ETV Bharat / bharat

ఆర్టీసీ బస్​లో మహిళకు లైంగిక వేధింపులు... నిద్రిస్తుండగానే...

author img

By

Published : Mar 6, 2022, 5:58 PM IST

Molestation In RTC Bus: ఆర్టీసీ బస్​లో ఓ వ్యక్తి తనను లైంగికంగా వేధించినట్లు ఓ మహిళ ఆరోపించారు. ఈ విషయంలో ఆ బస్​ కండక్టర్​ సరిగా స్పందించకుండా అలసత్వం వహించినట్లు పేర్కొన్నారు.

bus
బస్​

Molestation In RTC Bus: కేరళ ఆర్టీసీ బస్​లో ఓ వ్యక్తి తనను లైంగికంగా వేధించాడని ఓ ఉపాధ్యాయురాలు ఆరోపించారు. దీనిపై కండక్టర్​కు ఫిర్యాదు చేస్తే అతను ఉదాసీనంగా వ్యవహరించినట్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఫేస్​బుక్​లో ఓ వీడియో పోస్ట్​ చేశారు.

తిరువనంతపురం నుంచి బస్సు త్రిసూర్​ వెళ్తుండగా సహ ప్రయాణికుడు తనను లైంగికంగా వేధించనట్లు మహిళ పేర్కొన్నారు. ఈ సమయంలో తాను నిద్రిపోతున్నట్లు తెలిపారు. నిందితుడు ఆమెతో పాటే తిరువనంతపురంలో బస్​ ఎక్కాడు. అయితే కోజికోడ్​ నుంచి బస్ త్రిసూర్​కు చేరుతున్న సమయంలో వెనక నుంచి తన శరీర భాగాలను తాకేందుకు ప్రయత్నించినట్లు మహిళ ఆరోపించారు. అయితే తాను అందుకు ఎదురు చెప్పడం వల్ల ఆగిపోయినట్లు వివరించారు.

అయితే కండక్టర్​ ఈ విషయంపై తగిన రీతిలో స్పందించకుండా.. తేలిగ్గా తీసుకున్నట్లు మహిళ ఆరోపించారు. కేవలం నిందితుడు క్షమాపణ కోరాడని.. తనని వారించినట్లు తెలిపారు.

మంత్రి స్పందన

అయితే ఘటనపై విచారణ జరిపి నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని కేరళ రవాణా శాఖ మంత్రి ఆంథోని రాజు తెలిపారు. కండక్టర్ బాధ్యతారాహిత్యంగా వ్యవహరించినట్లు విచారణలో తేలితే అతనిపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

ఇవీ చూడండి:

స్నేహితులతో కలిసి విద్యార్థినిపై జవాను గ్యాంగ్​రేప్​

కన్న కూతుర్ని లైంగికంగా వేధించిన తండ్రి

Molestation In RTC Bus: కేరళ ఆర్టీసీ బస్​లో ఓ వ్యక్తి తనను లైంగికంగా వేధించాడని ఓ ఉపాధ్యాయురాలు ఆరోపించారు. దీనిపై కండక్టర్​కు ఫిర్యాదు చేస్తే అతను ఉదాసీనంగా వ్యవహరించినట్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఫేస్​బుక్​లో ఓ వీడియో పోస్ట్​ చేశారు.

తిరువనంతపురం నుంచి బస్సు త్రిసూర్​ వెళ్తుండగా సహ ప్రయాణికుడు తనను లైంగికంగా వేధించనట్లు మహిళ పేర్కొన్నారు. ఈ సమయంలో తాను నిద్రిపోతున్నట్లు తెలిపారు. నిందితుడు ఆమెతో పాటే తిరువనంతపురంలో బస్​ ఎక్కాడు. అయితే కోజికోడ్​ నుంచి బస్ త్రిసూర్​కు చేరుతున్న సమయంలో వెనక నుంచి తన శరీర భాగాలను తాకేందుకు ప్రయత్నించినట్లు మహిళ ఆరోపించారు. అయితే తాను అందుకు ఎదురు చెప్పడం వల్ల ఆగిపోయినట్లు వివరించారు.

అయితే కండక్టర్​ ఈ విషయంపై తగిన రీతిలో స్పందించకుండా.. తేలిగ్గా తీసుకున్నట్లు మహిళ ఆరోపించారు. కేవలం నిందితుడు క్షమాపణ కోరాడని.. తనని వారించినట్లు తెలిపారు.

మంత్రి స్పందన

అయితే ఘటనపై విచారణ జరిపి నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని కేరళ రవాణా శాఖ మంత్రి ఆంథోని రాజు తెలిపారు. కండక్టర్ బాధ్యతారాహిత్యంగా వ్యవహరించినట్లు విచారణలో తేలితే అతనిపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

ఇవీ చూడండి:

స్నేహితులతో కలిసి విద్యార్థినిపై జవాను గ్యాంగ్​రేప్​

కన్న కూతుర్ని లైంగికంగా వేధించిన తండ్రి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.