ETV Bharat / bharat

Pakistani Arrested in Hyderabad : షార్జాలో పెళ్లి.. హైదరాబాద్​లో కాపురం.. భార్య కోసం సరిహద్దులు దాటిన పాకిస్థానీ అరెస్ట్

Pakistani Arrested in Hyderabad: ప్రేమకు కులం, మతం, ప్రాంతాలతో సంబంధం లేదు. అడ్డుగోడలు అసలే లేవు. మనుషుల మధ్య ఉన్న సరిహద్దులు.. మనసుల మధ్య అసలు ఉండదు. ఈ మధ్య తెగ వైరల్​గా మారిన పాకిస్థాన్​ నుంచి వచ్చిన సీమా హైదర్​ కథ.. అలాగే భారత్​ నుంచి పాకిస్థాన్​ వెళ్లిన అంజు ప్రేమగాథ.. పోలండ్​ నుంచి భారత్​కు వచ్చిన బార్బరా పోలాక్​ స్టోరీ. ఈ ముగ్గురు మహిళలు ఏకంగా ప్రేమ కోసం దేశ సరిహద్దులనే దాటారు. వీరి ప్రేమ కథలు అన్నీ సోషల్​ మీడియా వేదికగా జరిగితే.. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న లవ్ స్టోరీ మాత్రం దుబాయ్​లో పురుడు పోసుకుని.. పెళ్లి చేసుకుని.. ఓ పిల్లాడిని కనే వరకూ వచ్చింది. ఇక్కడ ట్విస్ట్​ ఏంటంటే పాకిస్థాన్​ అబ్బాయి.. అందరి కళ్లు కప్పి దేశ సరిహద్దులనే దాటి హైదరాబాద్​లో కాపురం పెట్టేశాడు. కానీ చివరకు పట్టుబడ్డాడు. మరి అదెలాగో ఓసారి తెలుసుకుందామా..?

author img

By ETV Bharat Telugu Team

Published : Sep 1, 2023, 9:33 AM IST

Updated : Sep 1, 2023, 5:36 PM IST

Pakistani National Arrested in Hyderabad
Pakistani National Arrested at Kishanbagh

Pakistani Arrested in Hyderabad : ప్రేమించి పెళ్లి చేసుకున్న యువతి కోసం ఓ పాకిస్థాన్ దేశస్తుడు(Pakistani National in Hyderabad) సరిహద్దులను దాటొచ్చాడు. పాకిస్థాన్ నుంచి నేపాల్ మీదుగా భారత్‌లోకి అక్రమంగా ప్రవేశించి హైదరాబాద్‌ చేరాడు. గుట్టుచప్పుడు కాకుండా భార్యతో కలిసి నివసిస్తున్న అతని వ్యవహారం దాదాపు 9 నెలల తర్వాత బట్టబయలైంది. మరో వ్యక్తి పేరిట ఆధార్‌ కార్డు సంపాదించే క్రమంలో పోలీసులకు చిక్కాడు. అతనికి సహకరించిన యువతి తల్లిదండ్రులపైనా బహదూర్‌పుర పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Pakistan Man Arrested in Hyderabad : పాకిస్థాన్‌లోని ఖైబర్‌ పంక్తుఖ్వాకు చెందిన 24 ఏళ్ల ఫయాజ్ అహ్మద్‌.. 2018 డిసెంబరులో ఉపాధి కోసం షార్జాకు వెళ్లాడు. స్థానికంగా సైఫ్‌జోన్‌లోని వస్త్ర పరిశ్రమలో పనిలో చేరాడు. హైదరాబాద్‌లోని బహదూర్‌పుర పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని కిషన్‌బాగ్‌కు చెందిన 29 ఏళ్ల నేహ ఫాతిమా ఉపాధి కోసం 2019లో షార్జా వెళ్లింది. అక్కడి మిలీనియం ఫ్యాషన్‌ పరిశ్రమలో ఫాతిమా ఉద్యోగం పొందేందుకు ఫయాజ్‌ సహకరించాడు. ఇద్దరి మధ్య పరిచయం ప్రేమగా మారి షార్జాలోనే 2019లో వివాహం చేసుకున్నారు. వారికి ప్రస్తుతం మూడేళ్ల మగబిడ్డ కూడా ఉన్నాడు.

తల్లిదండ్రులను ఎదిరించి హైకోర్టులో పోరాడి మరీ ఒక్కటైన అమ్మాయిలు

Pakistani National Arrested in Hyderabad : ఫాతిమా ఒక్కతే గతేడాది హైదరాబాద్‌ తిరిగివచ్చి కిషన్‌బాగ్‌లోని అసఫ్‌ బాబానగర్‌లో ఉంటోంది. ఫయాజ్‌ పాకిస్థాన్‌ వెళ్లిపోయాడు. ఈ క్రమంలోనే ఫాతిమా తల్లిదండ్రులు జుబేర్‌ షేక్, అఫ్జల్‌ బేగం.. ఫయాజ్‌ను సంప్రదించారు. పాకిస్థాన్‌ నుంచి హైదరాబాద్‌కు రావాలని స్థానికుడి గుర్తింపు పత్రాలు వచ్చేలా చూసుకుంటామని చెప్పారు. వీసా, ఇతరత్రా ఎలాంటి గుర్తింపు లేకున్నా ఫయాజ్‌ గతేడాది నవంబరులో పాకిస్థాన్‌ నుంచి నేపాల్‌ వెళ్లాడు. జుబేర్‌ షేక్, అఫ్జల్‌ బేగం ఇద్దరూ నేపాల్‌లోని ఖాట్మండుకు వెళ్లి ఫయాజ్‌ను కలిసి సరిహద్దుల్లో కొందరి సాయంతో సరిహద్దులు దాటించి భారత్‌కు తీసుకొచ్చారు. అనంతరం హైదరాబాద్‌లోని కిషన్‌బాగ్‌లో అక్రమంగా ఉండేందుకు ఆవాసం కల్పించారు.

Pakistani Man Illegally Entered India For His Wife : అతనికి ఆధార్‌ కార్డు ఇప్పించి స్థానికుడిలా నమ్మించేందుకు పథకం వేశారు. మాదాపూర్‌లో ఒక ఆధార్‌ నమోదు కేంద్రానికి తీసుకెళ్లి తమ కుమారుడు మహ్మద్‌ గౌస్‌ పేరిట రిజిస్టర్‌ చేసేందుకు ప్రయత్నించారు. ఈ మేరకు నకిలీ జనన ధ్రువీకరణ పత్రం సమర్పించారు. ఈ సమాచారం స్థానికుల ద్వారా పోలీసులకు చేరింది. అప్రమత్తమైన పోలీసులు ఫయాజ్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా పాకిస్థానీగా తేలింది. అతని దగ్గరున్న పాకిస్థాన్‌ పాస్‌పోర్టు గడువు కూడా ముగిసినట్లు తేలింది.

జుబేర్‌ ఖాన్, అఫ్జల్‌ బేగం ఇద్దరూ పరారీలో ఉన్నారు. నిందితుణిని అదుపులోకి తీసుకున్న అనంతరం కౌంటర్‌ ఇంటలిజెన్స్, కేంద్ర నిఘావర్గాలు అతణిని విచారించాయి. ఉద్దేశపూర్వకంగా సరిహద్దులు దాటాడా.. కుట్ర కోణం ఏమైనా ఉందా అని లోతుగా విచారిస్తున్నారు. అతని ఫోన్, స్థానిక పరిచయాలు ఇతర అన్ని సంబంధాలను ఆరా తీస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, మిగిలిన వారిని అదుపులోకి తీసుకుంటామని పోలీసులు తెలిపారు.

Pakistani Fayaz Ahmed
పాకిస్థానీ ఫయాజ్​ అహ్మద్​

కేంద్ర నిఘా సంస్థలు ఎంట్రీ : హైదరాబాద్​లో పట్టుబడిన పాకిస్థానీపై కేంద్ర నిఘా వర్గాలు ఆరా తీస్తున్నాయి. యువతితో పెళ్లి వెనుక కుట్రకోణం ఉందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఇందుకోసం ఇంటెలిజెన్స్​, కౌంటర్​ ఇంటెలిజెన్స్​, ఎన్​ఐఏ అధికారులు రంగంలోకి దిగారు. పాకిస్థాన్​కు చెందిన ఫయాజ్​ నేపాల్​ మీదుగా హైదరాబాద్​ వచ్చేందుకు అత్త, మామ సహకరించడంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పాతబస్తీలో అతనుకు ఉన్న పరిచయాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇప్పటికే నిందితుడి సెల్​ఫోన్​ను స్వాధీనం చేసుకొని.. సామాజిక మాధ్యమాల ఖాతాల వివరాలను ఇంటెలిజెన్స్​ అధికారులు సేకరిస్తున్నారు. ఫయాజ్​ కస్టడీని కోరుతూ పిటిషన్​ దాఖలు చేయనున్నారు. కస్టడీలోకి తీసుకున్న తర్వాత ఫయాజ్​ను నిఘా వర్గాలు విచారించనున్నాయి.

"ఫయాజ్​ అనే వ్యక్తి పాకిస్థాన్​ నుంచి అక్రమంగా భారత్​లోకి ప్రవేశించి హైదరాబాద్​లో ఉంటున్నాడు. అతని దగ్గరున్న పాకిస్థాన్‌ పాస్‌పోర్టు, పాకిస్తాన్ గుర్తింపు కార్డు, బర్త్ సర్టిఫికెట్, ఫ్లైట్ టికెట్స్, రైల్వే టికెట్స్, నేపాల్ బోర్డింగ్ పాస్ లాంటివి స్వాధీనం చేసుకున్నాము. జుబేర్‌ ఖాన్, అఫ్జల్‌ బేగం ఇద్దరూ పరారీలో ఉన్నారు. నిందితుణ్ని అరెస్ట్ చేసి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాము. మిగిలిన వారిని అదుపులోకి తీసుకుంటాము". - సాయి చైతన్య, డీసీపీ

Pakistani Arrested in Hyderabad షార్జాలో పెళ్లి.. హైదరాబాద్​లో కాపురం.. భార్య కోసం సరిహద్దులు దాటిన పాకిస్థానీ అరెస్ట్

Social Media Love Stories : మ్యారేజెస్‌ ఆర్‌ మేడిన్‌ హెవెన్‌ కాదు.. మ్యారేజెస్‌ ఆర్‌ మేడిన్‌ సోషల్ మీడియా

ఇన్​స్టాలో పరిచయం.. ప్రియుడి కోసం భారత్ వచ్చిన పోలాండ్ మహిళ.. ఆరేళ్ల కూతురితో..

Pakistani Arrested in Hyderabad : ప్రేమించి పెళ్లి చేసుకున్న యువతి కోసం ఓ పాకిస్థాన్ దేశస్తుడు(Pakistani National in Hyderabad) సరిహద్దులను దాటొచ్చాడు. పాకిస్థాన్ నుంచి నేపాల్ మీదుగా భారత్‌లోకి అక్రమంగా ప్రవేశించి హైదరాబాద్‌ చేరాడు. గుట్టుచప్పుడు కాకుండా భార్యతో కలిసి నివసిస్తున్న అతని వ్యవహారం దాదాపు 9 నెలల తర్వాత బట్టబయలైంది. మరో వ్యక్తి పేరిట ఆధార్‌ కార్డు సంపాదించే క్రమంలో పోలీసులకు చిక్కాడు. అతనికి సహకరించిన యువతి తల్లిదండ్రులపైనా బహదూర్‌పుర పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Pakistan Man Arrested in Hyderabad : పాకిస్థాన్‌లోని ఖైబర్‌ పంక్తుఖ్వాకు చెందిన 24 ఏళ్ల ఫయాజ్ అహ్మద్‌.. 2018 డిసెంబరులో ఉపాధి కోసం షార్జాకు వెళ్లాడు. స్థానికంగా సైఫ్‌జోన్‌లోని వస్త్ర పరిశ్రమలో పనిలో చేరాడు. హైదరాబాద్‌లోని బహదూర్‌పుర పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని కిషన్‌బాగ్‌కు చెందిన 29 ఏళ్ల నేహ ఫాతిమా ఉపాధి కోసం 2019లో షార్జా వెళ్లింది. అక్కడి మిలీనియం ఫ్యాషన్‌ పరిశ్రమలో ఫాతిమా ఉద్యోగం పొందేందుకు ఫయాజ్‌ సహకరించాడు. ఇద్దరి మధ్య పరిచయం ప్రేమగా మారి షార్జాలోనే 2019లో వివాహం చేసుకున్నారు. వారికి ప్రస్తుతం మూడేళ్ల మగబిడ్డ కూడా ఉన్నాడు.

తల్లిదండ్రులను ఎదిరించి హైకోర్టులో పోరాడి మరీ ఒక్కటైన అమ్మాయిలు

Pakistani National Arrested in Hyderabad : ఫాతిమా ఒక్కతే గతేడాది హైదరాబాద్‌ తిరిగివచ్చి కిషన్‌బాగ్‌లోని అసఫ్‌ బాబానగర్‌లో ఉంటోంది. ఫయాజ్‌ పాకిస్థాన్‌ వెళ్లిపోయాడు. ఈ క్రమంలోనే ఫాతిమా తల్లిదండ్రులు జుబేర్‌ షేక్, అఫ్జల్‌ బేగం.. ఫయాజ్‌ను సంప్రదించారు. పాకిస్థాన్‌ నుంచి హైదరాబాద్‌కు రావాలని స్థానికుడి గుర్తింపు పత్రాలు వచ్చేలా చూసుకుంటామని చెప్పారు. వీసా, ఇతరత్రా ఎలాంటి గుర్తింపు లేకున్నా ఫయాజ్‌ గతేడాది నవంబరులో పాకిస్థాన్‌ నుంచి నేపాల్‌ వెళ్లాడు. జుబేర్‌ షేక్, అఫ్జల్‌ బేగం ఇద్దరూ నేపాల్‌లోని ఖాట్మండుకు వెళ్లి ఫయాజ్‌ను కలిసి సరిహద్దుల్లో కొందరి సాయంతో సరిహద్దులు దాటించి భారత్‌కు తీసుకొచ్చారు. అనంతరం హైదరాబాద్‌లోని కిషన్‌బాగ్‌లో అక్రమంగా ఉండేందుకు ఆవాసం కల్పించారు.

Pakistani Man Illegally Entered India For His Wife : అతనికి ఆధార్‌ కార్డు ఇప్పించి స్థానికుడిలా నమ్మించేందుకు పథకం వేశారు. మాదాపూర్‌లో ఒక ఆధార్‌ నమోదు కేంద్రానికి తీసుకెళ్లి తమ కుమారుడు మహ్మద్‌ గౌస్‌ పేరిట రిజిస్టర్‌ చేసేందుకు ప్రయత్నించారు. ఈ మేరకు నకిలీ జనన ధ్రువీకరణ పత్రం సమర్పించారు. ఈ సమాచారం స్థానికుల ద్వారా పోలీసులకు చేరింది. అప్రమత్తమైన పోలీసులు ఫయాజ్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా పాకిస్థానీగా తేలింది. అతని దగ్గరున్న పాకిస్థాన్‌ పాస్‌పోర్టు గడువు కూడా ముగిసినట్లు తేలింది.

జుబేర్‌ ఖాన్, అఫ్జల్‌ బేగం ఇద్దరూ పరారీలో ఉన్నారు. నిందితుణిని అదుపులోకి తీసుకున్న అనంతరం కౌంటర్‌ ఇంటలిజెన్స్, కేంద్ర నిఘావర్గాలు అతణిని విచారించాయి. ఉద్దేశపూర్వకంగా సరిహద్దులు దాటాడా.. కుట్ర కోణం ఏమైనా ఉందా అని లోతుగా విచారిస్తున్నారు. అతని ఫోన్, స్థానిక పరిచయాలు ఇతర అన్ని సంబంధాలను ఆరా తీస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, మిగిలిన వారిని అదుపులోకి తీసుకుంటామని పోలీసులు తెలిపారు.

Pakistani Fayaz Ahmed
పాకిస్థానీ ఫయాజ్​ అహ్మద్​

కేంద్ర నిఘా సంస్థలు ఎంట్రీ : హైదరాబాద్​లో పట్టుబడిన పాకిస్థానీపై కేంద్ర నిఘా వర్గాలు ఆరా తీస్తున్నాయి. యువతితో పెళ్లి వెనుక కుట్రకోణం ఉందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఇందుకోసం ఇంటెలిజెన్స్​, కౌంటర్​ ఇంటెలిజెన్స్​, ఎన్​ఐఏ అధికారులు రంగంలోకి దిగారు. పాకిస్థాన్​కు చెందిన ఫయాజ్​ నేపాల్​ మీదుగా హైదరాబాద్​ వచ్చేందుకు అత్త, మామ సహకరించడంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పాతబస్తీలో అతనుకు ఉన్న పరిచయాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇప్పటికే నిందితుడి సెల్​ఫోన్​ను స్వాధీనం చేసుకొని.. సామాజిక మాధ్యమాల ఖాతాల వివరాలను ఇంటెలిజెన్స్​ అధికారులు సేకరిస్తున్నారు. ఫయాజ్​ కస్టడీని కోరుతూ పిటిషన్​ దాఖలు చేయనున్నారు. కస్టడీలోకి తీసుకున్న తర్వాత ఫయాజ్​ను నిఘా వర్గాలు విచారించనున్నాయి.

"ఫయాజ్​ అనే వ్యక్తి పాకిస్థాన్​ నుంచి అక్రమంగా భారత్​లోకి ప్రవేశించి హైదరాబాద్​లో ఉంటున్నాడు. అతని దగ్గరున్న పాకిస్థాన్‌ పాస్‌పోర్టు, పాకిస్తాన్ గుర్తింపు కార్డు, బర్త్ సర్టిఫికెట్, ఫ్లైట్ టికెట్స్, రైల్వే టికెట్స్, నేపాల్ బోర్డింగ్ పాస్ లాంటివి స్వాధీనం చేసుకున్నాము. జుబేర్‌ ఖాన్, అఫ్జల్‌ బేగం ఇద్దరూ పరారీలో ఉన్నారు. నిందితుణ్ని అరెస్ట్ చేసి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాము. మిగిలిన వారిని అదుపులోకి తీసుకుంటాము". - సాయి చైతన్య, డీసీపీ

Pakistani Arrested in Hyderabad షార్జాలో పెళ్లి.. హైదరాబాద్​లో కాపురం.. భార్య కోసం సరిహద్దులు దాటిన పాకిస్థానీ అరెస్ట్

Social Media Love Stories : మ్యారేజెస్‌ ఆర్‌ మేడిన్‌ హెవెన్‌ కాదు.. మ్యారేజెస్‌ ఆర్‌ మేడిన్‌ సోషల్ మీడియా

ఇన్​స్టాలో పరిచయం.. ప్రియుడి కోసం భారత్ వచ్చిన పోలాండ్ మహిళ.. ఆరేళ్ల కూతురితో..

Last Updated : Sep 1, 2023, 5:36 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.