్న వస్తువులను తాకట్టు పెట్టాను."
-భావన, హోటల్​ నిర్వాహకురాలు

ప్రస్తుతం రోజుకు రూ. ఐదు నుంచి ఆరు వేల వరకూ ఆదాయం లభిస్తోందని భావన చెబుతున్నారు. హోటల్​ నుంచి వచ్చిన కొంత ఆదాయాన్ని ప్రజాసేవ కోసం వినియోగించటం కొసమెరుపు. స్థానిక ప్రజల కోసం నీటి శుద్ధియంత్రాన్ని తమ సొంత డబ్బుతో కొనుగోలు చేశారు.

ఇదీ చూడండి:అమెరికాలో మేయర్​గా మేక!

Kishtwar (Jammu and Kashmir), Mar 09 (ANI): The weapon of Personal Security Officer (PSO) of Deputy Commissioner Kishtwar, Angrez Singh Rana, was stolen from his residence in Jammu and Kashmir's Kishtwar on Friday. An unidentified person looted the AK-47 rifle from the security personnel, police sources said. An investigation into the matter is underway. Details in this regard are awaited.
Last Updated : Mar 9, 2019, 9:31 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.