ETV Bharat / bharat

ప్రభుత్వ ఆఫీసులో సామానంతా అమ్మేసిన ప్యూన్.. తలుపులు, కిటికీలు కూడా.. మందు కోసమే!

డీఈఓ ఆఫీస్​కు పాత ఫైల్స్ ​కోసం వచ్చారో అధికారి. తీరా చూస్తే ఆయనకు ఖాళీ గది తప్ప ఏమీ కనపడలేదు. షాక్​కు గురైన ఆ అధికారి పోలీసులకు తమ ఆఫీస్​లో దొంగతనం జరిగిందని ఫిర్యాదు చేశారు. వారు పెద్దగా కష్టపడకుండానే.. దొంగ ఇట్టే దొరికిపోయాడు.

author img

By

Published : Sep 27, 2022, 9:23 AM IST

Peon appointed in DEO office sold off all properties
Peon appointed in DEO office sold off all properties

Peon Sold office property : మద్యానికి బానిసైన ఓ వ్యక్తి మందు కోసం తాను పని చేసే ఆఫీస్​లోని వస్తువులనే అమ్మేశాడు. ఈ ఘటన ఒడిశాలోని గంజామ్​ జిల్లా విద్యా శాఖ అధికారి-డీఈఓ కార్యాలయంలో జరిగింది. నిఘా ఉంచమని బాధ్యత అప్పచెబితే అతడు తన చేతివాటాన్ని చూపించాడు. దాదాపు రెండేళ్లలో తలుపులతో సహా మొత్తం ఆఫీస్​నే ఖాళీ చేశాడు.

పోలీసుల కథనం ప్రకారం.. ఒడిశాలోని గంజామ్​ జిల్లాలో రెండేళ్ల క్రితం డీఈఓ కార్యాలయాన్ని అధికారులు కొత్త భవనానికి మార్చారు. అవసరమైన సామగ్రిని కొత్త ఆఫీస్​కు మార్చారు. కొన్ని ఫైల్స్​తో పాటు ఫర్నీచర్​ను పాత ఆఫీస్​లోనే ఉంచారు. ఆఫీస్​కు కాపలాగా ఉండమని ప్యూన్​ పీతాంబర్​కు బాధ్యతలు అప్పజెప్పారు. ఆ తర్వాత దాదాపు రెండేళ్లు ఆ బిల్డింగ్​ వైపు చూడలేదు విద్యా శాఖ అధికారులు.

ఇదే అదునుగా చేసుకుని పీతాంబర్ ఆఫీస్​లో ఉన్న వస్తువులన్నింటినీ ఒక్కొక్కటిగా మాయం చేసుకుంటూ వచ్చాడు. అలా 20కి పైగా అల్మరాలు, 10 సెట్ల కుర్చీలు, బల్లలు, పాత ఫైల్స్​ను అమ్మేశాడు. కొన్ని కిటికీలను సైతం మాయం చేశాడు. పోలీస్​ స్టేషన్​కు సమీపంలోనే ఆ బిల్డింగ్​ ఉన్నప్పటికీ ఇవన్నీ చోరీకి గురవడం విశేషం. ఇంత జరుగుతున్నా.. జిల్లా విద్యాశాఖ అధికారులు ఎవరూ అటువైపు రాకపోవడం వల్ల పీతాంబర్​కు మరింత ధైర్యం పెరిగింది. ఇదే సరైన సమయంగా భావించి తలుపులతో సహా అన్నింటినీ సర్దేశాడు ఆ ప్యూన్.

Peon appointed in DEO office sold off all properties
పట్టుబడ్డ ప్యూన్​ పీతాంబర్​

ఓ రోజు సెక్షన్​ ఆఫీసర్​ జయంత్​ కుమార్​ సాహూ కొన్ని ఫైల్స్​ కోసం పాత ఆఫీస్​కు వచ్చారు. తీరా అక్కడ చూస్తే రూం మొత్తం ఖాళీగా దర్శనమిచ్చింది. ఆశ్చర్యపోయిన ఆఫీసర్ కార్యాలయంలో దొంగతనం జరిగిందని​ పోలీస్​ స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. ఆ బిల్డింగ్​కు కాపాలాగా ఉన్న ప్యూన్​ పీతాంబరాన్ని అనుమానితుడిగా భావించి, పోలీసులు అతడ్ని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో తానే ఈ దొంగతనం చేసినట్లు ఒప్పుకున్నాడు. మద్యం తాగేందుకు డబ్బుల కోసమే ఇదంతా చేసినట్లు చెప్పాడు. పోలీసులు పీతాంబర్​ను, అతడి వద్ద సామగ్రి కొన్న వ్యక్తిని అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచారు. ప్యూన్​ను విధుల్లో నుంచి తొలగించామని, తదుపరి విచారణని చేపడుతామని డీఈఓ తెలిపారు.

Peon appointed in DEO office sold off all properties
పట్టుబడ్డ ప్యూన్​ పీతాంబర్​

ఇదీ చదవండి: 'ఆపరేషన్​ PFI' ముమ్మరం.. 8 రాష్ట్రాల్లో ఎన్​ఐఏ, ఈడీ దాడులు

విదేశాలకు వెళ్లేవారికి గుడ్​న్యూస్​.. ఇక ఆ సర్టిఫికెట్‌ అప్లై ఆన్‌లైన్‌లోనే!

Peon Sold office property : మద్యానికి బానిసైన ఓ వ్యక్తి మందు కోసం తాను పని చేసే ఆఫీస్​లోని వస్తువులనే అమ్మేశాడు. ఈ ఘటన ఒడిశాలోని గంజామ్​ జిల్లా విద్యా శాఖ అధికారి-డీఈఓ కార్యాలయంలో జరిగింది. నిఘా ఉంచమని బాధ్యత అప్పచెబితే అతడు తన చేతివాటాన్ని చూపించాడు. దాదాపు రెండేళ్లలో తలుపులతో సహా మొత్తం ఆఫీస్​నే ఖాళీ చేశాడు.

పోలీసుల కథనం ప్రకారం.. ఒడిశాలోని గంజామ్​ జిల్లాలో రెండేళ్ల క్రితం డీఈఓ కార్యాలయాన్ని అధికారులు కొత్త భవనానికి మార్చారు. అవసరమైన సామగ్రిని కొత్త ఆఫీస్​కు మార్చారు. కొన్ని ఫైల్స్​తో పాటు ఫర్నీచర్​ను పాత ఆఫీస్​లోనే ఉంచారు. ఆఫీస్​కు కాపలాగా ఉండమని ప్యూన్​ పీతాంబర్​కు బాధ్యతలు అప్పజెప్పారు. ఆ తర్వాత దాదాపు రెండేళ్లు ఆ బిల్డింగ్​ వైపు చూడలేదు విద్యా శాఖ అధికారులు.

ఇదే అదునుగా చేసుకుని పీతాంబర్ ఆఫీస్​లో ఉన్న వస్తువులన్నింటినీ ఒక్కొక్కటిగా మాయం చేసుకుంటూ వచ్చాడు. అలా 20కి పైగా అల్మరాలు, 10 సెట్ల కుర్చీలు, బల్లలు, పాత ఫైల్స్​ను అమ్మేశాడు. కొన్ని కిటికీలను సైతం మాయం చేశాడు. పోలీస్​ స్టేషన్​కు సమీపంలోనే ఆ బిల్డింగ్​ ఉన్నప్పటికీ ఇవన్నీ చోరీకి గురవడం విశేషం. ఇంత జరుగుతున్నా.. జిల్లా విద్యాశాఖ అధికారులు ఎవరూ అటువైపు రాకపోవడం వల్ల పీతాంబర్​కు మరింత ధైర్యం పెరిగింది. ఇదే సరైన సమయంగా భావించి తలుపులతో సహా అన్నింటినీ సర్దేశాడు ఆ ప్యూన్.

Peon appointed in DEO office sold off all properties
పట్టుబడ్డ ప్యూన్​ పీతాంబర్​

ఓ రోజు సెక్షన్​ ఆఫీసర్​ జయంత్​ కుమార్​ సాహూ కొన్ని ఫైల్స్​ కోసం పాత ఆఫీస్​కు వచ్చారు. తీరా అక్కడ చూస్తే రూం మొత్తం ఖాళీగా దర్శనమిచ్చింది. ఆశ్చర్యపోయిన ఆఫీసర్ కార్యాలయంలో దొంగతనం జరిగిందని​ పోలీస్​ స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. ఆ బిల్డింగ్​కు కాపాలాగా ఉన్న ప్యూన్​ పీతాంబరాన్ని అనుమానితుడిగా భావించి, పోలీసులు అతడ్ని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో తానే ఈ దొంగతనం చేసినట్లు ఒప్పుకున్నాడు. మద్యం తాగేందుకు డబ్బుల కోసమే ఇదంతా చేసినట్లు చెప్పాడు. పోలీసులు పీతాంబర్​ను, అతడి వద్ద సామగ్రి కొన్న వ్యక్తిని అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచారు. ప్యూన్​ను విధుల్లో నుంచి తొలగించామని, తదుపరి విచారణని చేపడుతామని డీఈఓ తెలిపారు.

Peon appointed in DEO office sold off all properties
పట్టుబడ్డ ప్యూన్​ పీతాంబర్​

ఇదీ చదవండి: 'ఆపరేషన్​ PFI' ముమ్మరం.. 8 రాష్ట్రాల్లో ఎన్​ఐఏ, ఈడీ దాడులు

విదేశాలకు వెళ్లేవారికి గుడ్​న్యూస్​.. ఇక ఆ సర్టిఫికెట్‌ అప్లై ఆన్‌లైన్‌లోనే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.