Dhanush sues Nayanthara : కోలీవుడ్ నటి నయనతార, ఆమె భర్త, డైరెక్టర్ విఘ్నేశ్ శివన్పై ధనుశ్ దావా వేశారు. పర్మిషన్ లేకుండా 'నానుమ్ రౌడీ దాన్' (నేనే రౌడీనే) విజువల్స్ వాడుకోవడం వల్ల ఆయన నిర్మాణసంస్థ తాజాగా మద్రాస్ హైకోర్టును ఆశ్రయించింది. ఈ మేరకు నయన్ దంపతులపై ధనుశ్ పిటిషన్ దాఖలు చేశారు. దీన్ని పరిశీలించిన ధర్మాసనం, విచారణకు అంగీకరించింది.
ఏం జరిగిందంటే?
డాక్యుమెంటరీ విషయంలో నయన్, ధనుశ్ మధ్య తాజాగా వివాదం జరిగిన సంగతి తెలిసిందే. తమకు చాలా ముఖ్యమైన 'నానుమ్ రౌడీ దాన్' సినిమా విశేషాలను తమ పెళ్లి డాక్యుమెంటరీలో చూపించాలని నయన్ దంపతులు కోరినప్పటికీ, ఆ మూవీ నిర్మాత అయిన ధనుశ్ నుంచి ఎటువంటి పర్మిషన్ రాలేదని అందుకు తాను ఎంతో బాధపడ్డానంటూ నయనతార పేర్కొన్నారు. ఈ క్రమంలో ఇటీవల సోషల్ మీడియా వేదికగా ఓ బహిరంగ లేఖ కూడా రిలీజ్ చేశారు.
అందులో డాక్యుమెంటరీ ట్రైలర్లో వాళ్లు మూడు సెకన్ల సీన్స్ ఉపయోగించినందుకుగానూ పరిహారంగా ధనుశ్ రూ.10 కోట్లు డిమాండ్ చేశారంటూ నయన్ తెలిపారు. అంతేకాకుండా ఆ లేఖలో ఆమె ధనుశ్ క్యారెక్టర్ను కూడా తప్పుబట్టారు. ఆమెపై ధనుశ్ ద్వేషం కనబరుస్తున్నారంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో సినీ ఇండస్ట్రీలో ఈ వ్యాఖ్యలు తీవ్ర చర్చలకు దారితీశాయి. అయితే కొందరేమో ధనుశ్కు మద్దతు తెలుపగా, మరికొందరేమో నయన్కు సపోర్ట్ ఇచ్చారు.
ఇక 'నయనతార : బియాండ్ ది ఫెయిరీ టేల్' డాక్యుమెంటరీ ప్రస్తుతం నెట్ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమ్ అవుతోంది. అందులో నయన్ కెరీర్, ఆమె ఎదుర్కొన్న అవమానాలు, అలాగే విమర్శలను ఆ డాక్యుమెంటరీలో చూపించారు. ముఖ్యంగా విఘ్నేశ్ శివన్తో తనకు ఏర్పడ్డ పరిచయం, వారి లవ్ స్టోరీ, పెళ్లి వేడుకను ఇందులో చూపించారు. అయితే విఘ్నేశ్ శివన్ డైరెక్ట్ చేసిన 'నానుమ్ రౌడీ దాన్'లో నయనతార హీరోయిన్గా నటించారు. ధనుశ్ నిర్మాతగా వ్యవహరించారు. ఇక ఆ సినిమా సెట్లోనే నయన్ - విఘ్నేశ్ల స్నేహం మొదలైంది. అందుకే ఈ మూవీ వీడియోలు, పాటలను డాక్యుమెంటరీకి జత చేయాలని వారు భావించినట్లు తెలుస్తోంది.
ఈవెంట్లో పక్కపక్కనే ధనుశ్, నయన్- కాపీరైట్స్ కాంట్రవర్సీ తర్వాత ఫస్ట్ టైమ్!
'అసలు అప్పుడు ఏం జరిగింది?' - నయన్, ధనుశ్ కాంట్రవర్సీ డాక్యుమెంటరీ రివ్యూ