ETV Bharat / bharat

Polavaram Project: పోలవరం అంచనాలను భారీగా పెంచిన జగన్ సర్కార్..​ వెల్లువెత్తుతున్న సందేహాలు

author img

By

Published : Jun 1, 2023, 7:33 AM IST

Polavaram Project: పోలవరం పనుల్లో అంకెల గారడీ నడుస్తోంది. తొలిదశ అంచనాలను జగన్ సర్కార్ భారీగా పెంచడంపై సందేహాలు వెల్లువెత్తుతున్నాయి. ఏడాదిన్నర కిందటి అంచనాలకు ఇప్పటికీ 5వేల కోట్లకు పైగానే పెరిగాయి. పాక్షిక డయాఫ్రంవాల్ నిర్మాణానికే 300 కోట్లకుపైగా అంచనాలు సిద్ధం చేశారు. రెండు కీలక కమిటీలు ఆమోదించిన డీపీఆర్ -2 ఉసే ఎత్తకుండా కేంద్రం పదేపదే 41.15 మీటర్ల ఎత్తు వరకు నీటి నిల్వకు సంబంధించి అంచనాలు కోరడం.. రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం చేసి అందించడంపై అనుమానాలు రేకెత్తుతున్నాయి. నేడు దిల్లీలో జరగనున్న పోలవరం పురోగతి సమీక్షలోనైనా నిధులు అంశం తేలేనా లేదా అన్న సందిగ్ధం నెలకొంది.

Polavaram Project
పోలవరం ప్రాజెక్టు
పోలవరం అంచనాలను భారీగా పెంచిన జగన్ సర్కార్..​ వెల్లువెత్తుతున్న సందేహాలు

Polavaram Project: పోలవరం ప్రాజెక్టులో తొలిదశ అంచనాలు భారీగా పెరిగిపోయాయి. 2022 జనవరిలో 10 వేల 911 కోట్లతో రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి అంచనాలు సమర్పించినా అవి కొలిక్కి రాలేదు. మళ్లీ తాజాగా తొలిదశ అంచనాలు సమర్పించాలని కేంద్ర జల్‌శక్తి శాఖ కోరిన మేరకు మే ప్రారంభంలో కేంద్రానికి నివేదిక పంపారు. కొత్తగా పంపిన నివేదికలో అంచనాలు ఒక్కసారిగా 16వేల 952 కోట్లకు చేరిపోయాయి. ఏడాదిన్నర కాలంలో కొన్ని అదనపు పనులు, కొంత అదనపు భూసేకరణ, పునరావాసంతో ఈ అంచనాలు భారీగా పెరిగిపోయాయి.

ఒకవైపు పోలవరానికి నిధులు సాధించడంలో జగన్‌ సర్కార్‌ సాధించింది ఏమీ లేకపోగా.. మరోవైపు ఎప్పటికప్పుడు కొత్త అంచనాలు అంటూ సాగుతున్న ప్రహసనంలో అంకెలు మారిపోతూ వస్తున్నాయి. కేంద్రజల్‌ శక్తిశాఖ మంత్రి షెకావత్‌ ఆధ్వర్యంలో నేడు దిల్లీలో పోలవరం ప్రాజెక్టు పురోగతిపై సమీక్ష నిర్వహించనున్నారు. తొలిదశ అంచనాలపైనా కేంద్రమంత్రి చర్చించనున్నారని సమాచారం. పోలవరం నిధులకు సంబంధించి నాలుగు సంవత్సరాలుగా జగన్‌ ప్రభుత్వంలో సాగుతున్న ప్రహసనం కొలిక్కి వచ్చేనా? లేదంటే మళ్లీ పెండింగ్​లో పడుతుందా అనేది నేడు తెలియనుంది.

పోలవరంపై దిల్లీకి అఖిలపక్షం.. రాష్ట్రప్రభుత్వంపై వత్తిడి దిశగా రౌండ్​టేబుల్ సమావేశం

పోలవరం ప్రాజెక్టులో తొలిదశ నిధులు ఇవ్వడంపైనే పెద్దఎత్తున సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అటు పోలవరం అధికారులు, జలవనరుల శాఖ అధికారుల్లోనే ఈ తొలిదశ ప్రహసనంపై సందేహాలు ఉన్నాయి. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో పోలవరం ప్రాజెక్టుకు 2017-18 ధరలతో సుమారు 55 వేల కోట్లతో సవరించిన అంచనాలను రెండో డీపీఆర్‌గా సమర్పించారు. అప్పట్లోనే కేంద్ర ప్రభుత్వం అనేక ప్రశ్నలను లేవనెత్తితే నెలల తరబడి అధికారులు దిల్లీలో ఉండి సందేహాలను నివృత్తి చేశారు.

ఆ అంచనాల్ని పరిశీలించన కేంద్ర జల్‌ శక్తి శాఖ ఆధ్వర్యంలోని సాంకేతిక సలహా కమిటీ 2019 ఫిబ్రవరిలో.. సవరించిన అంచనాలకు ఆమోదం తెలిపింది. సాంకేతిక సలహా కమిటీ ఆమోదం పొందిందంటే డీపీఆర్-2 కొలిక్కి వచ్చినట్లుగానే భావించాలి. అలాంటిది జగన్‌ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సాంకేతిక సలహా కమిటీ ఆమోదం పొందిన అంచనాలపై రివైజ్డు కాస్ట్‌ కమిటీని ఏర్పాటు చేశారు. వారు అధ్యయనం చేసి 47వేల 725 కోట్లకు ఆమోదం తెలిపారు. ఆ ప్రతిపాదనను కేంద్రజల్‌ శక్తి శాఖ ఆమోదించి ఆర్థికశాఖకు పంపాక, కేంద్ర మంత్రిమండలి ఆమోదం పొందితే డీపీఆర్- 2 కింద నిధులు ఇచ్చే ఆస్కారం ఉంది.

అయితే సీఎం జగన్ ఆ డీపీఆర్​పై పోరాడి నిధులు సాధించుకోలేక పోయింది. వాస్తవానికి డీపీఆర్​ను ఆమోదించి తొలిదశగా కొన్ని నిధులివ్వొచ్చు. ఆ తర్వాత రెండో దశ కింద మిగిలిన నిధులిచ్చే అవకాశం ఉంది. కానీ కేంద్రం మాత్రం 41.15 మీటర్ల ఎత్తు వరకు నీటిని నిల్వచేస్తే ఎంత ఖర్చవుతుందో ఆ మొత్తం తొలిదశగా అంచనాలు తయారు చేసి పంపాలని కోరింది. జగన్‌ సర్కార్‌ సైతం ఆదే కోణంలో ముందుకు వెళ్తుండటం అనేక అనుమానాలకు తావిస్తోంది. అనేక ఏళ్ల పాటు పోలవరం డీపీఆర్- 2పై కసరత్తు చేసి రెండు కీలక కమిటీలు ఆమోదం తెలిపాక అది పక్కన పెట్టి మళ్లీ రెండేళ్లుగా తొలిదశ నిధులంటూ ప్రహసనం సాగడం సందేహాలకు తావిస్తోంది.

Polavaram Project: జగన్​ హయాంలో "పోలవరం అట్టర్​ ఫ్లాప్"​.. ఆ మాటలే నేడు నిజమైన వైనం..!

పోలవరంలో 45.72 మీటర్ల స్థాయి వరకు పునరావాసం, భూసేకరణకు నిధులిచ్చేందుకు కేంద్రం వెనకడుగు వేస్తున్న తరుణంలో దీనిపై పోరాడకుండా....కేంద్రం చెప్పినట్లు తొలిదశ నిధుల కోసం అంచనాలు సమర్పించడం వల్ల రాబోయే రోజుల్లో ఇబ్బందులు తప్పవనే భయం సర్వత్రా వ్యక్తమవుతోంది. నిజానికి పోలవరం ప్రాజెక్టులో రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిన తర్వాత.. కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేస్తూ వస్తోంది. కానీ కేంద్రం తొలిదశ అంచనాలు కోరడం, రాష్ట్రం సమర్పించడం అనేక అనుమానాలకు తావిస్తోంది.

దిల్లీలో ఇటీవల పోలవరంపై జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో ఓ అధికారి ఈ అంశంపై ప్రశ్నించినట్లు సమాచారం. అధికారులే ప్రశ్నిస్తున్నా.. సీఎం జగన్ మాత్రం పోలవరం నిధుల విషయంలో కేంద్రంతో రాజకీయంగా గట్టిగా వ్యవహరించలేకపోతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి సమర్పించిన తొలి దశ అంచనాల్లో ప్రధాన డ్యాం, కాలువల్లో మిగిలిన పనుల కోసం 6 వేల 593 కోట్లు, ప్రధాన డ్యాంలో కోత, పాక్షిక డయాఫ్రం వాల్‌ పనుల కోసం 2వేల కోట్లు అవసరమని లెక్కగట్టారు. ఇతర పనులు, నిర్వహణ ఖర్చుల కోసం మరో 945 కోట్లు కావాలని, భూసేకరణ, పునరావాసం కోసం తొలిదశలో 7,394 కోట్లు అవసరమని అంచనా వేశారు. పోలవరం ప్రాజెక్ట్‌లో ఎంతో కీలకమైన డయాఫ్రం వాల్ నిర్మాణాన్ని గతంలో 467 కోట్లతోనే పూర్తి చేశారు.

Polavaram Project: పోలవరంలో మేఘా ఇంజినీరింగ్‌కు వరుసగా నాలుగో టెండరు

1,427 మీటర్ల పొడవున, కొన్నిచోట్ల 300 అడుగుల లోతు నుంచి ప్లాస్టిక్‌ కాంక్రీటు నిర్మించారు. వరదలకు అక్కడక్కడా దెబ్బతిన్న చోట పాక్షికంగా డయాఫ్రంవాల్ నిర్మించనున్నారు. దీనికే ఏకంగా 311 కోట్లు అవసరమని అంచనా వేశారు. ఇది మొత్తం డయాఫ్రంవాల్ నిర్మాణంలోని 70శాతం నిధులకు సమానం. ఎత్తిపోతల పథకాల్లో ఎంతో అనుభవం ఉన్న మేఘ ఇంజినీరింగ్ సంస్థ పోలవరం డ్యాం పనులు చేపట్టింది. నిజానికి పోలవరం తొలి అంచనాల్లో నీటిని ఎత్తిపోసే అవసరమం లేదు.

అలాంటిది ప్రస్తుతం ఇక్కడ వందల కోట్ల రూపాయలను వెచ్చించి నీటిని ఎత్తిపోసే పరిస్థితులు ఏర్పడటం చర్చకు దారితీసింది. ఎగువ కాఫర్‌ డ్యాం సకాలంలో పూర్తి చేయకపోవడం వలన.. అది ఒక సమస్యగా మారి పోలవరంలో పలు ఇబ్బందులు సృష్టించింది. మరోవైపు ఎగువ కాఫర్‌ డ్యాంను నిర్మించి, దిగువ కాఫర్‌ డ్యాంను సకాలంలో పూర్తి చేయకపోవడంతో మరో సమస్య వచ్చింది.

పోలవరం ప్రాజెక్టు అథారిటీ ఈ అంశాన్ని తప్పుపట్టింది. దిగువ కాఫర్‌ డ్యాంను వరద సమయానికి లోపు పూర్తి చేయకపోవడం వల్ల.. నీరు మళ్లీ వెనక నుంచి ప్రధాన డ్యాం ప్రాంతాన్ని ముంచెత్తింది. దీంతో ఇక్కడ నీటి ఎత్తిపోతకు అవసరమైన పంపులు, ఇతర పరికరాలకు 149 కోట్లు, వాటిని ఉపయోగిస్తూ నీటిని ఎత్తిపోసినందుకు మరో 127 కోట్లు ఖర్చయ్యింది.

పోలవరం అంచనాలను భారీగా పెంచిన జగన్ సర్కార్..​ వెల్లువెత్తుతున్న సందేహాలు

Polavaram Project: పోలవరం ప్రాజెక్టులో తొలిదశ అంచనాలు భారీగా పెరిగిపోయాయి. 2022 జనవరిలో 10 వేల 911 కోట్లతో రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి అంచనాలు సమర్పించినా అవి కొలిక్కి రాలేదు. మళ్లీ తాజాగా తొలిదశ అంచనాలు సమర్పించాలని కేంద్ర జల్‌శక్తి శాఖ కోరిన మేరకు మే ప్రారంభంలో కేంద్రానికి నివేదిక పంపారు. కొత్తగా పంపిన నివేదికలో అంచనాలు ఒక్కసారిగా 16వేల 952 కోట్లకు చేరిపోయాయి. ఏడాదిన్నర కాలంలో కొన్ని అదనపు పనులు, కొంత అదనపు భూసేకరణ, పునరావాసంతో ఈ అంచనాలు భారీగా పెరిగిపోయాయి.

ఒకవైపు పోలవరానికి నిధులు సాధించడంలో జగన్‌ సర్కార్‌ సాధించింది ఏమీ లేకపోగా.. మరోవైపు ఎప్పటికప్పుడు కొత్త అంచనాలు అంటూ సాగుతున్న ప్రహసనంలో అంకెలు మారిపోతూ వస్తున్నాయి. కేంద్రజల్‌ శక్తిశాఖ మంత్రి షెకావత్‌ ఆధ్వర్యంలో నేడు దిల్లీలో పోలవరం ప్రాజెక్టు పురోగతిపై సమీక్ష నిర్వహించనున్నారు. తొలిదశ అంచనాలపైనా కేంద్రమంత్రి చర్చించనున్నారని సమాచారం. పోలవరం నిధులకు సంబంధించి నాలుగు సంవత్సరాలుగా జగన్‌ ప్రభుత్వంలో సాగుతున్న ప్రహసనం కొలిక్కి వచ్చేనా? లేదంటే మళ్లీ పెండింగ్​లో పడుతుందా అనేది నేడు తెలియనుంది.

పోలవరంపై దిల్లీకి అఖిలపక్షం.. రాష్ట్రప్రభుత్వంపై వత్తిడి దిశగా రౌండ్​టేబుల్ సమావేశం

పోలవరం ప్రాజెక్టులో తొలిదశ నిధులు ఇవ్వడంపైనే పెద్దఎత్తున సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అటు పోలవరం అధికారులు, జలవనరుల శాఖ అధికారుల్లోనే ఈ తొలిదశ ప్రహసనంపై సందేహాలు ఉన్నాయి. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో పోలవరం ప్రాజెక్టుకు 2017-18 ధరలతో సుమారు 55 వేల కోట్లతో సవరించిన అంచనాలను రెండో డీపీఆర్‌గా సమర్పించారు. అప్పట్లోనే కేంద్ర ప్రభుత్వం అనేక ప్రశ్నలను లేవనెత్తితే నెలల తరబడి అధికారులు దిల్లీలో ఉండి సందేహాలను నివృత్తి చేశారు.

ఆ అంచనాల్ని పరిశీలించన కేంద్ర జల్‌ శక్తి శాఖ ఆధ్వర్యంలోని సాంకేతిక సలహా కమిటీ 2019 ఫిబ్రవరిలో.. సవరించిన అంచనాలకు ఆమోదం తెలిపింది. సాంకేతిక సలహా కమిటీ ఆమోదం పొందిందంటే డీపీఆర్-2 కొలిక్కి వచ్చినట్లుగానే భావించాలి. అలాంటిది జగన్‌ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సాంకేతిక సలహా కమిటీ ఆమోదం పొందిన అంచనాలపై రివైజ్డు కాస్ట్‌ కమిటీని ఏర్పాటు చేశారు. వారు అధ్యయనం చేసి 47వేల 725 కోట్లకు ఆమోదం తెలిపారు. ఆ ప్రతిపాదనను కేంద్రజల్‌ శక్తి శాఖ ఆమోదించి ఆర్థికశాఖకు పంపాక, కేంద్ర మంత్రిమండలి ఆమోదం పొందితే డీపీఆర్- 2 కింద నిధులు ఇచ్చే ఆస్కారం ఉంది.

అయితే సీఎం జగన్ ఆ డీపీఆర్​పై పోరాడి నిధులు సాధించుకోలేక పోయింది. వాస్తవానికి డీపీఆర్​ను ఆమోదించి తొలిదశగా కొన్ని నిధులివ్వొచ్చు. ఆ తర్వాత రెండో దశ కింద మిగిలిన నిధులిచ్చే అవకాశం ఉంది. కానీ కేంద్రం మాత్రం 41.15 మీటర్ల ఎత్తు వరకు నీటిని నిల్వచేస్తే ఎంత ఖర్చవుతుందో ఆ మొత్తం తొలిదశగా అంచనాలు తయారు చేసి పంపాలని కోరింది. జగన్‌ సర్కార్‌ సైతం ఆదే కోణంలో ముందుకు వెళ్తుండటం అనేక అనుమానాలకు తావిస్తోంది. అనేక ఏళ్ల పాటు పోలవరం డీపీఆర్- 2పై కసరత్తు చేసి రెండు కీలక కమిటీలు ఆమోదం తెలిపాక అది పక్కన పెట్టి మళ్లీ రెండేళ్లుగా తొలిదశ నిధులంటూ ప్రహసనం సాగడం సందేహాలకు తావిస్తోంది.

Polavaram Project: జగన్​ హయాంలో "పోలవరం అట్టర్​ ఫ్లాప్"​.. ఆ మాటలే నేడు నిజమైన వైనం..!

పోలవరంలో 45.72 మీటర్ల స్థాయి వరకు పునరావాసం, భూసేకరణకు నిధులిచ్చేందుకు కేంద్రం వెనకడుగు వేస్తున్న తరుణంలో దీనిపై పోరాడకుండా....కేంద్రం చెప్పినట్లు తొలిదశ నిధుల కోసం అంచనాలు సమర్పించడం వల్ల రాబోయే రోజుల్లో ఇబ్బందులు తప్పవనే భయం సర్వత్రా వ్యక్తమవుతోంది. నిజానికి పోలవరం ప్రాజెక్టులో రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిన తర్వాత.. కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేస్తూ వస్తోంది. కానీ కేంద్రం తొలిదశ అంచనాలు కోరడం, రాష్ట్రం సమర్పించడం అనేక అనుమానాలకు తావిస్తోంది.

దిల్లీలో ఇటీవల పోలవరంపై జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో ఓ అధికారి ఈ అంశంపై ప్రశ్నించినట్లు సమాచారం. అధికారులే ప్రశ్నిస్తున్నా.. సీఎం జగన్ మాత్రం పోలవరం నిధుల విషయంలో కేంద్రంతో రాజకీయంగా గట్టిగా వ్యవహరించలేకపోతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి సమర్పించిన తొలి దశ అంచనాల్లో ప్రధాన డ్యాం, కాలువల్లో మిగిలిన పనుల కోసం 6 వేల 593 కోట్లు, ప్రధాన డ్యాంలో కోత, పాక్షిక డయాఫ్రం వాల్‌ పనుల కోసం 2వేల కోట్లు అవసరమని లెక్కగట్టారు. ఇతర పనులు, నిర్వహణ ఖర్చుల కోసం మరో 945 కోట్లు కావాలని, భూసేకరణ, పునరావాసం కోసం తొలిదశలో 7,394 కోట్లు అవసరమని అంచనా వేశారు. పోలవరం ప్రాజెక్ట్‌లో ఎంతో కీలకమైన డయాఫ్రం వాల్ నిర్మాణాన్ని గతంలో 467 కోట్లతోనే పూర్తి చేశారు.

Polavaram Project: పోలవరంలో మేఘా ఇంజినీరింగ్‌కు వరుసగా నాలుగో టెండరు

1,427 మీటర్ల పొడవున, కొన్నిచోట్ల 300 అడుగుల లోతు నుంచి ప్లాస్టిక్‌ కాంక్రీటు నిర్మించారు. వరదలకు అక్కడక్కడా దెబ్బతిన్న చోట పాక్షికంగా డయాఫ్రంవాల్ నిర్మించనున్నారు. దీనికే ఏకంగా 311 కోట్లు అవసరమని అంచనా వేశారు. ఇది మొత్తం డయాఫ్రంవాల్ నిర్మాణంలోని 70శాతం నిధులకు సమానం. ఎత్తిపోతల పథకాల్లో ఎంతో అనుభవం ఉన్న మేఘ ఇంజినీరింగ్ సంస్థ పోలవరం డ్యాం పనులు చేపట్టింది. నిజానికి పోలవరం తొలి అంచనాల్లో నీటిని ఎత్తిపోసే అవసరమం లేదు.

అలాంటిది ప్రస్తుతం ఇక్కడ వందల కోట్ల రూపాయలను వెచ్చించి నీటిని ఎత్తిపోసే పరిస్థితులు ఏర్పడటం చర్చకు దారితీసింది. ఎగువ కాఫర్‌ డ్యాం సకాలంలో పూర్తి చేయకపోవడం వలన.. అది ఒక సమస్యగా మారి పోలవరంలో పలు ఇబ్బందులు సృష్టించింది. మరోవైపు ఎగువ కాఫర్‌ డ్యాంను నిర్మించి, దిగువ కాఫర్‌ డ్యాంను సకాలంలో పూర్తి చేయకపోవడంతో మరో సమస్య వచ్చింది.

పోలవరం ప్రాజెక్టు అథారిటీ ఈ అంశాన్ని తప్పుపట్టింది. దిగువ కాఫర్‌ డ్యాంను వరద సమయానికి లోపు పూర్తి చేయకపోవడం వల్ల.. నీరు మళ్లీ వెనక నుంచి ప్రధాన డ్యాం ప్రాంతాన్ని ముంచెత్తింది. దీంతో ఇక్కడ నీటి ఎత్తిపోతకు అవసరమైన పంపులు, ఇతర పరికరాలకు 149 కోట్లు, వాటిని ఉపయోగిస్తూ నీటిని ఎత్తిపోసినందుకు మరో 127 కోట్లు ఖర్చయ్యింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.