ETV Bharat / bharat

'నైపుణ్యం ఉంటే అవకాశాల తలుపులు తెరిచే ఉంటాయి'

author img

By

Published : Mar 3, 2021, 11:35 AM IST

Updated : Mar 3, 2021, 12:32 PM IST

నైపుణ్యాలు ఉన్న యువతకు అంతరిక్షం, అణుశక్తి, వ్యవసాయం.. రంగాల్లో తలుపులు తెరిచే ఉంటాయని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. 2021-22 కేంద్ర బడ్జెట్​లో విద్యారంగంలో కేటాయింపులపై నిర్వహించిన వెబినార్​లో ఆయన ప్రసంగించారు. యువత జ్ఞానాన్ని, పరిశోధనను పరిమితం చేస్తే దేశ సామర్థ్యానికి అన్యాయం చేసినట్లు అవుతుందన్నారు.

PM Modi to address session on education, skill development for 'Atmanirbhar Bharat' today
'యువతకు విద్య, ఉపాధి అనుసంధామే లక్ష్యంగా బడ్జెట్'

నైపుణ్యాలు కలిగిన యువతకు అంతరిక్షం, అణుశక్తి, వ్యవసాయం.. తదితర రంగాల్లో అవకాశాలు ఎప్పుడూ ఉంటాయని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. కేంద్ర బడ్జెట్​లో విద్యారంగం కేటాయింపులపై నిర్వహించిన వెబినార్​లో ఆయన ప్రసంగించారు. యువత జ్ఞానాన్ని, పరిశోధనను పరిమితం చేస్తే దేశ సామర్థ్యానికి అన్యాయం చేసినట్లు అవుతుందన్నారు.

" భారతీయ భాషలను ప్రోత్సహించేందుకే నూతన విద్యావిధానం. ప్రపంచంలోని ప్రతి విషయాన్ని భారతీయ భాషల్లోకి అనువదించేలా దేశంలోని భాషా నిపుణులు కృషి చేయాలి. ఈ సాంకేతిక యుగంలో ఇది సాధ్యమే. 'ఆత్మనిర్భర్​ భారత్​'ను నిర్మించాలంటే యువతలో ఆత్మవిశ్వాసం ముఖ్యం. యువత.. తమ విద్య, నైపుణ్యాలు, జ్ఞానాన్ని మెరుగుపరుచుకుంటే ఆత్మవిశ్వాసం వస్తుంది."

-- ప్రధాని నరేంద్ర మోదీ

2021-22 బడ్జెట్​లో వైద్య రంగం తర్వాత అత్యధికంగా విద్యారంగంపైనే దృష్టి సారించామని ప్రధాని తెలిపారు. విద్య, ఉపాధి అనుసంధానమే లక్ష్యంగా బడ్జెట్​ను రూపొందించామన్నారు. దాని ఫలితమే సాంకేతిక పరిశోధనల పబ్లికేషన్​లో ప్రపంచంలోనే భారత్​ మూడో స్థానంలో ఉందన్నారు.

ఇదీ చదవండి : బంగాల్​ దంగల్​: భాజపాలో గంగూలీ చేరిక ఖాయమా?

నైపుణ్యాలు కలిగిన యువతకు అంతరిక్షం, అణుశక్తి, వ్యవసాయం.. తదితర రంగాల్లో అవకాశాలు ఎప్పుడూ ఉంటాయని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. కేంద్ర బడ్జెట్​లో విద్యారంగం కేటాయింపులపై నిర్వహించిన వెబినార్​లో ఆయన ప్రసంగించారు. యువత జ్ఞానాన్ని, పరిశోధనను పరిమితం చేస్తే దేశ సామర్థ్యానికి అన్యాయం చేసినట్లు అవుతుందన్నారు.

" భారతీయ భాషలను ప్రోత్సహించేందుకే నూతన విద్యావిధానం. ప్రపంచంలోని ప్రతి విషయాన్ని భారతీయ భాషల్లోకి అనువదించేలా దేశంలోని భాషా నిపుణులు కృషి చేయాలి. ఈ సాంకేతిక యుగంలో ఇది సాధ్యమే. 'ఆత్మనిర్భర్​ భారత్​'ను నిర్మించాలంటే యువతలో ఆత్మవిశ్వాసం ముఖ్యం. యువత.. తమ విద్య, నైపుణ్యాలు, జ్ఞానాన్ని మెరుగుపరుచుకుంటే ఆత్మవిశ్వాసం వస్తుంది."

-- ప్రధాని నరేంద్ర మోదీ

2021-22 బడ్జెట్​లో వైద్య రంగం తర్వాత అత్యధికంగా విద్యారంగంపైనే దృష్టి సారించామని ప్రధాని తెలిపారు. విద్య, ఉపాధి అనుసంధానమే లక్ష్యంగా బడ్జెట్​ను రూపొందించామన్నారు. దాని ఫలితమే సాంకేతిక పరిశోధనల పబ్లికేషన్​లో ప్రపంచంలోనే భారత్​ మూడో స్థానంలో ఉందన్నారు.

ఇదీ చదవండి : బంగాల్​ దంగల్​: భాజపాలో గంగూలీ చేరిక ఖాయమా?

Last Updated : Mar 3, 2021, 12:32 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.