ETV Bharat / bharat

CBSE: పరీక్షల రద్దుపై సుప్రీం విచారణ వాయిదా

author img

By

Published : May 28, 2021, 12:18 PM IST

కరోనా వ్యాప్తి దృష్ట్యా.. సీబీఎస్‌ఈ(CBSE) 12వ తరగతి పరీక్ష రద్దు చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్​ విచారణను సుప్రీంకోర్టు సోమవారానికి వాయిదా వేసింది. పిటిషన్‌ కాపీని ప్రతివాదులకు ఇవ్వాలని పిటిషన్​దారును ఆదేశించింది.

supreme court cbse exams
సుప్రీంకోర్టు

సీబీఎస్‌ఈ(CBSE) 12వ తరగతి పరీక్షలు రద్దు చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై విచారణను సర్వోన్నత న్యాయస్థానం వాయిదా వేసింది. ప్రస్తుత కరోనా పరిస్థితుల దృష్ట్యా 12వ తరగతి పరీక్షల రద్దుకు సీబీఎస్ఈ(CBSE), సీఐఎస్‌సీఈ బోర్డులకు ఆదేశాలు జారీ చేయాలంటూ న్యాయవాది మమతా శర్మ సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను స్వీకరించిన జస్టిస్‌ ఖాన్విల్కర్‌, జస్టిస్‌ దినేశ్‌ మహేశ్వరిలతో కూడిన ధర్మాసనం.. తదుపరి విచారణను మే 31వ తేదీ(సోమవారం)కి వాయిదా వేసింది. పిటిషన్‌ కాపీని ప్రతివాదులకు ఇవ్వాలని పిటిషన్​దారును ఆదేశించింది.

సీబీఎస్‌ఈ(CBSE) 12వ తరగతి పరీక్షల షెడ్యూల్‌ను జూన్‌ 1న ఖరారు చేయనున్నట్లు ఇటీవల కేంద్ర విద్యాశాఖ ప్రకటించింది. అయితే సోమవారం సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పును బట్టి పరీక్షలపై విద్యాశాఖ తదుపరి నిర్ణయం తీసుకోనుంది. మరోవైపు సుప్రీం తీర్పుతో రాష్ట్రాల బోర్డులు కూడా 12వ తరగతి పరీక్షలపై నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయి.

12వ తరగతి పరీక్షలపై ఇటీవల కేంద్ర విద్యాశాఖ.. రాష్ట్రాలతో సమావేశమైంది. జులై 15 నుంచి ఆగస్టు 28 వరకు వీటిని నిర్వహించాలని భావిస్తున్నారు. అయితే కరోనా దృష్ట్యా పరీక్షల నిర్వహణపై కేంద్రం రెండు ప్రతిపాదనలను సూచించింది. ఒకటి.. ముఖ్యమైన సబ్జెక్టులకు మాత్రమే పరీక్షలు నిర్వహించడం. రెండోది.. అన్నింటికీ పరీక్షలు నిర్వహించడం కానీ పరీక్ష సమయాన్ని 3 గంటల నుంచి 90 నిమిషాలకు తగ్గించడం. చాలా రాష్ట్రాలు రెండో ప్రతిపాదనకు మొగ్గు చూపినట్లు తెలుస్తోంది.

సీబీఎస్‌ఈ(CBSE) 12వ తరగతి పరీక్షలు రద్దు చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై విచారణను సర్వోన్నత న్యాయస్థానం వాయిదా వేసింది. ప్రస్తుత కరోనా పరిస్థితుల దృష్ట్యా 12వ తరగతి పరీక్షల రద్దుకు సీబీఎస్ఈ(CBSE), సీఐఎస్‌సీఈ బోర్డులకు ఆదేశాలు జారీ చేయాలంటూ న్యాయవాది మమతా శర్మ సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను స్వీకరించిన జస్టిస్‌ ఖాన్విల్కర్‌, జస్టిస్‌ దినేశ్‌ మహేశ్వరిలతో కూడిన ధర్మాసనం.. తదుపరి విచారణను మే 31వ తేదీ(సోమవారం)కి వాయిదా వేసింది. పిటిషన్‌ కాపీని ప్రతివాదులకు ఇవ్వాలని పిటిషన్​దారును ఆదేశించింది.

సీబీఎస్‌ఈ(CBSE) 12వ తరగతి పరీక్షల షెడ్యూల్‌ను జూన్‌ 1న ఖరారు చేయనున్నట్లు ఇటీవల కేంద్ర విద్యాశాఖ ప్రకటించింది. అయితే సోమవారం సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పును బట్టి పరీక్షలపై విద్యాశాఖ తదుపరి నిర్ణయం తీసుకోనుంది. మరోవైపు సుప్రీం తీర్పుతో రాష్ట్రాల బోర్డులు కూడా 12వ తరగతి పరీక్షలపై నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయి.

12వ తరగతి పరీక్షలపై ఇటీవల కేంద్ర విద్యాశాఖ.. రాష్ట్రాలతో సమావేశమైంది. జులై 15 నుంచి ఆగస్టు 28 వరకు వీటిని నిర్వహించాలని భావిస్తున్నారు. అయితే కరోనా దృష్ట్యా పరీక్షల నిర్వహణపై కేంద్రం రెండు ప్రతిపాదనలను సూచించింది. ఒకటి.. ముఖ్యమైన సబ్జెక్టులకు మాత్రమే పరీక్షలు నిర్వహించడం. రెండోది.. అన్నింటికీ పరీక్షలు నిర్వహించడం కానీ పరీక్ష సమయాన్ని 3 గంటల నుంచి 90 నిమిషాలకు తగ్గించడం. చాలా రాష్ట్రాలు రెండో ప్రతిపాదనకు మొగ్గు చూపినట్లు తెలుస్తోంది.

ఇదీ చూడండి: జూన్ వరకు కొవిడ్ మార్గదర్శకాలు కొనసాగింపు

ఇదీ చూడండి: కొత్తగా క్రీమ్​ ఫంగస్​.. ఆ రాష్ట్రంలో తొలి కేసు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.