ETV Bharat / bharat

'పీఓకే గురించి ఇంకా ప్లాన్ చేయలేదు.. కానీ త్వరలోనే..'

author img

By

Published : Oct 27, 2021, 8:25 PM IST

పాక్ ఆక్రమిత కశ్మీర్​ను తమ అధీనంలోకి తెచ్చుకునే విషయంపై ప్రస్తుతానికి ఎలాంటి ప్రణాళికలు లేవని భారత వాయుసేన ఉన్నతాధికారి తెలిపారు. కానీ ఏదో ఒకరోజు ఆ ప్రాంతమంతా భారత్ వశమవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

India will have whole of Kashmir someday, says Western Air Command chief on Budgam landing anniversary
'పీఓకే గురించి ఇంకా ప్లాన్ చేయలేదు.. కానీ త్వరలోనే..'

పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్​ను భారత్​ ఏదో ఒక రోజు తన వశం చేసుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు వాయుసేన ఉన్నతాధికారి, వెస్టర్న్ ఎయిర్ కమాండ్ చీఫ్​ ఎయిర్ మార్షల్​ అమిత్ దేవ్​. కానీ ప్రస్తుతానికి పీవోకే గురించి ఎలాంటి ప్రణాళికలు లేవని చెప్పారు. బుద్గాంలో సైన్యం అడుగుపెట్టి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఈ వ్యాఖ్యలు చేశారు.

"1947 అక్టోబర్‌ 27న సైన్యం, వాయుసేన చేపట్టిన ఆపరేషన్ వల్లే కశ్మీర్​కు స్వేచ్ఛ లభించింది. పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లోని ప్రజలను అక్కడి ప్రభుత్వం సరిగ్గా చూడటం లేదు. ఏదో ఒకరోజు పాకిస్థాన్‌ ఆక్రమిక కశ్మీర్‌ కూడా ఈ ప్రాంత కశ్మీర్‌లో చేరుతుందని కచ్చితంగా చెప్పగలను." అని అమిత్ దేవ్ అన్నారు.

పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్​ను భారత్​ ఏదో ఒక రోజు తన వశం చేసుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు వాయుసేన ఉన్నతాధికారి, వెస్టర్న్ ఎయిర్ కమాండ్ చీఫ్​ ఎయిర్ మార్షల్​ అమిత్ దేవ్​. కానీ ప్రస్తుతానికి పీవోకే గురించి ఎలాంటి ప్రణాళికలు లేవని చెప్పారు. బుద్గాంలో సైన్యం అడుగుపెట్టి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఈ వ్యాఖ్యలు చేశారు.

"1947 అక్టోబర్‌ 27న సైన్యం, వాయుసేన చేపట్టిన ఆపరేషన్ వల్లే కశ్మీర్​కు స్వేచ్ఛ లభించింది. పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లోని ప్రజలను అక్కడి ప్రభుత్వం సరిగ్గా చూడటం లేదు. ఏదో ఒకరోజు పాకిస్థాన్‌ ఆక్రమిక కశ్మీర్‌ కూడా ఈ ప్రాంత కశ్మీర్‌లో చేరుతుందని కచ్చితంగా చెప్పగలను." అని అమిత్ దేవ్ అన్నారు.

ఇదీ చదవండి: 'పెగసస్​తో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసే కుట్ర'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.