ETV Bharat / bharat

ప్రభుత్వ రంగ ఉక్కు​ పరిశ్రమను దక్కించుకున్న టాటా

author img

By

Published : Jan 31, 2022, 4:07 PM IST

NINL disinvestment: మరో ప్రభుత్వ రంగ సంస్థ విక్రయాన్ని విజయవంతంగా పూర్తి చేసింది కేంద్రం. ఒడిశాలోని స్టీల్​ ఉత్పత్తి పరిశ్రమ నీలాచల్​ ఇస్పాత్​ నిగమ్​ లిమిటెడ్​ను రూ.12,100 కోట్లకు టాటా స్టీల్​ లాంగ్​ ప్రొడక్ట్స్​ సంస్థకు విక్రయానికి ఆమోదం తెలిపినట్లు ప్రకటించింది. ఈ మేరకు ట్వీట్​ చేశారు డీఐపీఏఎం సెక్రెటరీ తుహిన్​ కాంత పాండే ట్వీట్​ చేశారు.

Govt approves NINL sale to Tata Steel Long Products
ఒడిశాలోని స్టీల్​ పరిశ్రమను దక్కించుకున్న టాటా గ్రూప్​​

NINL disinvestment: ఒడిశాలోని ప్రభుత్వ రంగ స్టీల్​ ఉత్పత్తి పరిశ్రమ.. నీలాచల్​ ఇస్పాత్​ నిగమ్​ లిమిటెడ్​(ఎన్​ఐఎన్​ఎల్​)ను దక్కించుకుంది టాటా స్టీల్​ లాంగ్​ ప్రొడక్ట్స్​ లిమిటెడ్​​. నష్టాల్లో ఉన్న ఎన్​ఐఎన్​ఎల్​ను రూ.12,100 కోట్లకు విక్రయానికి ఆమోదం తెలిపినట్లు ప్రభుత్వం సోమవారం ప్రకటించింది.

ఎంఎంటీసీ, ఎన్​ఎండీసీ, బీహెచ్​ఈఎల్​, ఎంఈసీఓఎన్​ అనే నాలుగు సీపీఎస్​ఈలు సహా రెండు ఒడిశా ప్రభుత్వ పీఎస్​యూలు ఓఎంసీ, ఐపీఐసీఓఎల్​ల సంయుక్త వెంచర్​ ఎన్​ఐఎన్​ఎల్​. ఇది ఒడిశాలోని కళింగనగర్​లో 1.1 మిలియన్​ టన్నుల సామర్థ్యంతో ఏర్పాటు చేసిన స్టీల్​ ప్లాంట్​. ఈ సంస్థ భారీ నష్టాల్లోకి జారుకున్న క్రమంలో 2020, మార్చి 30న మూసివేశారు.

నష్టాల్లో ఉన్న ఈ స్టీల్​ ప్లాంట్​ను విక్రయించేందుకు కేంద్రం బిడ్లు ఆహ్వానించగా.. మూడు సంస్థలు(జిందాల్​ స్టీల్​ అండ్​ పవర్​ లిమిటెడ్​, నాల్వా స్టీల్​ అండ్​ పవర్​ లిమిటెడ్​ల కన్షార్టియం, జేఎస్​డబ్ల్యూ స్టీల్​, టాటా స్టీల్​ లాంగ్​ ప్రొడక్ట్స్​) బిడ్లు దాఖలు చేశాయి. రూ.12,100 కోట్లతో బిడ్​ దాఖలు చేసింది టాటా స్టీల్​ లాంగ్​ ప్రొడక్ట్స్(టీఎస్​ఎల్​పీ). మిగతా సంస్థల కన్నా ఎక్కువ కోట్​ చేసిన క్రమంలో.. టీఎస్​ఎల్​పీ​ బిడ్​ను ఆమోదించినట్లు తాజాగా ప్రకటించింది ప్రభుత్వం. షేర్​ పర్చేస్​ అగ్రిమెంట్​(ఎస్​పీఏ)పై సంతకాలు చేసేందుకు టీఎస్​ఎల్​పీకి లెటర్​ ఆఫ్​ ఇంటెంట్​ను జారీ చేసింది. ఈ సమయంలో బిడ్​ దక్కించుకున్న సంస్థ 10 శాతం నగదును చెల్లించాల్సి ఉంటుంది.

టీఎస్​ఎల్​పీ బిడ్​ను ఆమోదించినట్లు డీఐపీఎఎమ్​​ సెక్రెటరీ తుహిన్​ కాంత పాండే ట్వీట్​ చేశారు.

  • Government approves strategic buyer for Neelachal Ispat Nigam Ltd located in Odisha. The highest bid of Rs12,100 crore by M /s Tata Steel Long Products Ltd is accepted https://t.co/RDfByvp682 pic.twitter.com/b7IHrO11om

    — Secretary, DIPAM (@SecyDIPAM) January 31, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="

Government approves strategic buyer for Neelachal Ispat Nigam Ltd located in Odisha. The highest bid of Rs12,100 crore by M /s Tata Steel Long Products Ltd is accepted https://t.co/RDfByvp682 pic.twitter.com/b7IHrO11om

— Secretary, DIPAM (@SecyDIPAM) January 31, 2022 ">

ఎన్​ఐఎన్​ల్​కు 2021, మార్చి 31 నాటికి అప్పులు రూ.6,600 కోట్లు దాటాయి. అందులో ప్రమోటర్లు, బ్యాంకులకు చెల్లించాల్సినవే అధికంగా ఉన్నాయి. 2021, మార్చి 31 నాటికి సంస్థ రూ.4,228 కోట్ల నష్టాన్ని చవిచూసింది.

కొద్ది రోజుల క్రితమే నష్టాల్లో ఉన్న ప్రభుత్వ విమానయాన సంస్థ ప్రైవేటీకరణను పూర్తి చేసి.. రూ.18,000 కోట్లకు టాటా గ్రూప్​నకు అప్పగించింది ప్రభుత్వం.

ఇదీ చూడండి: Air India Handover: 'టాటా'ల.. ఏడు దశాబ్దాల కల నేరవేరిన వేళ..

NINL disinvestment: ఒడిశాలోని ప్రభుత్వ రంగ స్టీల్​ ఉత్పత్తి పరిశ్రమ.. నీలాచల్​ ఇస్పాత్​ నిగమ్​ లిమిటెడ్​(ఎన్​ఐఎన్​ఎల్​)ను దక్కించుకుంది టాటా స్టీల్​ లాంగ్​ ప్రొడక్ట్స్​ లిమిటెడ్​​. నష్టాల్లో ఉన్న ఎన్​ఐఎన్​ఎల్​ను రూ.12,100 కోట్లకు విక్రయానికి ఆమోదం తెలిపినట్లు ప్రభుత్వం సోమవారం ప్రకటించింది.

ఎంఎంటీసీ, ఎన్​ఎండీసీ, బీహెచ్​ఈఎల్​, ఎంఈసీఓఎన్​ అనే నాలుగు సీపీఎస్​ఈలు సహా రెండు ఒడిశా ప్రభుత్వ పీఎస్​యూలు ఓఎంసీ, ఐపీఐసీఓఎల్​ల సంయుక్త వెంచర్​ ఎన్​ఐఎన్​ఎల్​. ఇది ఒడిశాలోని కళింగనగర్​లో 1.1 మిలియన్​ టన్నుల సామర్థ్యంతో ఏర్పాటు చేసిన స్టీల్​ ప్లాంట్​. ఈ సంస్థ భారీ నష్టాల్లోకి జారుకున్న క్రమంలో 2020, మార్చి 30న మూసివేశారు.

నష్టాల్లో ఉన్న ఈ స్టీల్​ ప్లాంట్​ను విక్రయించేందుకు కేంద్రం బిడ్లు ఆహ్వానించగా.. మూడు సంస్థలు(జిందాల్​ స్టీల్​ అండ్​ పవర్​ లిమిటెడ్​, నాల్వా స్టీల్​ అండ్​ పవర్​ లిమిటెడ్​ల కన్షార్టియం, జేఎస్​డబ్ల్యూ స్టీల్​, టాటా స్టీల్​ లాంగ్​ ప్రొడక్ట్స్​) బిడ్లు దాఖలు చేశాయి. రూ.12,100 కోట్లతో బిడ్​ దాఖలు చేసింది టాటా స్టీల్​ లాంగ్​ ప్రొడక్ట్స్(టీఎస్​ఎల్​పీ). మిగతా సంస్థల కన్నా ఎక్కువ కోట్​ చేసిన క్రమంలో.. టీఎస్​ఎల్​పీ​ బిడ్​ను ఆమోదించినట్లు తాజాగా ప్రకటించింది ప్రభుత్వం. షేర్​ పర్చేస్​ అగ్రిమెంట్​(ఎస్​పీఏ)పై సంతకాలు చేసేందుకు టీఎస్​ఎల్​పీకి లెటర్​ ఆఫ్​ ఇంటెంట్​ను జారీ చేసింది. ఈ సమయంలో బిడ్​ దక్కించుకున్న సంస్థ 10 శాతం నగదును చెల్లించాల్సి ఉంటుంది.

టీఎస్​ఎల్​పీ బిడ్​ను ఆమోదించినట్లు డీఐపీఎఎమ్​​ సెక్రెటరీ తుహిన్​ కాంత పాండే ట్వీట్​ చేశారు.

ఎన్​ఐఎన్​ల్​కు 2021, మార్చి 31 నాటికి అప్పులు రూ.6,600 కోట్లు దాటాయి. అందులో ప్రమోటర్లు, బ్యాంకులకు చెల్లించాల్సినవే అధికంగా ఉన్నాయి. 2021, మార్చి 31 నాటికి సంస్థ రూ.4,228 కోట్ల నష్టాన్ని చవిచూసింది.

కొద్ది రోజుల క్రితమే నష్టాల్లో ఉన్న ప్రభుత్వ విమానయాన సంస్థ ప్రైవేటీకరణను పూర్తి చేసి.. రూ.18,000 కోట్లకు టాటా గ్రూప్​నకు అప్పగించింది ప్రభుత్వం.

ఇదీ చూడండి: Air India Handover: 'టాటా'ల.. ఏడు దశాబ్దాల కల నేరవేరిన వేళ..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.