ETV Bharat / bharat

గాఢనిద్రలో ఉండగా 3సార్లు భూప్రకంపనలు.. వీధుల్లోకి పరుగులు తీసిన ప్రజలు!

author img

By

Published : Jul 21, 2023, 6:37 AM IST

Updated : Jul 21, 2023, 10:30 AM IST

Earthquake In Jaipur : రాజస్థాన్​ను మూడు స్పల్పంగా భూకంపాలు సంభవించాయి. జైపుర్​లో శుక్రవారం తెల్లవారుజామున భూప్రకంపనలు వచ్చాయి. గాఢనిద్రలో ఉండగా భూమి కంపించడం వల్ల.. భయంతో ప్రజలు వీధుల్లోకి పరుగులు తీశారు.

earth quake in jaipur
earth quake in jaipur

Earthquake In Jaipur : రాజస్థాన్‌ రాజధాని జైపుర్​లో శుక్రవారం తెల్లవారుజామున స్వల్ప భూకంపం సంభవించింది. దీంతో ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. . ఉదయం 4 గంటల సమయంలో తొలి భూకంపం సంభవించింది. రిక్టర్‌ స్కేల్‌పై దీని తీవ్రత 4.4 గా నమోదైంది. ఆ తరువాత 20 నిమిషాలకు 3.1 తీవ్రతతో మరో భూకంపం వచ్చింది. మరో 5 నిమిషాల వ్యవధిలో 3.4 తీవ్రతతో మూడో భూకంపం నమోదైంది. జైపుర్‌లో 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు నేషనల్‌ సిస్మాలజీ సెంటర్‌ తెలిపింది.

  • Another earthquake of Magnitude 3.4 strikes Jaipur, Rajasthan: National Center for Seismology

    This is the 3rd earthquake that has struck Jaipur in an hour pic.twitter.com/zUoHX4Vwcz

    — ANI (@ANI) July 20, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

Earthquake Today Jaipur : గాఢనిద్రలో ఉన్నప్పుడు భూమి ఒక్కసారిగా కంపించడం వల్ల ప్రజలంతా ఏం జరుగుతుందో తెలియక భయాందోళనకు గురయ్యారు. కొంతమంది వీధుల్లోకి పరుగులు తీశారు. అయితే, ప్రస్తుతానికి ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం సంభవించలేదని సమాచారం. రాజస్థాన్‌ మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజె ఈ భూకంపం గురించి ట్విట్టర్‌ వేదికగా స్పందించారు. జైపుర్‌తో సహా రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలలో సైతం భూకంపం సంభవించినట్లు పేర్కొన్నారు. 'గంటలో మూడు సార్లు భూప్రకంపనలు వచ్చాయి. నా కుటుంబం మొత్తం నిద్రలోంచి లేచాం. ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు' అని​ స్థానికుడు వికాస్ తెలిపాడు.

Earthquake In Manipur : గురువారం తెల్లవారుజామున ఈశాన్య రాష్ట్రాలైన మిజోరాం, మణిపుర్​లో కూడా భూకంపం సంభవించింది. మిజోరాంలోని నొగోపాలో సైతం 3.6 తీవ్రతతో భూకంపం సంభవించింది. మణిపుర్​లోని ఉఖ్రుల్లో 3.5 తీవ్రతతో భూకంపం వచ్చినట్లు నేషనల్​ సిస్మాలజీ సెంటర్​ తెలిపింది.

Earthquake In Delhi : గత నెలలో దిల్లీ సహా ఉత్తరాదిలో స్వల్ప భూకంపం సంభవించింది. జమ్ముకశ్మీర్​లోని కిష్ట్వార్​కు 8 కిలోమీటర్ల దూరంలో.. 6 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం అధికారులు తెలిపారు. డోడ జిల్లాలో రిక్టర్​ స్కేల్​పై 5.4 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు నేషనల్​ సెంటర్​ ఫర్​ సిస్మోలజీ విభాగం అధికారులు వెల్లడించారు. దిల్లీ, హిమాచల్​ప్రదేశ్, పంజాబ్​, ఛండీగఢ్ పరిసర ప్రాంతాల్లో భూకంప ప్రభావం ఉన్నట్లు అధికారులు వివరించారు. దీంతో ఇళ్లలోని ప్రజలు బయటకు పరుగెత్తారు. శ్రీనగర్​లో స్కూల్​లోని పిల్లలు, దుకాణాల్లో ప్రజలు భయంతో బయటకు పరిగెత్తారని.. స్థానికులు తెలిపారు. భకంప ధాటికి డోడా జిల్లాలోని ఓ ప్రభుత్వ ఆస్పత్రిలో సీలింగ్ కూలిపోయింది. పూర్తి కథనం కోసం ఈ లింక్​పై క్లిక్​ చేయండి.

Earthquake In Jaipur : రాజస్థాన్‌ రాజధాని జైపుర్​లో శుక్రవారం తెల్లవారుజామున స్వల్ప భూకంపం సంభవించింది. దీంతో ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. . ఉదయం 4 గంటల సమయంలో తొలి భూకంపం సంభవించింది. రిక్టర్‌ స్కేల్‌పై దీని తీవ్రత 4.4 గా నమోదైంది. ఆ తరువాత 20 నిమిషాలకు 3.1 తీవ్రతతో మరో భూకంపం వచ్చింది. మరో 5 నిమిషాల వ్యవధిలో 3.4 తీవ్రతతో మూడో భూకంపం నమోదైంది. జైపుర్‌లో 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు నేషనల్‌ సిస్మాలజీ సెంటర్‌ తెలిపింది.

  • Another earthquake of Magnitude 3.4 strikes Jaipur, Rajasthan: National Center for Seismology

    This is the 3rd earthquake that has struck Jaipur in an hour pic.twitter.com/zUoHX4Vwcz

    — ANI (@ANI) July 20, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

Earthquake Today Jaipur : గాఢనిద్రలో ఉన్నప్పుడు భూమి ఒక్కసారిగా కంపించడం వల్ల ప్రజలంతా ఏం జరుగుతుందో తెలియక భయాందోళనకు గురయ్యారు. కొంతమంది వీధుల్లోకి పరుగులు తీశారు. అయితే, ప్రస్తుతానికి ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం సంభవించలేదని సమాచారం. రాజస్థాన్‌ మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజె ఈ భూకంపం గురించి ట్విట్టర్‌ వేదికగా స్పందించారు. జైపుర్‌తో సహా రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలలో సైతం భూకంపం సంభవించినట్లు పేర్కొన్నారు. 'గంటలో మూడు సార్లు భూప్రకంపనలు వచ్చాయి. నా కుటుంబం మొత్తం నిద్రలోంచి లేచాం. ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు' అని​ స్థానికుడు వికాస్ తెలిపాడు.

Earthquake In Manipur : గురువారం తెల్లవారుజామున ఈశాన్య రాష్ట్రాలైన మిజోరాం, మణిపుర్​లో కూడా భూకంపం సంభవించింది. మిజోరాంలోని నొగోపాలో సైతం 3.6 తీవ్రతతో భూకంపం సంభవించింది. మణిపుర్​లోని ఉఖ్రుల్లో 3.5 తీవ్రతతో భూకంపం వచ్చినట్లు నేషనల్​ సిస్మాలజీ సెంటర్​ తెలిపింది.

Earthquake In Delhi : గత నెలలో దిల్లీ సహా ఉత్తరాదిలో స్వల్ప భూకంపం సంభవించింది. జమ్ముకశ్మీర్​లోని కిష్ట్వార్​కు 8 కిలోమీటర్ల దూరంలో.. 6 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం అధికారులు తెలిపారు. డోడ జిల్లాలో రిక్టర్​ స్కేల్​పై 5.4 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు నేషనల్​ సెంటర్​ ఫర్​ సిస్మోలజీ విభాగం అధికారులు వెల్లడించారు. దిల్లీ, హిమాచల్​ప్రదేశ్, పంజాబ్​, ఛండీగఢ్ పరిసర ప్రాంతాల్లో భూకంప ప్రభావం ఉన్నట్లు అధికారులు వివరించారు. దీంతో ఇళ్లలోని ప్రజలు బయటకు పరుగెత్తారు. శ్రీనగర్​లో స్కూల్​లోని పిల్లలు, దుకాణాల్లో ప్రజలు భయంతో బయటకు పరిగెత్తారని.. స్థానికులు తెలిపారు. భకంప ధాటికి డోడా జిల్లాలోని ఓ ప్రభుత్వ ఆస్పత్రిలో సీలింగ్ కూలిపోయింది. పూర్తి కథనం కోసం ఈ లింక్​పై క్లిక్​ చేయండి.

Last Updated : Jul 21, 2023, 10:30 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.