ETV Bharat / bharat

'అయోధ్య రామాలయం కోసం రూ.3000 కోట్ల విరాళాలు'

అయోధ్య రామమందిర నిర్మాణానికి రూ.3000 కోట్ల విరాళాలు వచ్చాయి. శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్​ ప్రధాన కార్యదర్శి చంపత్​ రాయ్​ ఈమేరకు వెల్లడించారు.

author img

By

Published : Mar 17, 2021, 11:10 AM IST

Ayodhya Ram Temple Trust collects Rs 3000 crore funds___________________
'రామ మందిర నిర్మాణానికి రూ.3000కోట్ల విరాళాలు'

అయోధ్యలో రామమందిర నిర్మాణానికి ఇప్పటికి వరకు రూ.3000కోట్ల విరాళాలు వచ్చాయని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్​ ప్రధాన కార్యదర్శి చంపత్​ రాయ్​ తెలిపారు. అయితే లెక్కింపు కొనసాగుతోందని.. ఈ మొత్తం పెరిగే అవకాశముందని పేర్కొన్నారు. విరాళాలు ఇవ్వడంలో ప్రజలు చూపుతున్న చొరవను ప్రశంసించారు.

ఇంటింటికీ వెళ్లి విరాళాలు సేకరించడాన్ని నిలిపివేశామని చెప్పారు రాయ్. ట్రస్ట్​ ఖాతా ద్వారా విరాళాలు వస్తున్నాయని తెలిపారు. రామమందిర అధికారిక వెబ్​సైట్​ ద్వారా లేదా ఆన్​లైన్​ పద్ధతిలో పంజాబ్​ నేషనల్​ బ్యాంక్​, బ్యాంక్​ ఆఫ్​ బరోడా, స్టేట్​ బ్యాంక్​ ఆఫ్​ ఇండియా ద్వారా విరాళాలు అందించవచ్చని వెల్లడించారు.

అయోధ్యలో రామమందిర నిర్మాణానికి ఇప్పటికి వరకు రూ.3000కోట్ల విరాళాలు వచ్చాయని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్​ ప్రధాన కార్యదర్శి చంపత్​ రాయ్​ తెలిపారు. అయితే లెక్కింపు కొనసాగుతోందని.. ఈ మొత్తం పెరిగే అవకాశముందని పేర్కొన్నారు. విరాళాలు ఇవ్వడంలో ప్రజలు చూపుతున్న చొరవను ప్రశంసించారు.

ఇంటింటికీ వెళ్లి విరాళాలు సేకరించడాన్ని నిలిపివేశామని చెప్పారు రాయ్. ట్రస్ట్​ ఖాతా ద్వారా విరాళాలు వస్తున్నాయని తెలిపారు. రామమందిర అధికారిక వెబ్​సైట్​ ద్వారా లేదా ఆన్​లైన్​ పద్ధతిలో పంజాబ్​ నేషనల్​ బ్యాంక్​, బ్యాంక్​ ఆఫ్​ బరోడా, స్టేట్​ బ్యాంక్​ ఆఫ్​ ఇండియా ద్వారా విరాళాలు అందించవచ్చని వెల్లడించారు.

ఇదీ చూడండి: 'అయోధ్య గుడికి రూ.1,511కోట్ల విరాళాలు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.