ETV Bharat / bharat

భారత వైద్యుల ఔదార్యం.. ఉక్రెయిన్​ చిన్నారికి ఫ్రీగా ఆపరేషన్

author img

By

Published : May 21, 2022, 12:56 PM IST

Ukraine refugee surgery: ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఓ ఉక్రెయిన్​ కుటుంబానికి అండగా నిలిచారు. ఆ కుటుంబంలోని చిన్నారికి ఉచితంగా శస్త్రచికిత్స చేసి తమ ఔదార్యాన్ని చాటుకున్నారు ఉత్తరాఖండ్​ వైద్యులు.

d
d

Ukraine refugee surgery: రష్యా భీకర దాడుల నేపథ్యంలో భారత్​కు వలస వచ్చిన ఓ ఉక్రెయిన్ కుటుంబాన్ని ఆదుకున్నారు ఉత్తరాఖండ్​ వైద్యులు. అపెండిక్స్​ సమస్యతో బాధపడుతున్న ఆరేళ్ల చిన్నారికి ఉచితంగా శస్త్రచికిత్స చేశారు. రెడ్​ క్రాస్​, జిల్లా ఆసుపత్రి వైద్యుల ఆధ్వర్యంలో ఈ ఆపరేషన్​ బుధవారం జరిగింది. వైద్యుల ఉదారతపై సోషల్​ మీడియాలో ప్రశంసలు కురిపిస్తున్నారు నెటిజెన్లు.

్
ఆసుపత్రిలో ఉక్రెయిన్​ మహిళ సోఫీ
్
చిన్నారితో సోఫీ

బాంబు దాడులు, తుపాకుల మోత మధ్య ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఎందరో ఉక్రెయిన్లు వివిధ దేశాలకు శరణార్థులుగా వెళ్లారు. ఈ క్రమంలో సోఫీ జలీల్​ అనే మహిళ కూడా ఆమె నలుగురు పిల్లలతో భారత్​కు చేరుకుంది. ఉత్తరాఖండ్​లోని ఉత్తరకాశీ జిల్లా సైంజ్ కుమాలతీ అనే ప్రాంతంలోని ఓ ఆశ్రమంలో తలదాచుకుంటున్న ఆమెకు.. అనుకోని రూపంలో సమస్య ఎదురైంది.

మంగళవారం రాత్రి ఆమె చిన్న కుమార్తె.. ఆరేళ్ల అభయకు తీవ్రంగా కడుపునొప్పి వచ్చింది. డాక్టర్ల కుటుంబానికి చెందిన సోఫీ.. చిన్నారి పరిస్థితిపై ఉక్రెయిన్​లోని తన కుటుంబ సభ్యులను సంప్రదించింది. చిన్నారికి తక్షణం చికిత్స అవసరమని తగిన పరీక్షలు చేయించాలని సూచించారు. కానీ ఆమెకు పరీక్షలు చేయించేందుకు కూడా డబ్బు లేదు.. దీంతో ఆమె రెడ్​ క్రాస్​ వారిని సంప్రదించి వారి సాయంతో కుమార్తెకు పరీక్షలు చేయించింది. డాక్టర్లు బాలికకు ఆపరేషన్ చేయాలని స్పష్టం చేశారు.

సర్జరీ ఖర్చులు భరించే స్తోమత లేని సోఫీకు అండగా నిలిచారు రెడ్​ క్రాస్​ ఛారిటీ నిర్వహకులు. వారి విజ్ఞప్తి మేరకు వైద్యులు బాలికకు ఉచితంగా ఆపరేషన్​ చేశారు. వైద్యుల ఔదార్యం, రెడ్​ క్రాస్​ చేసిన సాయానికి కృతజ్ఞతలు తెలిపింది. వారికి ధన్యవాదాలు తెలిపింది.

ఇదీ చూడండి : పట్టపగలే నడిరోడ్డుపై ఫైనాన్స్​ వ్యాపారి దారుణ హత్య..

Ukraine refugee surgery: రష్యా భీకర దాడుల నేపథ్యంలో భారత్​కు వలస వచ్చిన ఓ ఉక్రెయిన్ కుటుంబాన్ని ఆదుకున్నారు ఉత్తరాఖండ్​ వైద్యులు. అపెండిక్స్​ సమస్యతో బాధపడుతున్న ఆరేళ్ల చిన్నారికి ఉచితంగా శస్త్రచికిత్స చేశారు. రెడ్​ క్రాస్​, జిల్లా ఆసుపత్రి వైద్యుల ఆధ్వర్యంలో ఈ ఆపరేషన్​ బుధవారం జరిగింది. వైద్యుల ఉదారతపై సోషల్​ మీడియాలో ప్రశంసలు కురిపిస్తున్నారు నెటిజెన్లు.

్
ఆసుపత్రిలో ఉక్రెయిన్​ మహిళ సోఫీ
్
చిన్నారితో సోఫీ

బాంబు దాడులు, తుపాకుల మోత మధ్య ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఎందరో ఉక్రెయిన్లు వివిధ దేశాలకు శరణార్థులుగా వెళ్లారు. ఈ క్రమంలో సోఫీ జలీల్​ అనే మహిళ కూడా ఆమె నలుగురు పిల్లలతో భారత్​కు చేరుకుంది. ఉత్తరాఖండ్​లోని ఉత్తరకాశీ జిల్లా సైంజ్ కుమాలతీ అనే ప్రాంతంలోని ఓ ఆశ్రమంలో తలదాచుకుంటున్న ఆమెకు.. అనుకోని రూపంలో సమస్య ఎదురైంది.

మంగళవారం రాత్రి ఆమె చిన్న కుమార్తె.. ఆరేళ్ల అభయకు తీవ్రంగా కడుపునొప్పి వచ్చింది. డాక్టర్ల కుటుంబానికి చెందిన సోఫీ.. చిన్నారి పరిస్థితిపై ఉక్రెయిన్​లోని తన కుటుంబ సభ్యులను సంప్రదించింది. చిన్నారికి తక్షణం చికిత్స అవసరమని తగిన పరీక్షలు చేయించాలని సూచించారు. కానీ ఆమెకు పరీక్షలు చేయించేందుకు కూడా డబ్బు లేదు.. దీంతో ఆమె రెడ్​ క్రాస్​ వారిని సంప్రదించి వారి సాయంతో కుమార్తెకు పరీక్షలు చేయించింది. డాక్టర్లు బాలికకు ఆపరేషన్ చేయాలని స్పష్టం చేశారు.

సర్జరీ ఖర్చులు భరించే స్తోమత లేని సోఫీకు అండగా నిలిచారు రెడ్​ క్రాస్​ ఛారిటీ నిర్వహకులు. వారి విజ్ఞప్తి మేరకు వైద్యులు బాలికకు ఉచితంగా ఆపరేషన్​ చేశారు. వైద్యుల ఔదార్యం, రెడ్​ క్రాస్​ చేసిన సాయానికి కృతజ్ఞతలు తెలిపింది. వారికి ధన్యవాదాలు తెలిపింది.

ఇదీ చూడండి : పట్టపగలే నడిరోడ్డుపై ఫైనాన్స్​ వ్యాపారి దారుణ హత్య..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.