ETV Bharat / bharat

'క్యాచ్​ ద రైన్'తో కేంద్రం జలసంరక్షణా యజ్ఞం

'వర్షపు నీటిని ఒడిసిపట్టు'(క్యాచ్​ ద రైన్​) ప్రచార కార్యక్రమాన్ని ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం ప్రారంభించనున్నారు. ఇందులో భాగంగా మార్చి 22 నుంచి నవంబర్​ 30 వరకు ప్రజలందరికీ నీటి సంరక్షణపై అవగాహన కల్పించనున్నారు. మరోవైపు.. కేన్​, బేట్వా నదుల అనుసంధానానికి ఎంఓయూపై ఉత్తరప్రదేశ్​, మధ్యప్రదేశ్​ ముఖ్యమంత్రులు సోమవారం సంతకాలు చేయనున్నారు.

author img

By

Published : Mar 21, 2021, 3:57 PM IST

PM to launch 'Catch the Rain' campaign on Monday
'వర్షపు నీటిని ఒడిసిపట్టు' కార్యక్రమాన్ని ప్రారంభించనున్న ప్రధాని

'జల్​ శక్తి అభియాన్​: వర్షపు నీటిని ఒడిసిపట్టు' ప్రచార కార్యక్రమాన్ని ప్రపంచ జల దినం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం ప్రారంభించనున్నారు. ఇదే రోజున దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న అంతరాష్ట్ర నదీ జలాల అనుసంధానం ప్రణాళికకు అడుగులు పడనున్నాయి. కేన్​, బేట్వా నదుల అనుసంధానానికి సంబంధించిన అవగాహనా ఒప్పందంపై ఉత్తరప్రదేశ్​, మధ్యప్రదేశ్​ ముఖ్యమంత్రులు సంతకాలు చేయనున్నారు.

పడ్డచోటే ఒడిసిపట్టు..

'వర్షపు నీటిని ఒడిసిపట్టు' కార్యక్రమాన్ని దేశమంతటా నిర్వహించనున్నట్లు ప్రధానమంత్రి కార్యాలయం తెలిపింది. 'ఎప్పుడు పడ్డా.. పడ్డచోటే వర్షపు నీటిని ఒడిసిపట్టు' అనే నినాదంతో ప్రచారాన్ని సాగించనున్నట్లు పేర్కొంది. మార్చి 22 నుంచి నవంబర్​ 30 మధ్య ఈ కార్యక్రమాన్ని జరపనున్నట్లు స్పష్టం చేసింది. ప్రజలందరూ పాలుపంచుకునేలా ప్రోత్సహించనున్నట్లు తెలిపింది. దేశమంతటా గ్రామసభలలో నీటి పరిరక్షణ అవగాహన సమావేశాలు జరపనున్నట్లు వెల్లడించింది.

వాజ్​పేయీ సంకల్పానికి ఆరంభం..

దౌదన్​ ప్రాజెక్టు నిర్మించి కేన్​, బేట్వా నదులను అనుసంధానించనున్నారు. 10.62 లక్షల హెక్టార్ల భూమి దీనివల్ల సాగులోకి రానుంది. 62 లక్షల మందికి తాగు నీరు అందనుంది. 103 మెగావాట్ల విద్యుదుత్పత్తి జరగనుంది. మధ్యప్రదేశ్​, ఉత్తరప్రదేశ్​లో నీటి ఎద్దడి ఎదుర్కొనే జిల్లాలకు నీరు అందనుంది.

కేన్​, బేట్వా నదుల అనుసంధానం దేశంలో నదుల అనుసంధానానికి తొలిమెట్టుగా ప్రధాని కార్యాలఁ అభివర్ణించింది. జల వనరులు సమృద్ధిగా ఉన్న ప్రాంతాల నుంచి కరవు ఎదుర్కొనే ప్రాంతాలకు నీరందించాలనే మాజీ ప్రధాని అటల్​ బిహారి వాజ్​పేయీ సంకల్పాన్ని నెరవేర్చేందుకు ఇది ఆరంభం అని పేర్కొంది.

ఇదీ చదవండి: 'కాంగ్రెస్​ అంటేనే అబద్ధాలు, అస్థిరత, అవినీతి'

'జల్​ శక్తి అభియాన్​: వర్షపు నీటిని ఒడిసిపట్టు' ప్రచార కార్యక్రమాన్ని ప్రపంచ జల దినం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం ప్రారంభించనున్నారు. ఇదే రోజున దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న అంతరాష్ట్ర నదీ జలాల అనుసంధానం ప్రణాళికకు అడుగులు పడనున్నాయి. కేన్​, బేట్వా నదుల అనుసంధానానికి సంబంధించిన అవగాహనా ఒప్పందంపై ఉత్తరప్రదేశ్​, మధ్యప్రదేశ్​ ముఖ్యమంత్రులు సంతకాలు చేయనున్నారు.

పడ్డచోటే ఒడిసిపట్టు..

'వర్షపు నీటిని ఒడిసిపట్టు' కార్యక్రమాన్ని దేశమంతటా నిర్వహించనున్నట్లు ప్రధానమంత్రి కార్యాలయం తెలిపింది. 'ఎప్పుడు పడ్డా.. పడ్డచోటే వర్షపు నీటిని ఒడిసిపట్టు' అనే నినాదంతో ప్రచారాన్ని సాగించనున్నట్లు పేర్కొంది. మార్చి 22 నుంచి నవంబర్​ 30 మధ్య ఈ కార్యక్రమాన్ని జరపనున్నట్లు స్పష్టం చేసింది. ప్రజలందరూ పాలుపంచుకునేలా ప్రోత్సహించనున్నట్లు తెలిపింది. దేశమంతటా గ్రామసభలలో నీటి పరిరక్షణ అవగాహన సమావేశాలు జరపనున్నట్లు వెల్లడించింది.

వాజ్​పేయీ సంకల్పానికి ఆరంభం..

దౌదన్​ ప్రాజెక్టు నిర్మించి కేన్​, బేట్వా నదులను అనుసంధానించనున్నారు. 10.62 లక్షల హెక్టార్ల భూమి దీనివల్ల సాగులోకి రానుంది. 62 లక్షల మందికి తాగు నీరు అందనుంది. 103 మెగావాట్ల విద్యుదుత్పత్తి జరగనుంది. మధ్యప్రదేశ్​, ఉత్తరప్రదేశ్​లో నీటి ఎద్దడి ఎదుర్కొనే జిల్లాలకు నీరు అందనుంది.

కేన్​, బేట్వా నదుల అనుసంధానం దేశంలో నదుల అనుసంధానానికి తొలిమెట్టుగా ప్రధాని కార్యాలఁ అభివర్ణించింది. జల వనరులు సమృద్ధిగా ఉన్న ప్రాంతాల నుంచి కరవు ఎదుర్కొనే ప్రాంతాలకు నీరందించాలనే మాజీ ప్రధాని అటల్​ బిహారి వాజ్​పేయీ సంకల్పాన్ని నెరవేర్చేందుకు ఇది ఆరంభం అని పేర్కొంది.

ఇదీ చదవండి: 'కాంగ్రెస్​ అంటేనే అబద్ధాలు, అస్థిరత, అవినీతి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.