ETV Bharat / bharat

ఇసుక మాఫియాను అడ్డుకునేందుకు యత్నించిన హోంగార్డును ట్రాక్టర్​తో ఢీ కొట్టి హత్య

author img

By ETV Bharat Telugu Team

Published : Nov 1, 2023, 4:33 PM IST

Updated : Nov 1, 2023, 5:10 PM IST

Home Guard Killed By Sand Mafia : బిహార్​లో ఇసుక మాఫియా మరోసారి రెచ్చిపోయింది. ఇసుక అక్రమ రవాణాను అడ్డుకునేందుకు యత్నించిన ఓ హోంగార్డును హత్య చేశారు దుండగులు.

Home Guard Killed By Sand Mafia
Home Guard Killed By Sand Mafia

Home Guard Killed By Sand Mafia : ఇసుక అక్రమ రవాణాను అడ్డుకునేందుకు యత్నించిన ఓ హోంగార్డును హత్య చేశారు దుండగులు. అతడిపై నుంచి ట్రాక్టర్​ను పోనిచ్చారు. ఈ ఘటన బిహార్​లోని ఔరంగాబాద్​ జిల్లాలో జరిగింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు... నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

ఇదీ జరిగింది..
మదన్​పుర్ పోలీస్ స్టేషన్​ పరిధిలోని చిల్మి కోయిరి బిఘా గ్రామానికి చెందిన రామ్​రాజ్​ మహతో.. ఎన్​టీపీసీ ఖైరా పోలీస్ స్టేషన్​లో హోంగార్డుగా విధులు నిర్వర్తిస్తున్నారు. అయితే, మంగళవారం అర్ధరాత్రి ఔరంగాబాద్​ సమీపంలోని బఢేమ్​ పోలీస్ స్టేషన్​ పరిధిలో ఇసుక అక్రమ రవాణా జరుగుతున్నట్లు సమాచారం అందింది. దీంతో ఏఎస్​ఐ రాజేశ్​ కుమార్​.. తన సిబ్బందితో కలిసి కాంకేర్​ రోడ్డుకు వెళ్లారు. వీరిని గమనించిన దుండగులు.. అక్కడి నుంచి పారిపోయేందుకు యత్నించగా పోలీసులు వెంబడించారు.

ఈ క్రమంలోనే ట్రాక్టర్​.. సమీపంలోని ఎన్​టీపీసీ ఖైరా పోలీస్ స్టేషన్​ పరిధిలోకి వెళ్లడం వల్ల అక్కడి పోలీసుల సహాయాన్ని కోరారు. వెంటనే స్పందించిన ఎన్​టీపీసీ ఖైరా పోలీసులు.. మాధే గ్రామం వద్ద దుండగులను చుట్టుముట్టారు. అయితే, రోడ్డుకు అడ్డంగా నిలబడిన హోంగార్డు రామ్​రాజ్​ మహతోను దుండగులు ట్రాక్టర్​తో ఢీ కొట్టి అతడిపై నుంచి వెళ్లిపోయారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు.. అతడిని ఎన్​టీపీసీ ఆస్పత్రికి తరలించారు. రామ్​రాజ్​ను పరీక్షించిన వైద్యులు.. అప్పటికే మృతిచెందినట్లు ధ్రువీకరించారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితులను పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టినట్లు తెలిపారు.

Home Guard Killed By Sand Mafia
ఘటనా స్థలాన్ని పరిశీలిస్తున్న పోలీసులు

తప్పించుకునేందుకు యత్నించిన నిందితులపై పోలీసుల ఎన్​కౌంటర్
పోలీసుల కస్టడీ నుంచి తుపాకీతో పారిపోయేందుకు యత్నించారు ఇద్దరు నిందితులు. దీంతో వారిపై కాల్పులు జరిపారు పోలీసులు. ఈ ఘటన ఉత్తర్​ప్రదేశ్​లోని మహోబాలో జరిగింది. ఈ ఘటనలో ఎస్​ఐ సహా ఇద్దరు పోలీసులు గాయపడ్డారు. పోలీసుల ఎదురుకాల్పుల్లో ఇద్దరు నిందితుల కాళ్లకు గాయాలయ్యాయి.

ఇదీ జరిగింది
అఫత్​పుర పరిధిలోని పన్​వాఢీ పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం 13 ఏళ్ల బాలిక రోడ్డు ప్రమాదానికి గురై మరణించింది. దీనిపై ఆగ్రహించిన స్థానికులు రోడ్డును కూర్చుని ఆందోళన చేపట్టారు. అడ్డుకునేందుకు వెళ్లిన పోలీసులపై దాడి చేశారు. దీంతో ఐదుగురిపై కేసు నమోదు చేసిన పోలీసులు.. కస్టడీకి తరలించారు. నిందితులను వైద్య పరీక్షల కోసం ఆస్పత్రికి తరలించారు. ఈక్రమంలోనే బాత్​రూమ్​కు వెళ్లి వస్తామని నమ్మించిన ఇద్దరు నిందితులు.. పోలీసుల తుపాకీ తీసుకుని పారిపోయారు. వారిని పట్టుకునేందుకు యత్నించిన పోలీసులపై కాల్పులు జరిపారు. దీంతో ఎదురుకాల్పులకు దిగారు పోలీసులు. ఈ ఘటనలో ఎస్​ఐ సురేంద్ర, కానిస్టేబుల్​ అంకిత్​ సింగ్​, మిథున్​కు గాయాలయ్యాయి. ప్రస్తుతం వీరు బందాలోని జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

Home Guard Killed By Sand Mafia
గాయపడ్డ పోలీసులు

Scorpio Hit And Run in Bangalore : కేసు విత్​డ్రాకు ఒప్పుకోలేదని కారుతో ఢీకొట్టి హత్య.. ప్రమాదంగా చిత్రీకరించాలని చూసి..

Uttar Pradesh Road Accident : చెట్టును ఢీకొట్టిన కారు.. ఒకే కుటుంబంలో ఐదుగురు దుర్మరణం

Home Guard Killed By Sand Mafia : ఇసుక అక్రమ రవాణాను అడ్డుకునేందుకు యత్నించిన ఓ హోంగార్డును హత్య చేశారు దుండగులు. అతడిపై నుంచి ట్రాక్టర్​ను పోనిచ్చారు. ఈ ఘటన బిహార్​లోని ఔరంగాబాద్​ జిల్లాలో జరిగింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు... నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

ఇదీ జరిగింది..
మదన్​పుర్ పోలీస్ స్టేషన్​ పరిధిలోని చిల్మి కోయిరి బిఘా గ్రామానికి చెందిన రామ్​రాజ్​ మహతో.. ఎన్​టీపీసీ ఖైరా పోలీస్ స్టేషన్​లో హోంగార్డుగా విధులు నిర్వర్తిస్తున్నారు. అయితే, మంగళవారం అర్ధరాత్రి ఔరంగాబాద్​ సమీపంలోని బఢేమ్​ పోలీస్ స్టేషన్​ పరిధిలో ఇసుక అక్రమ రవాణా జరుగుతున్నట్లు సమాచారం అందింది. దీంతో ఏఎస్​ఐ రాజేశ్​ కుమార్​.. తన సిబ్బందితో కలిసి కాంకేర్​ రోడ్డుకు వెళ్లారు. వీరిని గమనించిన దుండగులు.. అక్కడి నుంచి పారిపోయేందుకు యత్నించగా పోలీసులు వెంబడించారు.

ఈ క్రమంలోనే ట్రాక్టర్​.. సమీపంలోని ఎన్​టీపీసీ ఖైరా పోలీస్ స్టేషన్​ పరిధిలోకి వెళ్లడం వల్ల అక్కడి పోలీసుల సహాయాన్ని కోరారు. వెంటనే స్పందించిన ఎన్​టీపీసీ ఖైరా పోలీసులు.. మాధే గ్రామం వద్ద దుండగులను చుట్టుముట్టారు. అయితే, రోడ్డుకు అడ్డంగా నిలబడిన హోంగార్డు రామ్​రాజ్​ మహతోను దుండగులు ట్రాక్టర్​తో ఢీ కొట్టి అతడిపై నుంచి వెళ్లిపోయారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు.. అతడిని ఎన్​టీపీసీ ఆస్పత్రికి తరలించారు. రామ్​రాజ్​ను పరీక్షించిన వైద్యులు.. అప్పటికే మృతిచెందినట్లు ధ్రువీకరించారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితులను పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టినట్లు తెలిపారు.

Home Guard Killed By Sand Mafia
ఘటనా స్థలాన్ని పరిశీలిస్తున్న పోలీసులు

తప్పించుకునేందుకు యత్నించిన నిందితులపై పోలీసుల ఎన్​కౌంటర్
పోలీసుల కస్టడీ నుంచి తుపాకీతో పారిపోయేందుకు యత్నించారు ఇద్దరు నిందితులు. దీంతో వారిపై కాల్పులు జరిపారు పోలీసులు. ఈ ఘటన ఉత్తర్​ప్రదేశ్​లోని మహోబాలో జరిగింది. ఈ ఘటనలో ఎస్​ఐ సహా ఇద్దరు పోలీసులు గాయపడ్డారు. పోలీసుల ఎదురుకాల్పుల్లో ఇద్దరు నిందితుల కాళ్లకు గాయాలయ్యాయి.

ఇదీ జరిగింది
అఫత్​పుర పరిధిలోని పన్​వాఢీ పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం 13 ఏళ్ల బాలిక రోడ్డు ప్రమాదానికి గురై మరణించింది. దీనిపై ఆగ్రహించిన స్థానికులు రోడ్డును కూర్చుని ఆందోళన చేపట్టారు. అడ్డుకునేందుకు వెళ్లిన పోలీసులపై దాడి చేశారు. దీంతో ఐదుగురిపై కేసు నమోదు చేసిన పోలీసులు.. కస్టడీకి తరలించారు. నిందితులను వైద్య పరీక్షల కోసం ఆస్పత్రికి తరలించారు. ఈక్రమంలోనే బాత్​రూమ్​కు వెళ్లి వస్తామని నమ్మించిన ఇద్దరు నిందితులు.. పోలీసుల తుపాకీ తీసుకుని పారిపోయారు. వారిని పట్టుకునేందుకు యత్నించిన పోలీసులపై కాల్పులు జరిపారు. దీంతో ఎదురుకాల్పులకు దిగారు పోలీసులు. ఈ ఘటనలో ఎస్​ఐ సురేంద్ర, కానిస్టేబుల్​ అంకిత్​ సింగ్​, మిథున్​కు గాయాలయ్యాయి. ప్రస్తుతం వీరు బందాలోని జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

Home Guard Killed By Sand Mafia
గాయపడ్డ పోలీసులు

Scorpio Hit And Run in Bangalore : కేసు విత్​డ్రాకు ఒప్పుకోలేదని కారుతో ఢీకొట్టి హత్య.. ప్రమాదంగా చిత్రీకరించాలని చూసి..

Uttar Pradesh Road Accident : చెట్టును ఢీకొట్టిన కారు.. ఒకే కుటుంబంలో ఐదుగురు దుర్మరణం

Last Updated : Nov 1, 2023, 5:10 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.