ETV Bharat / bharat

ట్విట్టర్​లో బూతు బొమ్మలు- వారిపై 10 రోజుల్లో చర్యలు!

author img

By

Published : Jun 30, 2021, 7:19 PM IST

Updated : Jun 30, 2021, 10:49 PM IST

ట్విట్టర్​ వేదికగా పలు ఖాతాదారులు... అశ్లీల కంటెంట్​ను షేర్​ చేస్తూ ఉండటంపై జాతీయ మహిళా హక్కుల సంఘం(ఎన్​సీడబ్ల్యూ) సుమోటోగా చర్యలు చేపట్టింది. ఇలాంటి కంటెంట్​ను వారంలోపు పూర్తిగా తొలగించాలని ట్విట్టర్​ను ఆదేశించింది. ఇందుకు సంబంధించి తీసుకున్న చర్యలు పదిరోజుల్లోగా తమకు వివరించాలని తెలిపింది.

pornographic content in twitter
ట్విట్టర్​పై ఎన్​సీడబ్ల్యూ సుమోటో

అశ్లీల కంటెంట్​ను వారంలోపు పూర్తిగా తొలగించాలని ట్విట్టర్​​ను జాతీయ మహిళా సంఘం(ఎన్​సీడబ్ల్యూ)​ ఆదేశించింది. ఈ మేరకు ట్విట్టర్​ మేనేజింగ్ డైరెక్టర్​కు ఎన్​సీడబ్ల్యూ ఛైర్మన్​ రేఖా శర్మ లేఖ రాశారు. ఇందుకు సంబంధించి తీసుకున్న చర్యలను 10 రోజుల్లోగా తమకు వివరించాలని తెలిపారు. ఇదే విషయమై.. దర్యాప్తు చేపట్టి, చట్టప్రకారం తగిన చర్యలు తీసుకోవాలని దిల్లీ పోలీస్​ కమిషనర్​కూ ఆమె లేఖ రాశారు.

"ట్విట్టర్​లో అశ్లీల కంటెంట్ వ్యవహారాన్ని ఎన్​సీడబ్ల్యూ సుమోటోగా తీసుకుంది. ట్విట్టర్​లో ఇలాంటి వాటిని గుర్తించి చర్యలు తీసుకోవాలని ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్​కు ఎన్​సీడబ్ల్యూ ఛైర్మన్​ రేఖా శర్మ లేఖ రాశారు. అశ్లీల కంటెంట్​ను షేర్​ చేసే ట్విట్టర్ ఖాతాల వివరాలను ఆ సంస్థ దృష్టికి ఎన్​సీడబ్ల్యూ తీసుకువెళ్లింది. వాటిని వారంలోగా తొలగించాలని ఆదేశించింది. ఇందుకు సంబంధించి తీసుకున్న చర్యలు పదిరోజుల్లోగా వివరించాలని తెలిపింది.

- ఎన్​సీడబ్ల్యూ

అంతకుముందు ఇదే విషయంపై అందిన ఫిర్యాదును ట్విట్టర్​ దృష్టికి తీసుకువెళ్లినప్పటికీ ఆ సంస్థ ఎలాంటి చర్యలు చేపట్టలేదని ఎన్​సీడబ్ల్యూ తెలిపింది. అలాంటి కంటెంట్​ను నిషేధించకుండా ఉంచడం ద్వారా.. భారత చట్టాలనే కాకుండా, తమ సంస్థ విధానాలను కూడా ట్విట్టర్​ ఉల్లంఘించిందని విమర్శించింది.

చిన్నారులపై లైంగిక వేధింపుల వీడియోను పోస్ట్​ చేసేందుకు అనుమతించిందన్న అభియోగాలతో దిల్లీ పోలీసులు.. ట్విట్టర్​పై కేసు నమోదు చేసిన మరుసటి రోజే ఎన్​సీడబ్ల్యూ​ ఈ చర్యలు చేపట్టటం గమనార్హం. జాతీయ బాలల హక్కుల కమిషన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు దిల్లీ పోలీసులు ట్విట్టర్​పై ఈ ఎఫ్​ఐఆర్​ నమోదు చేశారు. డార్క్​ వెబ్​కు సంబంధించి ఓ టూల్​కిట్​ కూడా ట్విట్టర్​లో ఉన్నట్లు మే 29 తేదీనే దిల్లీ పోలీసులకు రాసిన లేఖలో జాతీయ బాలల హక్కుల కమిషన్​ పేర్కొంది. ఈ అంశంపై చర్యలు తీసుకోవాలని తెలిపింది.

ఇదీ చూడండి: 'ఖాతాల నిలిపివేతపై ట్విట్టర్​ వివరణ ఇవ్వాలి'

ఇదీ చూడండి: ట్విట్టర్​కు మరిన్ని చిక్కులు- ఎండీపై కేసు

అశ్లీల కంటెంట్​ను వారంలోపు పూర్తిగా తొలగించాలని ట్విట్టర్​​ను జాతీయ మహిళా సంఘం(ఎన్​సీడబ్ల్యూ)​ ఆదేశించింది. ఈ మేరకు ట్విట్టర్​ మేనేజింగ్ డైరెక్టర్​కు ఎన్​సీడబ్ల్యూ ఛైర్మన్​ రేఖా శర్మ లేఖ రాశారు. ఇందుకు సంబంధించి తీసుకున్న చర్యలను 10 రోజుల్లోగా తమకు వివరించాలని తెలిపారు. ఇదే విషయమై.. దర్యాప్తు చేపట్టి, చట్టప్రకారం తగిన చర్యలు తీసుకోవాలని దిల్లీ పోలీస్​ కమిషనర్​కూ ఆమె లేఖ రాశారు.

"ట్విట్టర్​లో అశ్లీల కంటెంట్ వ్యవహారాన్ని ఎన్​సీడబ్ల్యూ సుమోటోగా తీసుకుంది. ట్విట్టర్​లో ఇలాంటి వాటిని గుర్తించి చర్యలు తీసుకోవాలని ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్​కు ఎన్​సీడబ్ల్యూ ఛైర్మన్​ రేఖా శర్మ లేఖ రాశారు. అశ్లీల కంటెంట్​ను షేర్​ చేసే ట్విట్టర్ ఖాతాల వివరాలను ఆ సంస్థ దృష్టికి ఎన్​సీడబ్ల్యూ తీసుకువెళ్లింది. వాటిని వారంలోగా తొలగించాలని ఆదేశించింది. ఇందుకు సంబంధించి తీసుకున్న చర్యలు పదిరోజుల్లోగా వివరించాలని తెలిపింది.

- ఎన్​సీడబ్ల్యూ

అంతకుముందు ఇదే విషయంపై అందిన ఫిర్యాదును ట్విట్టర్​ దృష్టికి తీసుకువెళ్లినప్పటికీ ఆ సంస్థ ఎలాంటి చర్యలు చేపట్టలేదని ఎన్​సీడబ్ల్యూ తెలిపింది. అలాంటి కంటెంట్​ను నిషేధించకుండా ఉంచడం ద్వారా.. భారత చట్టాలనే కాకుండా, తమ సంస్థ విధానాలను కూడా ట్విట్టర్​ ఉల్లంఘించిందని విమర్శించింది.

చిన్నారులపై లైంగిక వేధింపుల వీడియోను పోస్ట్​ చేసేందుకు అనుమతించిందన్న అభియోగాలతో దిల్లీ పోలీసులు.. ట్విట్టర్​పై కేసు నమోదు చేసిన మరుసటి రోజే ఎన్​సీడబ్ల్యూ​ ఈ చర్యలు చేపట్టటం గమనార్హం. జాతీయ బాలల హక్కుల కమిషన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు దిల్లీ పోలీసులు ట్విట్టర్​పై ఈ ఎఫ్​ఐఆర్​ నమోదు చేశారు. డార్క్​ వెబ్​కు సంబంధించి ఓ టూల్​కిట్​ కూడా ట్విట్టర్​లో ఉన్నట్లు మే 29 తేదీనే దిల్లీ పోలీసులకు రాసిన లేఖలో జాతీయ బాలల హక్కుల కమిషన్​ పేర్కొంది. ఈ అంశంపై చర్యలు తీసుకోవాలని తెలిపింది.

ఇదీ చూడండి: 'ఖాతాల నిలిపివేతపై ట్విట్టర్​ వివరణ ఇవ్వాలి'

ఇదీ చూడండి: ట్విట్టర్​కు మరిన్ని చిక్కులు- ఎండీపై కేసు

Last Updated : Jun 30, 2021, 10:49 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.