ETV Bharat / briefs

అంతర్మథనంలో హస్తం నేతలు

రాష్ట్రంలో పార్లమెంటు ఎన్నికల్లో ఆశించిన ఫలితాలొచ్చాయని పైకి సంబరంగా చెబుతున్న కాంగ్రెస్​ నేతలు లోలోపల అంతర్మథనం చెందుతున్నారు. పార్టీపరంగా మరింత దృష్టిసారిస్తే మరిన్ని స్థానాలు దక్కేవని పార్టీ విశ్లేషిస్తోంది. క్షేత్రస్థాయిలో భాజపాకు పట్టులేదని చెబుతున్న హస్తం పార్టీ కచ్చితంగా గెలుస్తుందనుకున్న చేవెళ్ల స్థానంలో ఓటమితో నిరాశ చెందింది. పార్టీ బలాబలాలు అంచనా వేసి తగిన ప్రణాళికలతో ముందుకెళ్లాల్సి ఉందని భావిస్తోంది.

author img

By

Published : May 25, 2019, 11:30 AM IST

Updated : May 25, 2019, 12:40 PM IST

congress-result

లోక్​సభ ఎన్నికల్లో ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్లి ఉంటే మరింత మెరుగైన ఫలితాలు వచ్చేవని హస్తంపార్టీ అంతర్మథనం చెందుతోంది. మూడు లోక్​సభ స్థానాల్లో నెగ్గినా కీలక స్థానాల్లో పట్టుకోల్పోవడం, భాజపా, తెరాస ఆధిపత్యం పెరగడం వంటి అంశాలపై కలవరం చెందుతోంది. కొన్ని స్థానాల్లో మరింత ప్రయత్నం చేసి ఉంటే మరో రెండు స్థానాలైనా దక్కేవన్న భావన ఆ పార్టీ నేతల్లో ఉంది.

కాస్త చేయందిస్తే గెలిచేవారే..

మొదటి నుంచి గెలుపు ఖాయమనుకున్న జహీరాబాద్​, చేవెళ్ల స్థానాల్లో ఓటమి అధిష్ఠానంలో కలవరం రేపింది. ఈ రెండు స్థానాల్లోను స్పల్పతేడాతో ఓడిపోవడం పార్టీ శ్రేణుల్లో నిరాశ కలిగించింది. జహీరాబాద్​ స్థానం 6,229 ఓట్ల తేడాతో సమీప అభ్యర్థి మదన్​ మోహన్​రావు ఓటమిపాలవ్వగా, కొండా విశ్వేశ్వర రెడ్డి చేవెళ్లలో 14,772 ఓట్ల తేడాతో ఓడిపోయారు.

కాంగ్రెస్​పార్టీ గెలుపొందిన మూడుస్థానాలతో పాటు జహీరాబాద్​, చేవెళ్ల, పెద్దపల్లి, ఆదిలాబాద్​ నియోజకవర్గాల్లోను గణనీయమైన ఓట్లు సాధించింది. ఆదిలాబాద్​, పెద్దపల్లి నియోజకవర్గాలపై ప్రత్యేక దృష్టి సారిస్తే పార్టీకి సానుకూల ఫలితాలొచ్చేవని హస్తం నేతలు విశ్లేషిస్తున్నారు.

పట్టు నిలుపుకోవాలి

ఖమ్మం, మహబూబాబాద్​ స్థానాల్లో అసెంబ్లీ ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు సాధించిన కాంగ్రెస్​ తర్వాత జరిగిన లోక్​సభ ఎన్నికల్లో ప్రభావం చూపలేకపోయింది. పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన ఎమ్మెల్యేలకు తెరాస మద్దతు పలకడమే ఇందుకు కారణమని కాంగ్రెస్​ భావిస్తోంది. మరోవైపు బలమైన పునాది లేకపోయినా భాజపా నాలుగు స్థానాలు కైవసం చేసుకోవడం హస్తంపార్టీని కలవరపెడుతోంది. భాజపా గెలుపొందిన స్థానాల్లో తమ కేడర్​ను బలపర్చుకోవడానకి కాంగ్రెస్​ నేతలు కృషిచేయాల్సి ఉంది. ఫలితాల విశ్లేషణతో పాటు భాజపా బలపడుతున్న స్థానాలపై ప్రత్యేక దృష్టి సారించాలని పార్టీ నేతలు నిర్ణయించారు. ఈ మేరకు ఇవాళ గాంధీభవన్​లో కీలక సమావేశం జరగనుంది.

అంతర్మథనంలో హస్తం నేతలు
ఇదీ చదవండి: కారు చూపు... హుజూర్​నగర్​ వైపు!

లోక్​సభ ఎన్నికల్లో ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్లి ఉంటే మరింత మెరుగైన ఫలితాలు వచ్చేవని హస్తంపార్టీ అంతర్మథనం చెందుతోంది. మూడు లోక్​సభ స్థానాల్లో నెగ్గినా కీలక స్థానాల్లో పట్టుకోల్పోవడం, భాజపా, తెరాస ఆధిపత్యం పెరగడం వంటి అంశాలపై కలవరం చెందుతోంది. కొన్ని స్థానాల్లో మరింత ప్రయత్నం చేసి ఉంటే మరో రెండు స్థానాలైనా దక్కేవన్న భావన ఆ పార్టీ నేతల్లో ఉంది.

కాస్త చేయందిస్తే గెలిచేవారే..

మొదటి నుంచి గెలుపు ఖాయమనుకున్న జహీరాబాద్​, చేవెళ్ల స్థానాల్లో ఓటమి అధిష్ఠానంలో కలవరం రేపింది. ఈ రెండు స్థానాల్లోను స్పల్పతేడాతో ఓడిపోవడం పార్టీ శ్రేణుల్లో నిరాశ కలిగించింది. జహీరాబాద్​ స్థానం 6,229 ఓట్ల తేడాతో సమీప అభ్యర్థి మదన్​ మోహన్​రావు ఓటమిపాలవ్వగా, కొండా విశ్వేశ్వర రెడ్డి చేవెళ్లలో 14,772 ఓట్ల తేడాతో ఓడిపోయారు.

కాంగ్రెస్​పార్టీ గెలుపొందిన మూడుస్థానాలతో పాటు జహీరాబాద్​, చేవెళ్ల, పెద్దపల్లి, ఆదిలాబాద్​ నియోజకవర్గాల్లోను గణనీయమైన ఓట్లు సాధించింది. ఆదిలాబాద్​, పెద్దపల్లి నియోజకవర్గాలపై ప్రత్యేక దృష్టి సారిస్తే పార్టీకి సానుకూల ఫలితాలొచ్చేవని హస్తం నేతలు విశ్లేషిస్తున్నారు.

పట్టు నిలుపుకోవాలి

ఖమ్మం, మహబూబాబాద్​ స్థానాల్లో అసెంబ్లీ ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు సాధించిన కాంగ్రెస్​ తర్వాత జరిగిన లోక్​సభ ఎన్నికల్లో ప్రభావం చూపలేకపోయింది. పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన ఎమ్మెల్యేలకు తెరాస మద్దతు పలకడమే ఇందుకు కారణమని కాంగ్రెస్​ భావిస్తోంది. మరోవైపు బలమైన పునాది లేకపోయినా భాజపా నాలుగు స్థానాలు కైవసం చేసుకోవడం హస్తంపార్టీని కలవరపెడుతోంది. భాజపా గెలుపొందిన స్థానాల్లో తమ కేడర్​ను బలపర్చుకోవడానకి కాంగ్రెస్​ నేతలు కృషిచేయాల్సి ఉంది. ఫలితాల విశ్లేషణతో పాటు భాజపా బలపడుతున్న స్థానాలపై ప్రత్యేక దృష్టి సారించాలని పార్టీ నేతలు నిర్ణయించారు. ఈ మేరకు ఇవాళ గాంధీభవన్​లో కీలక సమావేశం జరగనుంది.

అంతర్మథనంలో హస్తం నేతలు
ఇదీ చదవండి: కారు చూపు... హుజూర్​నగర్​ వైపు!
Last Updated : May 25, 2019, 12:40 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.