ETV Bharat / bharat

'శ్రీనగర్​-షార్జా విమానాలకు అనుమతించండి'- పాక్​కు భారత్​ విజ్ఞప్తి

author img

By

Published : Nov 5, 2021, 6:43 AM IST

శ్రీనగర్-షార్జా విమాన సర్వీసు(Srinagar sharjah flight) తమ గగనతలం మీదుగా వెళ్లేందుకు అనుమతించాలని పాకిస్థాన్​ను భారత్​ కోరింది. ఈ మార్గంలో టికెట్లు బుక్ చేసుకున్న సామాన్య ప్రయాణికులను దృష్టిలో పెట్టుకుని ఈ మేరకు అభ్యర్థించింది.

Srinagar-Sharjah flight
శ్రీనగర్​-షార్జా విమాన సర్వీసు

గో ఫస్ట్ విమానయాన సంస్థకు(Go first airline) చెందిన శ్రీనగర్​-షార్జా విమాన సర్వీసు(Srinagar sharjah flight) తమ గగనతలం మీదుగా వెళ్లేందుకు అనుమతించాలని పాకిస్థాన్​ను భారత్ కోరింది. ఈ మార్గంలో టిక్కెట్లు బుక్ చేసుకున్న ప్రజలను దృష్టిలో పెట్టుకుని ఈ మేరకు అభ్యర్థించినట్లు అధికారులు తెలిపారు.

గో ఫస్ట్​ విమాన సర్వీసు(Srinagar sharjah flight) తమ గగనతలం మీదుగా వెళ్లేందుకు పాక్​ మంగళవారం అనుమతి నిరాకరించింది. దీంతో ఈ విమానం చుట్టూ తిరిగి గుజరాత్​ మీదుగా వెళ్లాల్సి వచ్చిందని, దీనికి అదనంగా 40 నిమిషాల సమయం పట్టిందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

"అక్టోబర్ 23, 24, 26, 28 తేదీల్లో శ్రీనగర్-షార్జా సర్వీసును(Srinagar sharjah flight) తమ గగనతలం మీదుగా వెళ్లేందుకు పాకిస్థాన్​ అనుమతించింది. అక్టోబరు 31 నుంచి నవంబరు 30 వరకు అనుమతులను పాక్​ నిలిపివేసింది. ఈ విషయాన్ని పాకిస్థాన్​తో దౌత్యమార్గాల ద్వారా చర్చకు తీసుకువచ్చాం. ఈ మార్గంలో టికెట్లు బుక్ చేసుకున్న సామాన్య ప్రజలను దృష్టిలో ఉంచుకుని తమ గగనతలం మీదుగా వెళ్లేందుకు అనుమతి మంజూరు చేయాలని అభ్యర్థించాం."

-ప్రభుత్వ వర్గాలు.

జమ్ముకశ్మీర్ పర్యటనలో భాగంగా.. షార్జా- శ్రీనగర్​ మధ్య విమాన సేవలను(Srinagar sharjah flight) కేంద్ర హోంమంత్రి అమిత్ షా అక్టోబరు 23న ప్రారంభించారు. ప్రారంభించిన వారం రోజులకే పాక్ ఇలాంటి ఆంక్షలు విధించటం చర్చనీయాంశంగా మారింది. ఇదే విషయంపై కశ్మీర్ మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా ట్వీట్​ చేశారు. పాక్ చర్య దురదృష్టకరమైందని పేర్కొన్నారు. 2009-10లోనూ పాక్​ ఇదే రీతిలో శ్రీనగర్​-దుబాయ్ విమానాన్ని అడ్డుకుందని గుర్తు చేశారు.

మరోవైపు.. గో ఫస్ట్ విమాన సర్వీసును తమ గగనతలం మీదుగా వెళ్లేందుకు నిరాకరించిన విషయాన్ని పాక్​ ధ్రువీకరించింది. ఈ మేరకు ఆ దేశ విదేశాంగ శాఖ ప్రతినిధి ఇఫ్తియాకర్ అహ్మద్​... ఇస్లామాబాద్​లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. దీనికి అనేక కారణాలు ముడివడి ఉన్నాయని పేర్కొన్నారు.

ఇవీ చూడండి:

బంగాల్​ మంత్రి సుబ్రతా ముఖర్జీ మృతి.. దీదీ విచారం

పాక్ సైనికులతో కలిసి భారత జవాన్ల దీపావళి వేడుకలు

గో ఫస్ట్ విమానయాన సంస్థకు(Go first airline) చెందిన శ్రీనగర్​-షార్జా విమాన సర్వీసు(Srinagar sharjah flight) తమ గగనతలం మీదుగా వెళ్లేందుకు అనుమతించాలని పాకిస్థాన్​ను భారత్ కోరింది. ఈ మార్గంలో టిక్కెట్లు బుక్ చేసుకున్న ప్రజలను దృష్టిలో పెట్టుకుని ఈ మేరకు అభ్యర్థించినట్లు అధికారులు తెలిపారు.

గో ఫస్ట్​ విమాన సర్వీసు(Srinagar sharjah flight) తమ గగనతలం మీదుగా వెళ్లేందుకు పాక్​ మంగళవారం అనుమతి నిరాకరించింది. దీంతో ఈ విమానం చుట్టూ తిరిగి గుజరాత్​ మీదుగా వెళ్లాల్సి వచ్చిందని, దీనికి అదనంగా 40 నిమిషాల సమయం పట్టిందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

"అక్టోబర్ 23, 24, 26, 28 తేదీల్లో శ్రీనగర్-షార్జా సర్వీసును(Srinagar sharjah flight) తమ గగనతలం మీదుగా వెళ్లేందుకు పాకిస్థాన్​ అనుమతించింది. అక్టోబరు 31 నుంచి నవంబరు 30 వరకు అనుమతులను పాక్​ నిలిపివేసింది. ఈ విషయాన్ని పాకిస్థాన్​తో దౌత్యమార్గాల ద్వారా చర్చకు తీసుకువచ్చాం. ఈ మార్గంలో టికెట్లు బుక్ చేసుకున్న సామాన్య ప్రజలను దృష్టిలో ఉంచుకుని తమ గగనతలం మీదుగా వెళ్లేందుకు అనుమతి మంజూరు చేయాలని అభ్యర్థించాం."

-ప్రభుత్వ వర్గాలు.

జమ్ముకశ్మీర్ పర్యటనలో భాగంగా.. షార్జా- శ్రీనగర్​ మధ్య విమాన సేవలను(Srinagar sharjah flight) కేంద్ర హోంమంత్రి అమిత్ షా అక్టోబరు 23న ప్రారంభించారు. ప్రారంభించిన వారం రోజులకే పాక్ ఇలాంటి ఆంక్షలు విధించటం చర్చనీయాంశంగా మారింది. ఇదే విషయంపై కశ్మీర్ మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా ట్వీట్​ చేశారు. పాక్ చర్య దురదృష్టకరమైందని పేర్కొన్నారు. 2009-10లోనూ పాక్​ ఇదే రీతిలో శ్రీనగర్​-దుబాయ్ విమానాన్ని అడ్డుకుందని గుర్తు చేశారు.

మరోవైపు.. గో ఫస్ట్ విమాన సర్వీసును తమ గగనతలం మీదుగా వెళ్లేందుకు నిరాకరించిన విషయాన్ని పాక్​ ధ్రువీకరించింది. ఈ మేరకు ఆ దేశ విదేశాంగ శాఖ ప్రతినిధి ఇఫ్తియాకర్ అహ్మద్​... ఇస్లామాబాద్​లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. దీనికి అనేక కారణాలు ముడివడి ఉన్నాయని పేర్కొన్నారు.

ఇవీ చూడండి:

బంగాల్​ మంత్రి సుబ్రతా ముఖర్జీ మృతి.. దీదీ విచారం

పాక్ సైనికులతో కలిసి భారత జవాన్ల దీపావళి వేడుకలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.