ETV Bharat / bharat

కశ్మీర్​ డీడీసీ ఎన్నికల అభ్యర్థిపై ఉగ్రదాడి

కశ్మీర్​లో స్థానిక ఎన్నికల మూడో విడత పోలింగ్ ముగిసింది. ఉదయం నుంచే ఓటింగ్​ వేసేందుకు ప్రజలు బారులు తీరారు. ఒంటిగంట వరకు 43 శాతానికిపైగా పోలింగ్​ నమోదైంది. అనంత్​నాగ్​ సంగమ్​ అభ్యర్థిపై ముష్కరులు కాల్పులు జరిపారు.

author img

By

Published : Dec 4, 2020, 4:52 PM IST

J&K: Over 43% polling till 1 pm in 3rd phase of DDC elections
కశ్మీర్​లో పోలింగ్​ పూర్తి- ఓ అభ్యర్థిపై ముష్కరుల కాల్పులు

జమ్ముకశ్మీర్​లో జిల్లా అభివృద్ధి మండలి ఎన్నికల మూడో దశ పోలింగ్​ ముగిసింది. మధ్యాహ్నం ఒంటిగంట వరకు 43 శాతానికిపైగా పోలింగ్​ నమోదైంది. పుంఛ్​ జిల్లాలో అత్యధికంగా 83.07 శాతం మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. పుల్వామాలో కనిష్ఠంగా 9 శాతం ఓటింగ్​ నమోదైంది.

polling
పోలింగ్​ కేంద్రం వద్ద ఓటర్ల బారులు

మూడో దశలో భాగంగా 33 డివిజన్లలో ఓటింగ్​ జరిగింది. మొత్తం 2046 పోలింగ్​ స్టేషన్లు ఏర్పాటు చేశారు. 7 లక్షల 37 వేల 648 మంది ఓటర్లు ఉన్నారు.

polling
పటిష్ఠ బందోబస్తు నడుమ ఎన్నికలు

జమ్ముకశ్మీర్​లోని 20 జిల్లాల్లో మొత్తం 280 స్థానాలకు 8 దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. నవంబర్​ 28న ప్రారంభం కాగా డిసెంబర్​ 19న తుది దశ, 22న ఓట్ల లెక్కింపు ఉంటుంది.

ఉదయం నుంచే..

polling
క్యూలో నిల్చున్న మహిళలు

ఉదయం నుంచే పోలింగ్​ కేంద్రాల ముందు బారులు తీరారు. కొవిడ్​ నేపథ్యంలో ఎన్నికల సిబ్బంది అన్ని ఏర్పాట్లు చేశారు.

polling
ఓటేస్తున్న యువతి

ఓటర్లకు థర్మల్​ స్క్రీనింగ్​ చేశారు. భౌతిక దూరం పాటిస్తూ ఓటు వేశారు.

polling
ఓటర్లకు థర్మల్​ స్క్రీనింగ్​

అభ్యర్థిపై ముష్కరుల కాల్పులు..

జమ్ముకశ్మీర్​ అప్నీ పార్టీకి చెందిన అభ్యర్థి అనీస్​ అహ్మద్​పై.. ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. అనంత్​నాగ్​ జిల్లా సంగమ్​లోని ఆయన నివాసం సమీపంలో ఉదయం 11.45 గంటల ప్రాంతంలో కాల్పులు జరిపినట్లు పోలీసులు తెలిపారు. గాయపడిన అనీస్​ను ఆస్పత్రికి తరలించారు.

DDC polls: Over 25 percent voters exercise franchise in initial hours of polling
అనీస్​ అహ్మద్​

జమ్ముకశ్మీర్​లో జిల్లా అభివృద్ధి మండలి ఎన్నికల మూడో దశ పోలింగ్​ ముగిసింది. మధ్యాహ్నం ఒంటిగంట వరకు 43 శాతానికిపైగా పోలింగ్​ నమోదైంది. పుంఛ్​ జిల్లాలో అత్యధికంగా 83.07 శాతం మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. పుల్వామాలో కనిష్ఠంగా 9 శాతం ఓటింగ్​ నమోదైంది.

polling
పోలింగ్​ కేంద్రం వద్ద ఓటర్ల బారులు

మూడో దశలో భాగంగా 33 డివిజన్లలో ఓటింగ్​ జరిగింది. మొత్తం 2046 పోలింగ్​ స్టేషన్లు ఏర్పాటు చేశారు. 7 లక్షల 37 వేల 648 మంది ఓటర్లు ఉన్నారు.

polling
పటిష్ఠ బందోబస్తు నడుమ ఎన్నికలు

జమ్ముకశ్మీర్​లోని 20 జిల్లాల్లో మొత్తం 280 స్థానాలకు 8 దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. నవంబర్​ 28న ప్రారంభం కాగా డిసెంబర్​ 19న తుది దశ, 22న ఓట్ల లెక్కింపు ఉంటుంది.

ఉదయం నుంచే..

polling
క్యూలో నిల్చున్న మహిళలు

ఉదయం నుంచే పోలింగ్​ కేంద్రాల ముందు బారులు తీరారు. కొవిడ్​ నేపథ్యంలో ఎన్నికల సిబ్బంది అన్ని ఏర్పాట్లు చేశారు.

polling
ఓటేస్తున్న యువతి

ఓటర్లకు థర్మల్​ స్క్రీనింగ్​ చేశారు. భౌతిక దూరం పాటిస్తూ ఓటు వేశారు.

polling
ఓటర్లకు థర్మల్​ స్క్రీనింగ్​

అభ్యర్థిపై ముష్కరుల కాల్పులు..

జమ్ముకశ్మీర్​ అప్నీ పార్టీకి చెందిన అభ్యర్థి అనీస్​ అహ్మద్​పై.. ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. అనంత్​నాగ్​ జిల్లా సంగమ్​లోని ఆయన నివాసం సమీపంలో ఉదయం 11.45 గంటల ప్రాంతంలో కాల్పులు జరిపినట్లు పోలీసులు తెలిపారు. గాయపడిన అనీస్​ను ఆస్పత్రికి తరలించారు.

DDC polls: Over 25 percent voters exercise franchise in initial hours of polling
అనీస్​ అహ్మద్​
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.