గుజరాత్లో ఐదో తరగతి పాసైన ఓ భాజపా ఎమ్మెల్యే.. కరోనా రోగికి రెమ్డెసివిర్ ఇంజెక్షన్ ఇవ్వటం వివాదాస్పదమైంది. ఇందుకు సంబంధించిన వీడియో.. సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. సూరత్లోని సర్తానా ప్రాంతంలో భాజపా నేతలు నెలకొల్పిన ఓ ఐసోలేషన్ కేంద్రంలో కరోనా రోగికి ఇంజెక్షన్ వేస్తున్నట్లు ఆ వీడియోలో కనిపించారు కామ్రాజ్ నియోజకవర్గ ఎమ్మెల్యే వీడీ ఝలవాడియా. అయితే.. తాను ఇంజెక్షన్ వేయలేదని మిక్స్ మాత్రమే చేశానని ఎమ్మెల్యే అన్నారు.
"సర్తానాలోని ఈ ఐసోలేషన్ కేంద్రంలో 40 రోజులుగా నేను పని చేస్తున్నాను. రోగికి రెమ్డెసివిర్ ఇంజెక్షన్ ఇచ్చి హాని తలపెట్టాలన్న ఉద్దేశం నాకు లేదు. నేను ఇంజెక్షన్ను మిక్స్ మాత్రమే చేశాను. నేను ఎవరికీ టీకా వేయలేదు. ఆ సమయంలో నా పక్కన 10 నుంచి 15 మంది వైద్యులు ఉన్నారు. ఇక్కడ చికిత్స పొందినవారిలో చాలా మందికి వ్యాధి నయమైంది."
-వీడీ ఝలవాడియా, ఎమ్మెల్యే
డాక్టర్ డిగ్రీ లేకపోయినా.. వైద్యునిలా ఝలవాడియా వ్యవహరించారని గ్రెస్ నేత సురేష్ సోనావానే విమర్శించారు. రోగులకు ఇంజెక్షన్ వేస్తూ ఫొటో సెషన్ పెట్టుకున్నారని ఎద్దేవా చేశారు. ఈ విధంగా ఝలవాడియా.. చీప్ పబ్లిసిటీ కోసం యత్నించారని దుయ్యబట్టారు.
ఇదీ చూడండి: గుర్రానికి అంత్యక్రియలు- వేల మంది హాజరు