ETV Bharat / bharat

బంగాల్​ ఎన్నికల అభ్యర్థులపై కరోనా పంజా

దేశంలో కరోనా మహమ్మారి మరింత ఉగ్రరూపం దాల్చుతోంది. బంగాల్​ ఎన్నికల్లో బరిలోకి దిగిన అభ్యర్థుల్లో ఐదుగురికి వైరస్​ సోకినట్టు తేలింది. ఆయా బాధితులంతా తక్షణమే ప్రచారం ఆపేసి, స్వీయ నిర్బంధంలోకి వెళ్లాలని ఎన్నికల సంఘం సూచించింది.

author img

By

Published : Apr 16, 2021, 6:44 PM IST

Five poll contestants test positive for Covid-19
బంగాల్ ఎన్నికల అభ్యర్థులకు కొవిడ్​ పాజిటివ్​

బంగాల్​లో ఎన్నికల వేళ.. కరోనా కలకలం సృష్టిస్తోంది. ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థుల్లో ఐదుగురికి కొవిడ్​ పాజిటివ్​గా నిర్ధరణ అయినట్టు ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. బాధితుల్లో తృణమూల్​ కాంగ్రెస్(టీఎంసీ)​ అభ్యర్థులు ముగ్గురు కాగా.. భారతీయ జనతా పార్టీ(భాజపా), రివల్యూషన్​ సోషలిస్ట్​ పార్టీ(ఆర్​ఎస్​పీ)ల నుంచి ఒక్కొక్కరు చొప్పున ఉన్నట్టు తెలిపింది.

ఆ అభ్యర్థులు ఎవరంటే?

  • మహమ్మద్​ గులామ్​ రబ్బానీ - టీఎంసీ - గోల్​పోఖర్​ అసెంబ్లీ నియోజకవర్గం
  • కల్పనా కిస్కూ - టీఎంసీ - తపన్​ శాసనసభ నియోజకవర్గం
  • డాక్టర్​ ప్రదీప్​ కుమార్​ బర్మా - టీఎంసీ - జల్​పాయ్​ గురి అసెంబ్లీ స్థానం
  • ఆనందమయ్​ బర్మాన్​(38) - భాజపా - మాటిగరా-నక్సల్​బారి సీటు
  • ప్రదీప్​ కుమార్​ నంది(73) - ఆర్​ఎస్​పీ - జంగీపుర్​ నియోజకవర్గం

వైరస్​ బారినపడిన అభ్యర్థులందరూ తక్షణమే ఎన్నికల ప్రచారం నిలిపివేయాలని ఆ రాష్ట్ర ఎన్నికల సంఘం సూచించింది. ఆయా బాధితులంతా స్వీయ నిర్బంధంలోకి వెళ్లాలని, వ్యాధి తీవ్రతను బట్టి ఆస్పత్రిలో చేరాలని స్పష్టం చేసింది.

అంతకుముందు.. ముర్షిదాబాద్​ జిల్లాలోని శంషేర్​గంజ్​ అసెంబ్లీ కాంగ్రెస్​ అభ్యర్థి రెజౌల్​ హాక్​ కొవిడ్​ కారణంగా.. గురువారం తెల్లవారుజామున ఆస్పత్రిలో ప్రాణాలు కోల్పోయారు.

ఇదీ చదవండి: మెడికల్ ఆక్సిజన్​ ఉత్పత్తిని పెంచాలి: మోదీ

బంగాల్​లో ఎన్నికల వేళ.. కరోనా కలకలం సృష్టిస్తోంది. ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థుల్లో ఐదుగురికి కొవిడ్​ పాజిటివ్​గా నిర్ధరణ అయినట్టు ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. బాధితుల్లో తృణమూల్​ కాంగ్రెస్(టీఎంసీ)​ అభ్యర్థులు ముగ్గురు కాగా.. భారతీయ జనతా పార్టీ(భాజపా), రివల్యూషన్​ సోషలిస్ట్​ పార్టీ(ఆర్​ఎస్​పీ)ల నుంచి ఒక్కొక్కరు చొప్పున ఉన్నట్టు తెలిపింది.

ఆ అభ్యర్థులు ఎవరంటే?

  • మహమ్మద్​ గులామ్​ రబ్బానీ - టీఎంసీ - గోల్​పోఖర్​ అసెంబ్లీ నియోజకవర్గం
  • కల్పనా కిస్కూ - టీఎంసీ - తపన్​ శాసనసభ నియోజకవర్గం
  • డాక్టర్​ ప్రదీప్​ కుమార్​ బర్మా - టీఎంసీ - జల్​పాయ్​ గురి అసెంబ్లీ స్థానం
  • ఆనందమయ్​ బర్మాన్​(38) - భాజపా - మాటిగరా-నక్సల్​బారి సీటు
  • ప్రదీప్​ కుమార్​ నంది(73) - ఆర్​ఎస్​పీ - జంగీపుర్​ నియోజకవర్గం

వైరస్​ బారినపడిన అభ్యర్థులందరూ తక్షణమే ఎన్నికల ప్రచారం నిలిపివేయాలని ఆ రాష్ట్ర ఎన్నికల సంఘం సూచించింది. ఆయా బాధితులంతా స్వీయ నిర్బంధంలోకి వెళ్లాలని, వ్యాధి తీవ్రతను బట్టి ఆస్పత్రిలో చేరాలని స్పష్టం చేసింది.

అంతకుముందు.. ముర్షిదాబాద్​ జిల్లాలోని శంషేర్​గంజ్​ అసెంబ్లీ కాంగ్రెస్​ అభ్యర్థి రెజౌల్​ హాక్​ కొవిడ్​ కారణంగా.. గురువారం తెల్లవారుజామున ఆస్పత్రిలో ప్రాణాలు కోల్పోయారు.

ఇదీ చదవండి: మెడికల్ ఆక్సిజన్​ ఉత్పత్తిని పెంచాలి: మోదీ

For All Latest Updates

TAGGED:

Bengal CEO
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.