ETV Bharat / bharat

నేలపైనా, నీటిపైనా రయ్​రయ్- హోవర్​క్రాఫ్ట్ రూపొందించిన సూపర్ లేడీ సుప్రీత

author img

By ETV Bharat Telugu Team

Published : Nov 22, 2023, 2:38 PM IST

Updated : Nov 22, 2023, 5:25 PM IST

Indias First Indigenous Hovercraft : నేల, నీరు రెండింటిపైనా వెళ్లగల వాహనం తొలిసారి భారత్​లోనే తయారైంది. స్వదేశీ టెక్నాలజీతో తమిళనాడుకు చెందిన ఓ మహిళా వ్యాపారవేత్త దీనిని రూపొందించారు. ఈ హోవర్​క్రాఫ్ట్ వల్ల విపత్తుల సమయంలో కలిగే లాభాలేంటో ఓసారి చూద్దాం.

indias first indigenous hovercraft
indias first indigenous hovercraft
నేలపైనా, నీటిపైనా రయ్​రయ్- హోవర్​క్రాఫ్ట్ రూపొందించిన సూపర్ లేడీ సుప్రీత

Indias First Indigenous Hovercraft : తమిళనాడులోని కోయంబత్తూర్​కు చెందిన సుప్రీత చంద్రశేఖర్ అనే యువ మహిళా వ్యాపారవేత్త నేల, నీటిపై నడవగలిగే హోవర్​క్రాఫ్ట్​ను తయారు చేశారు. భారత్​లో స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన మొట్టమొదటి హోవర్​క్రాఫ్ట్ ఇదే​. మంగళవారం కోయంబత్తూర్​లోని సులూర్ సరస్సులో దీని ట్రయన్​ రన్ విజయవంతం అయింది. 50 లక్షల రూపాయల వ్యయంతో రూపొందించిన ఈ హోవర్‌క్రాఫ్ట్​ ట్రయల్​ రన్​ను చూసేందుకు సమీపంలోని గ్రామస్థులు ఆసక్తి చూపారు. ఈ ప్రత్యేక వాహనాన్ని తమ సెల్​ఫోన్లతో ఫొటోలు తీసుకున్నారు.

indias first indigenous hovercraft
నీటిలో హోవర్​క్రాఫ్ట్ ట్రయల్ రన్

హోవర్‌క్రాఫ్ట్​ను ఇండియన్ నేవీ, ఆర్మీ, ఎయిర్​ఫోర్స్ నిర్వహించే ఆపరేషన్​లలో ఉపయోగించవచ్చని యూరోటెక్ పివోట్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ సుప్రీత చంద్రశేఖర్ తెలిపారు. సహాయక చర్యల సమయంలో ఎన్​డీఆర్​ఎఫ్ బృందాలు దీనిని ఉపయోగించి ప్రజలను కాపాడవచ్చని అన్నారు. ఇది రోడ్డుపై గంటకు 100 కిలోమీటర్లు, నీటిపై గంటకు 80 కిమీ వేగంతో నడుస్తుందని ఆమె తెలిపారు. కెనడాకు చెందిన ప్రైవేట్ కంపెనీ సహకారంతో ఈ హోవర్​క్రాఫ్ట్​ను మేడ్ ఇన్ ఇండియా పథకం కింద తయారు చేశామని వివరించారు సుప్రీత చంద్రశేఖర్.

indias first indigenous hovercraft
మహిళా వ్యాపారవేత్త సుప్రీత చంద్రశేఖర్​

"వరదలు వచ్చినప్పుడు దేశ ప్రజల కోసం ఉపయోగపడే పరికరాలు అందుబాటులో లేవని మాకు అనిపించింది. అందుకే అటువంటి పరిస్థితుల్లో ప్రజలను రక్షించేందుకు ఈ హోవర్​క్రాఫ్ట్​ బాగా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాం."
--సుప్రీత చంద్రశేఖర్, వ్యాపారవేత్త

"సుమారు వెయ్యి కిలోల పేలోడ్ సామర్థ్యంతో ఈ బోట్​ను తయారు చేశాం. ఇందులో ఒకేసారి పది మందికిపైగా ప్రయాణించవచ్చు. ఇక రెగ్యులర్​ ప్రీమియం పెట్రోల్​తో ఈ హోవర్​క్రాఫ్ట్​​ నడుస్తుంది. మిలటరీ, డిఫెన్స్​, రెస్క్యూ బృందాలు ఈ హోవర్​క్రాఫ్ట్​ను ఉపయోగించుకోవచ్చు."
--మ్యాగ్ రాక్సన్​, కెనడా కంపెనీ ప్రతినిధి

నీటిపై, భూమిపై ప్రయాణించగల హోవర్​క్రాఫ్ట్​ను దేశంలోనే తొలిసారి తయారు చేయడం ఆనందంగా ఉందని అన్నారు సుప్రీత చంద్రశేఖర్. ఈ హోవర్​క్రాఫ్ట్​ నడవాలంటే గంటకు 20 నుంచి 25 లీటర్ల ఇంధనం ఖర్చు అవుతుందని తెలిపారు. త్వరలో 24 సీట్లతో 16 మీటర్ల పొడవైన హోవర్​క్రాఫ్ట్​ తయారు చేయాలని భావిస్తున్నట్లు చెప్పారు.

indias first indigenous hovercraft
చెరువులో హోవర్​క్రాఫ్ట్
indias first indigenous hovercraft
చెరువులో హోవర్​క్రాఫ్ట్

పట్టువిడవని యువఇంజినీర్లు- సొంత పవర్ ప్లాంట్ నిర్మాణం, ప్రభుత్వానికే కరెంట్ అమ్మకం

'మోదీ వల్లే టీమ్​ఇండియా ప్రపంచకప్ ఫైనల్లో ఓడిపోయింది'- రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ ఫైర్

నేలపైనా, నీటిపైనా రయ్​రయ్- హోవర్​క్రాఫ్ట్ రూపొందించిన సూపర్ లేడీ సుప్రీత

Indias First Indigenous Hovercraft : తమిళనాడులోని కోయంబత్తూర్​కు చెందిన సుప్రీత చంద్రశేఖర్ అనే యువ మహిళా వ్యాపారవేత్త నేల, నీటిపై నడవగలిగే హోవర్​క్రాఫ్ట్​ను తయారు చేశారు. భారత్​లో స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన మొట్టమొదటి హోవర్​క్రాఫ్ట్ ఇదే​. మంగళవారం కోయంబత్తూర్​లోని సులూర్ సరస్సులో దీని ట్రయన్​ రన్ విజయవంతం అయింది. 50 లక్షల రూపాయల వ్యయంతో రూపొందించిన ఈ హోవర్‌క్రాఫ్ట్​ ట్రయల్​ రన్​ను చూసేందుకు సమీపంలోని గ్రామస్థులు ఆసక్తి చూపారు. ఈ ప్రత్యేక వాహనాన్ని తమ సెల్​ఫోన్లతో ఫొటోలు తీసుకున్నారు.

indias first indigenous hovercraft
నీటిలో హోవర్​క్రాఫ్ట్ ట్రయల్ రన్

హోవర్‌క్రాఫ్ట్​ను ఇండియన్ నేవీ, ఆర్మీ, ఎయిర్​ఫోర్స్ నిర్వహించే ఆపరేషన్​లలో ఉపయోగించవచ్చని యూరోటెక్ పివోట్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ సుప్రీత చంద్రశేఖర్ తెలిపారు. సహాయక చర్యల సమయంలో ఎన్​డీఆర్​ఎఫ్ బృందాలు దీనిని ఉపయోగించి ప్రజలను కాపాడవచ్చని అన్నారు. ఇది రోడ్డుపై గంటకు 100 కిలోమీటర్లు, నీటిపై గంటకు 80 కిమీ వేగంతో నడుస్తుందని ఆమె తెలిపారు. కెనడాకు చెందిన ప్రైవేట్ కంపెనీ సహకారంతో ఈ హోవర్​క్రాఫ్ట్​ను మేడ్ ఇన్ ఇండియా పథకం కింద తయారు చేశామని వివరించారు సుప్రీత చంద్రశేఖర్.

indias first indigenous hovercraft
మహిళా వ్యాపారవేత్త సుప్రీత చంద్రశేఖర్​

"వరదలు వచ్చినప్పుడు దేశ ప్రజల కోసం ఉపయోగపడే పరికరాలు అందుబాటులో లేవని మాకు అనిపించింది. అందుకే అటువంటి పరిస్థితుల్లో ప్రజలను రక్షించేందుకు ఈ హోవర్​క్రాఫ్ట్​ బాగా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాం."
--సుప్రీత చంద్రశేఖర్, వ్యాపారవేత్త

"సుమారు వెయ్యి కిలోల పేలోడ్ సామర్థ్యంతో ఈ బోట్​ను తయారు చేశాం. ఇందులో ఒకేసారి పది మందికిపైగా ప్రయాణించవచ్చు. ఇక రెగ్యులర్​ ప్రీమియం పెట్రోల్​తో ఈ హోవర్​క్రాఫ్ట్​​ నడుస్తుంది. మిలటరీ, డిఫెన్స్​, రెస్క్యూ బృందాలు ఈ హోవర్​క్రాఫ్ట్​ను ఉపయోగించుకోవచ్చు."
--మ్యాగ్ రాక్సన్​, కెనడా కంపెనీ ప్రతినిధి

నీటిపై, భూమిపై ప్రయాణించగల హోవర్​క్రాఫ్ట్​ను దేశంలోనే తొలిసారి తయారు చేయడం ఆనందంగా ఉందని అన్నారు సుప్రీత చంద్రశేఖర్. ఈ హోవర్​క్రాఫ్ట్​ నడవాలంటే గంటకు 20 నుంచి 25 లీటర్ల ఇంధనం ఖర్చు అవుతుందని తెలిపారు. త్వరలో 24 సీట్లతో 16 మీటర్ల పొడవైన హోవర్​క్రాఫ్ట్​ తయారు చేయాలని భావిస్తున్నట్లు చెప్పారు.

indias first indigenous hovercraft
చెరువులో హోవర్​క్రాఫ్ట్
indias first indigenous hovercraft
చెరువులో హోవర్​క్రాఫ్ట్

పట్టువిడవని యువఇంజినీర్లు- సొంత పవర్ ప్లాంట్ నిర్మాణం, ప్రభుత్వానికే కరెంట్ అమ్మకం

'మోదీ వల్లే టీమ్​ఇండియా ప్రపంచకప్ ఫైనల్లో ఓడిపోయింది'- రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ ఫైర్

Last Updated : Nov 22, 2023, 5:25 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.