ETV Bharat / bharat

మోదీ పర్యటనకు ముందు పేలుడు- అంతా టెన్షన్​ టెన్షన్​!

author img

By

Published : Apr 24, 2022, 11:21 AM IST

PM Modi Kashmir Visit: ప్రధాని నరేంద్ర మోదీ జమ్మూకశ్మీర్​ పర్యటన వేళ బిశ్నా ప్రాంతంలో ఆదివారం పేలుడు సంభవించింది. మోదీ ప్రసంగించనున్న సభకు 7 కిలోమీటర్ల దూరంలోనే ఈ బ్లాస్ట్​ జరిగిందని అధికారులు తెలిపారు. గ్రామస్థుల సమాచారం మేరకు ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. ఈ ఘటనపై దర్యాప్తు ముమ్మరం చేశారు.

blast in jammu today
modi kashmir visit

PM Modi Kashmir Visit: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటన వేళ.. జమ్మూ బిశ్నా ప్రాంతంలోని లలియాన్ గ్రామంలో ఆదివారం పేలుడు సంభవించింది. ప్రధాని ప్రసంగించనున్న పల్లీ గ్రామానికి ఇది కేవలం 7 కిలోమీటర్ల దూరంలో జరిగింది. వ్యవసాయ క్షేత్రంలో జరిగిన ఈ పేలుడు గురించి గ్రామస్థులు సమాచారం అందించినట్లు పోలీసులు తెలిపారు. దీనిని పిడుగుపాటు లేదా ఉల్కగా అనుమానిస్తున్న పోలీసులు.. దర్యాప్తు ముమ్మరం చేశారు.

blast in jammu today
జమ్మూలో పేలుడు ప్రదేశం

ఆర్టికల్ 370 రద్దు అనంతరం జమ్మూకశ్మీర్​లో మోదీ పర్యటించడం ఇదే తొలిసారి. పంచాయతీ రాజ్​ దినోత్సవం సందర్భంగా దేశంలోని గ్రామ పంచాయతీలను ఉద్దేశించి సాంబాలోని పల్లీ గ్రామంలో మోదీ ప్రసంగించనున్నారు. ఈ వేదిక వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు అధికారులు. ఈ పర్యటనలో బనిహాల్‌-కాజీగుండ్‌ సొరంగ మార్గంతో పాటు, రూ.20 వేల కోట్ల విలువైన వివిధ అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు మోదీ.

ఉగ్రవాది అరెస్టు: జైషే మహ్మద్​కు చెందిన షఫీక్​ అహ్మద్​ షేక్​ అనే ఉగ్రవాదిని శనివారం అరెస్టు చేశారు కశ్మీర్ పోలీసులు. అతడు త్రాల్ ప్రాంతానికి చెందినవాడని, భద్రతా దళాలను మట్టుబెట్టే కుట్రలో అతడు కూడా భాగమని పోలీసులు తెలిపారు. "జమ్మూకు వచ్చి భద్రతా దళాల క్యాంపునకు దగ్గర్లోని తన ఇంట్లో ఇద్దరు ముష్కరులను ఉంచాలని షఫీక్​కు ఉగ్రసంస్థ నుంచి ఆదేశాలు వచ్చాయి. వారిద్దరినీ సాంబా నుంచి అతడి వద్దకు తీసుకురావాల్సిన వ్యక్తిని బిలాల్ అహ్మద్​గా గుర్తించాం. అయితే భద్రతా దళాలపై దాడికి ముందే వారు ఎన్​కౌంటర్​లో హతమయ్యారు. దీనిపై దర్యాప్తు కొనసాగుతోంది" అని అధికారులు వెల్లడించారు.

PM Modi Kashmir Visit: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటన వేళ.. జమ్మూ బిశ్నా ప్రాంతంలోని లలియాన్ గ్రామంలో ఆదివారం పేలుడు సంభవించింది. ప్రధాని ప్రసంగించనున్న పల్లీ గ్రామానికి ఇది కేవలం 7 కిలోమీటర్ల దూరంలో జరిగింది. వ్యవసాయ క్షేత్రంలో జరిగిన ఈ పేలుడు గురించి గ్రామస్థులు సమాచారం అందించినట్లు పోలీసులు తెలిపారు. దీనిని పిడుగుపాటు లేదా ఉల్కగా అనుమానిస్తున్న పోలీసులు.. దర్యాప్తు ముమ్మరం చేశారు.

blast in jammu today
జమ్మూలో పేలుడు ప్రదేశం

ఆర్టికల్ 370 రద్దు అనంతరం జమ్మూకశ్మీర్​లో మోదీ పర్యటించడం ఇదే తొలిసారి. పంచాయతీ రాజ్​ దినోత్సవం సందర్భంగా దేశంలోని గ్రామ పంచాయతీలను ఉద్దేశించి సాంబాలోని పల్లీ గ్రామంలో మోదీ ప్రసంగించనున్నారు. ఈ వేదిక వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు అధికారులు. ఈ పర్యటనలో బనిహాల్‌-కాజీగుండ్‌ సొరంగ మార్గంతో పాటు, రూ.20 వేల కోట్ల విలువైన వివిధ అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు మోదీ.

ఉగ్రవాది అరెస్టు: జైషే మహ్మద్​కు చెందిన షఫీక్​ అహ్మద్​ షేక్​ అనే ఉగ్రవాదిని శనివారం అరెస్టు చేశారు కశ్మీర్ పోలీసులు. అతడు త్రాల్ ప్రాంతానికి చెందినవాడని, భద్రతా దళాలను మట్టుబెట్టే కుట్రలో అతడు కూడా భాగమని పోలీసులు తెలిపారు. "జమ్మూకు వచ్చి భద్రతా దళాల క్యాంపునకు దగ్గర్లోని తన ఇంట్లో ఇద్దరు ముష్కరులను ఉంచాలని షఫీక్​కు ఉగ్రసంస్థ నుంచి ఆదేశాలు వచ్చాయి. వారిద్దరినీ సాంబా నుంచి అతడి వద్దకు తీసుకురావాల్సిన వ్యక్తిని బిలాల్ అహ్మద్​గా గుర్తించాం. అయితే భద్రతా దళాలపై దాడికి ముందే వారు ఎన్​కౌంటర్​లో హతమయ్యారు. దీనిపై దర్యాప్తు కొనసాగుతోంది" అని అధికారులు వెల్లడించారు.

ఇదీ చూడండి:

జమ్మూకు మోదీ.. రూ.20వేల కోట్లతో అభివృద్ధి పనులు

మోదీ పర్యటనకు ముందు మరో ఎన్​కౌంటర్.. భద్రత కట్టుదిట్టం

జవాన్ల బస్సుపై ఉగ్రవాదులు ఎలా దాడి చేశారంటే..?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.