ETV Bharat / bharat

ఎన్​కౌంటర్ ప్రదేశానికి బాలుడ్ని తీసుకెళ్లటంపై విమర్శలు

author img

By

Published : Mar 22, 2021, 7:53 PM IST

జమ్ముకశ్మీర్​లో సోమవారం జరిగిన షోపియాన్​ ఎన్​కౌంటర్​ ఘటనపై విమర్శలు వస్తున్నాయి. ఓ ఉగ్రవాది మనసు మార్చేందుకు అతడి భార్య, కుమారుడి చేత లొంగిపోమని చెప్పించారు పోలీసులు. అయితే ఎన్​కౌంటర్ ప్రదేశంలోకి చిన్నపిల్లాడిని తీసుకెళ్లడమేంటని పోలీసులపై విమర్శలు వెల్లువెత్తాయి.

Shopian Gunfight: Wife and son try to persuade militants to surrender minutes before killing
ఎన్​కౌంటర్ ప్రాంగణంలోకి బాలుడిని తీసుకెళ్లటంపై విమర్శలు
ఎన్​కౌంటర్ ప్రాంగణంలోకి బాలుడిని తీసుకెళ్లటంపై విమర్శలు

జమ్ముకశ్మీర్​ షోపియాన్​ జిల్లాలో సోమవారం జరిగిన ఎన్​కౌంటర్​ ఘటనపై నెటిజన్లు విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ఎన్​కౌంటర్ ప్రాంగణంలోకి చిన్నపిల్లాడిని తీసుకెళ్లడం ఏంటని? పోలీసులను ప్రశ్నిస్తున్నారు.

ఏం జరిగింది ?

జమ్ముకశ్మీర్​ షోపియాన్​ జిల్లాలో ఉగ్రవాదులు ఉన్నారన్న సమాచారం రాగానే పోలీసులు అప్రమత్తమయ్యారు. ముష్కరులను లొంగిపోమని.. వారి బంధువులతో చెప్పించారు. ఈ క్రమంలో ఉగ్రవాది అహ్మద్​ మాలిక్​ ను లొంగిపోమని అతడి భార్య, మూడేళ్ల కుమారుడు ప్రాధేయపడ్డారు. కానీ మాలిక్​ మనసు మారలేదు. చివరకు పోలీసులు కాల్పుల్లో మాలిక్​ మృతి చెందాడు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది.

బాలుడు అక్కడికి ఎందుకు?

అయితే ఎన్​కౌంటర్​ ప్రాంగణంలోకి చిన్నపిల్లల్ని ఎలా తీసుకెళ్తారంటూ వీడియో చూసిన నెటిజన్లు.. పోలీసులపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ చర్య వల్ల బాలుడు మానసికంగా బాధపడతాడని సీనియర్​ జర్నలిస్ట్​ అమన్​ సింగ్​ చిన్నా ట్వీట్ చేశారు. మరో సీనియర్ జర్నలిస్ట్ అరవింద్​ చౌహాన్​ మాట్లాడుతూ.. 'మిలిటరీ కోణంలో చూస్తే పోలీసులు.. తమ పనిని శాంతియుతంగా పూర్తి చేసేందుకు ఎలాంటి చర్యలైనా చేపట్టవచ్చు. కానీ మానవతా దృక్పథంతో చూస్తే మాత్రం.. బాలుడిని ఇలాంటి ఆపరేషన్లకు తీసుకెళ్లవద్దు' అన్నారు.

పోలీసులు, ఉగ్రవాదులకు మధ్య సోమవారం జరిగిన ఎన్​కౌంటర్​లో లష్కర్​-ఏ-తోయిబాకు చెందిన నలుగురు తీవ్రవాదులు మృతి చెందారు.

ఇదీ చదవండి: 'సీఏఏ, భాజపాను ఓడించాలనేదే ప్రజల కోరిక'

ఎన్​కౌంటర్ ప్రాంగణంలోకి బాలుడిని తీసుకెళ్లటంపై విమర్శలు

జమ్ముకశ్మీర్​ షోపియాన్​ జిల్లాలో సోమవారం జరిగిన ఎన్​కౌంటర్​ ఘటనపై నెటిజన్లు విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ఎన్​కౌంటర్ ప్రాంగణంలోకి చిన్నపిల్లాడిని తీసుకెళ్లడం ఏంటని? పోలీసులను ప్రశ్నిస్తున్నారు.

ఏం జరిగింది ?

జమ్ముకశ్మీర్​ షోపియాన్​ జిల్లాలో ఉగ్రవాదులు ఉన్నారన్న సమాచారం రాగానే పోలీసులు అప్రమత్తమయ్యారు. ముష్కరులను లొంగిపోమని.. వారి బంధువులతో చెప్పించారు. ఈ క్రమంలో ఉగ్రవాది అహ్మద్​ మాలిక్​ ను లొంగిపోమని అతడి భార్య, మూడేళ్ల కుమారుడు ప్రాధేయపడ్డారు. కానీ మాలిక్​ మనసు మారలేదు. చివరకు పోలీసులు కాల్పుల్లో మాలిక్​ మృతి చెందాడు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది.

బాలుడు అక్కడికి ఎందుకు?

అయితే ఎన్​కౌంటర్​ ప్రాంగణంలోకి చిన్నపిల్లల్ని ఎలా తీసుకెళ్తారంటూ వీడియో చూసిన నెటిజన్లు.. పోలీసులపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ చర్య వల్ల బాలుడు మానసికంగా బాధపడతాడని సీనియర్​ జర్నలిస్ట్​ అమన్​ సింగ్​ చిన్నా ట్వీట్ చేశారు. మరో సీనియర్ జర్నలిస్ట్ అరవింద్​ చౌహాన్​ మాట్లాడుతూ.. 'మిలిటరీ కోణంలో చూస్తే పోలీసులు.. తమ పనిని శాంతియుతంగా పూర్తి చేసేందుకు ఎలాంటి చర్యలైనా చేపట్టవచ్చు. కానీ మానవతా దృక్పథంతో చూస్తే మాత్రం.. బాలుడిని ఇలాంటి ఆపరేషన్లకు తీసుకెళ్లవద్దు' అన్నారు.

పోలీసులు, ఉగ్రవాదులకు మధ్య సోమవారం జరిగిన ఎన్​కౌంటర్​లో లష్కర్​-ఏ-తోయిబాకు చెందిన నలుగురు తీవ్రవాదులు మృతి చెందారు.

ఇదీ చదవండి: 'సీఏఏ, భాజపాను ఓడించాలనేదే ప్రజల కోరిక'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.