ETV Bharat / bharat

ధరల మంటపై భగ్గుమన్న కాంగ్రెస్​.. పార్లమెంట్​ ఉభయ సభలు వాయిదా

Parliament monsoon session 2022: పార్లమెంట్​ వర్షాకాల సమావేశాల తొలిరోజే ఎగువసభ కార్యకలాపాలకు అంతరాయం కలిగింది. ధరల పెరుగుదలపై కాంగ్రెస్​ ఎంపీల ఆందోళనల నడుమ రాజ్యసభ రేపటికి వాయిదా పడింది.

author img

By

Published : Jul 18, 2022, 12:36 PM IST

Updated : Jul 18, 2022, 12:43 PM IST

rajya sabha news
rajya sabha news

Parliament monsoon session 2022: ధరల పెరుగుదల, జీఎస్​టీ రేట్ల పెంపుపై కాంగ్రెస్​ ఎంపీల ఆందోళనల నడుమ.. రాజ్యసభ రేపటికి వాయిదా పడింది. దీంతో.. పార్లమెంటు వర్షాకాల సమావేశాల తొలిరోజే సభా కార్యకలాపాలకు అంతరాయం కలిగింది.

అంతకుముందు.. కొత్తగా రాజ్యసభకు ఎన్నికైన విజయసాయిరెడ్డి, బీద మస్తాన్‌రావు, రాజీవ్ శుక్లా, మీసా భారతి, ప్రఫుల్ పటేల్‌, హర్భజన్‌సింగ్‌, విజయేంద్రప్రసాద్‌ ప్రమాణస్వీకారం చేశారు. తర్వాత.. ఎగువసభ ఛైర్మన్​ ఎం. వెంకయ్య నాయుడు మాట్లాడుతుండగా.. కాంగ్రెస్​ సభ్యులు వెల్​లోకి దూసుకెళ్లారు. దీంతో.. కొందరు కార్యకలాపాలకు అంతరాయం కలిగిస్తున్నారని, అలాగే రాష్ట్రపతి ఎన్నికలోనూ ఓటేసేందుకు వీలుగా సభను రేపటికి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు వెంకయ్య. సోమవారం సభ ప్రారంభమైన తర్వాత.. జపాన్​ మాజీ ప్రధాని షింజో అబే, యూఏఈ మాజీ అధ్యక్షుడు షేక్​ ఖలీఫాకు నివాళి అర్పించారు ఎంపీలు.

లోక్​సభ కూడా ప్రారంభమైన కాసేపటికే వాయిదా పడింది. ఎంపీలు రాష్ట్రపతి ఎన్నికల్లో భాగస్వామ్యం అయ్యేలా మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేశారు స్పీకర్​ ఓం బిర్లా.

Parliament monsoon session 2022: ధరల పెరుగుదల, జీఎస్​టీ రేట్ల పెంపుపై కాంగ్రెస్​ ఎంపీల ఆందోళనల నడుమ.. రాజ్యసభ రేపటికి వాయిదా పడింది. దీంతో.. పార్లమెంటు వర్షాకాల సమావేశాల తొలిరోజే సభా కార్యకలాపాలకు అంతరాయం కలిగింది.

అంతకుముందు.. కొత్తగా రాజ్యసభకు ఎన్నికైన విజయసాయిరెడ్డి, బీద మస్తాన్‌రావు, రాజీవ్ శుక్లా, మీసా భారతి, ప్రఫుల్ పటేల్‌, హర్భజన్‌సింగ్‌, విజయేంద్రప్రసాద్‌ ప్రమాణస్వీకారం చేశారు. తర్వాత.. ఎగువసభ ఛైర్మన్​ ఎం. వెంకయ్య నాయుడు మాట్లాడుతుండగా.. కాంగ్రెస్​ సభ్యులు వెల్​లోకి దూసుకెళ్లారు. దీంతో.. కొందరు కార్యకలాపాలకు అంతరాయం కలిగిస్తున్నారని, అలాగే రాష్ట్రపతి ఎన్నికలోనూ ఓటేసేందుకు వీలుగా సభను రేపటికి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు వెంకయ్య. సోమవారం సభ ప్రారంభమైన తర్వాత.. జపాన్​ మాజీ ప్రధాని షింజో అబే, యూఏఈ మాజీ అధ్యక్షుడు షేక్​ ఖలీఫాకు నివాళి అర్పించారు ఎంపీలు.

లోక్​సభ కూడా ప్రారంభమైన కాసేపటికే వాయిదా పడింది. ఎంపీలు రాష్ట్రపతి ఎన్నికల్లో భాగస్వామ్యం అయ్యేలా మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేశారు స్పీకర్​ ఓం బిర్లా.

ఇవీ చదవండి: 'వచ్చే 25 ఏళ్ల భవిష్యత్​ను నిర్మించుకోవాల్సిన సమయమిది'

'రాష్ట్రపతి ఎన్నిక' పోలింగ్​ షురూ.. వీల్​ఛైర్​లో వచ్చి ఓటేసిన మన్మోహన్​ సింగ్​

Last Updated : Jul 18, 2022, 12:43 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.