ETV Bharat / bharat

కుక్కపై కర్కశత్వం- వేలాడదీసి, చితకబాది... - శునకాన్ని కొట్టి చంపిన దృశ్యాలు

శునకాన్ని చిత్రహింసలకు గురి చేసి చంపారు కొందరు కిరాతకులు. కేరళ తిరువనంతపురంలోని విళింజంలోని ఓడరేవులో ఈ ఘటన జరిగింది. ఈ కేసులో ఓ మైనర్​ సహా ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు.

dog killed
శునకాన్ని కొట్టి చంపిన ఘటన
author img

By

Published : Jul 1, 2021, 11:01 AM IST

శునకాన్ని కొట్టి చంపిన దృశ్యాలు

కేరళ తిరువనంతపురంలో దారుణం జరిగింది. శునకం మెడను బోటుకు కట్టేసి, కొట్టి చంపారు కొందరు యువకులు. ఈ కేసులో ఓ మైనర్​ సహా ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు.

అసలేం జరిగింది?

ఆదిమలాతుర ప్రాంతానికి చెందిన క్రీస్తురాజ్​ అనే వ్యక్తి లాబ్రడార్​ జాతికి చెందిన బ్రూనో అనే శునకాన్ని పెంచుతున్నాడు. అది ఆడుకుంటూ విళింజం​ తీరప్రాంతానికి చేరుకుంది. అక్కడే ఓ బోటు కింద పడుకుని ఉంది. ఆ సమయంలో.. దాని మెడకు తాడు కట్టి, బోటుకు వేలాడిదీసి, కర్రలతో కొట్టారు నిందితులు. దెబ్బల ధాటికి శునకం ప్రాణాలొదిలింది.

తన శునకాన్ని హత్య చేయటంపై.. విళింజం​ పోలీసులకు క్రీస్తురాజ్​ ఫిర్యాదు చేశాడు. ఓ మైనర్​ సహా నిందితులైన శిలువయ్యన్(20), సునీల్​(22)ను పోలీసులు అరెస్టు చేశారు.

Dog brutally thrashed to death
నిందితులు

మరోవైపు.. ఈ వీడియోను పోస్టు చేసేవారిని హత్య చేస్తానంటూ నిందితులు బెదిరించారని కూడా తమకు ఫిర్యాదులు అందాయని పోలీసులు తెలిపారు. జంతు హింస నేరం కింద వారిపై కేసు నమోదు చేసినట్లు చెప్పారు. అయితే.. తమలో ఓ వ్యక్తి తల్లిని సదరు శునకం కరిచిందని, అందుకే దానిపై దాడి చేశామని నిందితులు చెప్పారు.

ఇదీ చూడండి: తండ్రిని గొడ్డలితో నరికి చంపిన​ కూతుళ్లు

ఇదీ చూడండి: పెళ్లి వద్దని మర్మాంగాన్ని కోసుకున్న యువకుడు!

శునకాన్ని కొట్టి చంపిన దృశ్యాలు

కేరళ తిరువనంతపురంలో దారుణం జరిగింది. శునకం మెడను బోటుకు కట్టేసి, కొట్టి చంపారు కొందరు యువకులు. ఈ కేసులో ఓ మైనర్​ సహా ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు.

అసలేం జరిగింది?

ఆదిమలాతుర ప్రాంతానికి చెందిన క్రీస్తురాజ్​ అనే వ్యక్తి లాబ్రడార్​ జాతికి చెందిన బ్రూనో అనే శునకాన్ని పెంచుతున్నాడు. అది ఆడుకుంటూ విళింజం​ తీరప్రాంతానికి చేరుకుంది. అక్కడే ఓ బోటు కింద పడుకుని ఉంది. ఆ సమయంలో.. దాని మెడకు తాడు కట్టి, బోటుకు వేలాడిదీసి, కర్రలతో కొట్టారు నిందితులు. దెబ్బల ధాటికి శునకం ప్రాణాలొదిలింది.

తన శునకాన్ని హత్య చేయటంపై.. విళింజం​ పోలీసులకు క్రీస్తురాజ్​ ఫిర్యాదు చేశాడు. ఓ మైనర్​ సహా నిందితులైన శిలువయ్యన్(20), సునీల్​(22)ను పోలీసులు అరెస్టు చేశారు.

Dog brutally thrashed to death
నిందితులు

మరోవైపు.. ఈ వీడియోను పోస్టు చేసేవారిని హత్య చేస్తానంటూ నిందితులు బెదిరించారని కూడా తమకు ఫిర్యాదులు అందాయని పోలీసులు తెలిపారు. జంతు హింస నేరం కింద వారిపై కేసు నమోదు చేసినట్లు చెప్పారు. అయితే.. తమలో ఓ వ్యక్తి తల్లిని సదరు శునకం కరిచిందని, అందుకే దానిపై దాడి చేశామని నిందితులు చెప్పారు.

ఇదీ చూడండి: తండ్రిని గొడ్డలితో నరికి చంపిన​ కూతుళ్లు

ఇదీ చూడండి: పెళ్లి వద్దని మర్మాంగాన్ని కోసుకున్న యువకుడు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.