ETV Bharat / bharat

మమతXసువేందు: నందిగ్రామ్​లో మాటల తూటాలు

బంగాల్​ శాసనసభ ఎన్నికల రెండో దశ పోలింగ్ సమీపిస్తున్న వేళ... నందిగ్రామ్​లో​​ ప్రచారాలు తారస్థాయికి చేరాయి. మమత-సువేందు మధ్య మాటల యుద్ధం తీవ్రమైంది. భాజపా గూండాలకు గట్టి సమాధానం ఇవ్వాలని మమత కోరితే.. దీదీ బేగంకు ఓటు వేయొద్దని సువేందు అభ్యర్థించారు.

author img

By

Published : Mar 29, 2021, 5:41 PM IST

Mamata alleges Bengalis will be driven out of state if BJP wins
మమతXసువేందు: నందిగ్రామ్​లో మాటల తూటాలు

ఇప్పటికే రణరంగాన్ని తలపిస్తున్న బంగాల్​ నందిగ్రామ్​లో.. సోమవారం రాజకీయ వేడి తారస్థాయికి చేరింది. తృణమూల్​ కాంగ్రెస్​ అధినేత్రి మమతా బెనర్జీ, భాజపా నేత సువేందు అధికారి ఎన్నికల ప్రచారాలతో నందిగ్రామ్​ వీధులు హోరెత్తాయి. ఈ క్రమంలోనే ఇరువురు నేతలు ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకున్నారు. భాజపాకు అధికారాన్ని కట్టబెడితే.. బంగాలీలను రాష్ట్రం నుంచి పంపేస్తుందని మమత ఆరోపించారు. దీదీకి మళ్లీ అధికారాన్ని ఇస్తే.. బంగాల్​ ఓ మినీ పాకిస్థాన్​లా మారుతుందని విమర్శించారు సువేందు.

'భాజపా వద్దు...'

నందిగ్రామ్​లో ఎన్నికల సభ నిర్వహించారు మమత. గెలిచిన అనంతరం అక్కడ తన కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తానని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే భాజపాపై విమర్శలు చేశారు.

Mamata alleges Bengalis will be driven out of state if BJP wins
నందిగ్రామ్​ సభలో మమత ప్రసంగం

"మీరు భాజపాకు ఓటేస్తే.. ఆ పార్టీ మిమ్మల్ని రాష్ట్రం నుంచి తరిమేస్తుంది. గూండాలను నియమించి.. బంగాల్​ను దోచుకుంటుంది. బంగాలీల ఉనికిపైనే దెబ్బకొడుతుంది. కానీ మీరు టీఎంసీకి ఓటేస్తే.. మీకు ఇంటి వద్దకే ఉచిత రేషన్​ వస్తుంది. సంస్కృతిని ప్రేమించలేని వారు, ఇక్కడకి వచ్చి రాజకీయాలు చేయలేరు. నందిగ్రామ్​లో గూండాయిజం పెరిగిపోయింది. మేము బిరులియాలో సభ నిర్వహించాం. అక్కడ ఉన్న టీఎంసీ కార్యాలయాన్ని ధ్వంసం చేశారు. అధికారి.. తనకు నచ్చింది చేస్తున్నారు. ఆట ఆడటం నాకూ వచ్చు. సింహంలా విరుచుకుపడతాను. నేను బంగాల్​ పులిని. మనం ఈ ఆటలో తప్పకుండా గెలవాలి. భాజపా గూండాయిజాన్ని ప్రేరేపిస్తే.. చీపురు, వంట పాత్రలతో సమాధానం చెప్పాలి. నా పేరునైనా మర్చిపోతానేమో కానీ.. నందిగ్రామ్​ను మాత్రం మర్చిపోలేను."

--- మమతా బెనర్జీ, బంగాల్​ ముఖ్యమంత్రి.

'బేగంను గెలిపించొద్దు...'

మమతా బెనర్జీ.. మైనారిటీలను ప్రసన్నం చేసుకునేందుకు తీవ్రంగా శ్రమిస్తారని విమర్శించారు సువేందు అధికారి. ఖడంబరిలో జరిగిన సభలో ఈ వ్యాఖ్యలు చేశారు.

Mamata alleges Bengalis will be driven out of state if BJP wins
సువేందు అధికారి

"మమతా బెనర్జీకి ఈద్​ ముబారక్​ చెప్పడం అలవాటు. అదే విధంగా హోలీ ముబారక్​ అన్నారు. దీదీలో అనూహ్య మార్పు కనిపిస్తోంది. ఓటమి భయంతోనే ఆలయాల చుట్టూ తిరుగుతున్నారు. 'బేగం'కు ఓటు వేయకండి. బేగంకు ఓటేస్తే.. బంగాల్​ మినీ పాకిస్థాన్​లా మారిపోతుంది."

--- సువేందు అధికారి, భాజపా నేత.

మమతXసువేందు...

ఇన్నేళ్లు మమతకు నమ్మిన బంటుగా.. నందిగ్రామ్​ ప్రజల నుంచి విశేష ఆదరణ పొందిన సువేందు అధికారి.. ఎన్నికలకు ముందు భాజపాలో చేరారు. ఇందుకు మమత గట్టిగానే సమాధానమిచ్చారు. సొంత నియోజకవర్గం భవానీపొర్​ను వీడి నందిగ్రామ్​ నుంచి పోటీ చేస్తున్నట్టు ప్రకటించారు.

అయితే నందిగ్రామ్​లో మమతపై కచ్చితంగా విజయం సాధిస్తానని సువేందు ధీమాగా ఉన్నారు.

బంగాల్​ రెండో దశ ఎన్నికల్లో భాగంగా... ఏప్రిల్​ 1న నందిగ్రామ్​ నియోజకవర్గంలో పోలింగ్​ జరగనుంది. మమత-సువేందు పోటీలో విజేతలు ఎవరనేది మే 2న తేలుతుంది.

ఇదీ చూడండి:- బంగాల్​ బరి: అలజడుల నందిగ్రామ్​లో గెలుపెవరిది?

ఇప్పటికే రణరంగాన్ని తలపిస్తున్న బంగాల్​ నందిగ్రామ్​లో.. సోమవారం రాజకీయ వేడి తారస్థాయికి చేరింది. తృణమూల్​ కాంగ్రెస్​ అధినేత్రి మమతా బెనర్జీ, భాజపా నేత సువేందు అధికారి ఎన్నికల ప్రచారాలతో నందిగ్రామ్​ వీధులు హోరెత్తాయి. ఈ క్రమంలోనే ఇరువురు నేతలు ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకున్నారు. భాజపాకు అధికారాన్ని కట్టబెడితే.. బంగాలీలను రాష్ట్రం నుంచి పంపేస్తుందని మమత ఆరోపించారు. దీదీకి మళ్లీ అధికారాన్ని ఇస్తే.. బంగాల్​ ఓ మినీ పాకిస్థాన్​లా మారుతుందని విమర్శించారు సువేందు.

'భాజపా వద్దు...'

నందిగ్రామ్​లో ఎన్నికల సభ నిర్వహించారు మమత. గెలిచిన అనంతరం అక్కడ తన కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తానని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే భాజపాపై విమర్శలు చేశారు.

Mamata alleges Bengalis will be driven out of state if BJP wins
నందిగ్రామ్​ సభలో మమత ప్రసంగం

"మీరు భాజపాకు ఓటేస్తే.. ఆ పార్టీ మిమ్మల్ని రాష్ట్రం నుంచి తరిమేస్తుంది. గూండాలను నియమించి.. బంగాల్​ను దోచుకుంటుంది. బంగాలీల ఉనికిపైనే దెబ్బకొడుతుంది. కానీ మీరు టీఎంసీకి ఓటేస్తే.. మీకు ఇంటి వద్దకే ఉచిత రేషన్​ వస్తుంది. సంస్కృతిని ప్రేమించలేని వారు, ఇక్కడకి వచ్చి రాజకీయాలు చేయలేరు. నందిగ్రామ్​లో గూండాయిజం పెరిగిపోయింది. మేము బిరులియాలో సభ నిర్వహించాం. అక్కడ ఉన్న టీఎంసీ కార్యాలయాన్ని ధ్వంసం చేశారు. అధికారి.. తనకు నచ్చింది చేస్తున్నారు. ఆట ఆడటం నాకూ వచ్చు. సింహంలా విరుచుకుపడతాను. నేను బంగాల్​ పులిని. మనం ఈ ఆటలో తప్పకుండా గెలవాలి. భాజపా గూండాయిజాన్ని ప్రేరేపిస్తే.. చీపురు, వంట పాత్రలతో సమాధానం చెప్పాలి. నా పేరునైనా మర్చిపోతానేమో కానీ.. నందిగ్రామ్​ను మాత్రం మర్చిపోలేను."

--- మమతా బెనర్జీ, బంగాల్​ ముఖ్యమంత్రి.

'బేగంను గెలిపించొద్దు...'

మమతా బెనర్జీ.. మైనారిటీలను ప్రసన్నం చేసుకునేందుకు తీవ్రంగా శ్రమిస్తారని విమర్శించారు సువేందు అధికారి. ఖడంబరిలో జరిగిన సభలో ఈ వ్యాఖ్యలు చేశారు.

Mamata alleges Bengalis will be driven out of state if BJP wins
సువేందు అధికారి

"మమతా బెనర్జీకి ఈద్​ ముబారక్​ చెప్పడం అలవాటు. అదే విధంగా హోలీ ముబారక్​ అన్నారు. దీదీలో అనూహ్య మార్పు కనిపిస్తోంది. ఓటమి భయంతోనే ఆలయాల చుట్టూ తిరుగుతున్నారు. 'బేగం'కు ఓటు వేయకండి. బేగంకు ఓటేస్తే.. బంగాల్​ మినీ పాకిస్థాన్​లా మారిపోతుంది."

--- సువేందు అధికారి, భాజపా నేత.

మమతXసువేందు...

ఇన్నేళ్లు మమతకు నమ్మిన బంటుగా.. నందిగ్రామ్​ ప్రజల నుంచి విశేష ఆదరణ పొందిన సువేందు అధికారి.. ఎన్నికలకు ముందు భాజపాలో చేరారు. ఇందుకు మమత గట్టిగానే సమాధానమిచ్చారు. సొంత నియోజకవర్గం భవానీపొర్​ను వీడి నందిగ్రామ్​ నుంచి పోటీ చేస్తున్నట్టు ప్రకటించారు.

అయితే నందిగ్రామ్​లో మమతపై కచ్చితంగా విజయం సాధిస్తానని సువేందు ధీమాగా ఉన్నారు.

బంగాల్​ రెండో దశ ఎన్నికల్లో భాగంగా... ఏప్రిల్​ 1న నందిగ్రామ్​ నియోజకవర్గంలో పోలింగ్​ జరగనుంది. మమత-సువేందు పోటీలో విజేతలు ఎవరనేది మే 2న తేలుతుంది.

ఇదీ చూడండి:- బంగాల్​ బరి: అలజడుల నందిగ్రామ్​లో గెలుపెవరిది?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.