కరోనా చికిత్స కోసం మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే భార్య రష్మీ ఠాక్రే.. ఆసుపత్రిలో చేరారు. మార్చి 22న ఆమెకు కరోనా సోకినట్లు తేలగా.. అప్పటినుంచి ఇంటికే పరిమితమయ్యారని ఓ అధికారి వెల్లడించారు.
ఉద్ధవ్ ఠాక్రే, రష్మీ ఠాక్రే.. మార్చి 11న కరోనా టీకా మొదటి డోసును జేజే ఆసుపత్రిలో తీసుకున్నారు. ఉద్ధవ్ ఠాక్రే కుమారుడు మంత్రి ఆదిత్యా ఠాక్రే కూడా ఇప్పటికే కరోనా బారిన పడ్డారు. సామ్నా పత్రిక ఎడిటర్గా రష్మీ ఠాక్రే వ్యవహరిస్తున్నారు.
ఇదీ చదవండి: దిల్లీ ఆస్పత్రులలో కరోనా రోగులకు పడకలు రిజర్వ్