ETV Bharat / bharat

అఫ్తాబ్ నార్కో టెస్టుకు కోర్టు అనుమతి.. డీఎన్​ఏ రిపోర్ట్ ఆలస్యంపై అనుమానాలు!

author img

By

Published : Nov 29, 2022, 3:34 PM IST

సంచలనం సృష్టించిన కాల్ సెంటర్‌ ఉద్యోగి శ్రద్ధా వాకర్‌ హత్య కేసులో నిందితుడు అఫ్తాబ్​కు నార్కోటెస్ట్ చేసేందుకు దిల్లీ కోర్టు అనుమతి ఇచ్చింది. డిసెంబర్​ 1, 5 తేదీల్లో రోహిణిలోని ఫోరెన్సిక్ సైన్స్​ ల్యాబ్​లో పరీక్ష నిర్వహించాలని తెలిపింది. మరోవైపు డీఎన్​ఏ పరీక్షల నివేదిక ఆలస్యంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Shraddha walkar murder case
Shraddha walkar murder case

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన శ్రద్ధావాకర్​ హత్య కేసు దర్యాప్తులో మరో ముందడుగు పడింది. నిందితుడు అఫ్తాబ్​ పూనావాలాకు నార్కోటెస్ట్ నిర్వహించాలంటూ పోలీసులు చేసిన అభ్యర్థనను దిల్లీ కోర్టు అంగీకరించింది. పోలీసుల అభ్యర్థన మేరకు డిసెంబర్​ 1, 5 తేదీల్లో రోహిణిలోని ఫోరెన్సిక్ సైన్స్​ ల్యాబ్​లో పరీక్ష నిర్వహించాలని కోర్టు సూచించినట్లు అఫ్తాబ్​ తరఫు న్యాయవాది తెలిపారు.

నార్కో అనాలసిస్‌ అంటే?
నార్కో అనాలసిస్‌ అనేది గ్రీకు పదమైన నార్కో (అనెస్థీషియా అని అర్థం) నుంచి వచ్చింది. ఈ పరీక్షలో భాగంగా వ్యక్తి శరీరంలోకి ఓ ఔషధాన్ని (సోడియం పెంటోథాల్‌, స్కోపలామైన్‌,, సోడియం అమైథాల్‌) ఎక్కిస్తారు. దీన్నే ట్రూత్‌ సీరం అని కూడా అంటారు. ఆ వ్యక్తి వయసు, ఆరోగ్యం, భౌతిక స్థితి ఆధారంగా ఔషధ డోసును ఇస్తారు. ఇది ఇచ్చిన కొన్ని సెకన్లలోనే ఆ వ్యక్తి స్పృహ కోల్పోతాడు. ఈ సమయంలో వ్యక్తి నాడీ వ్యవస్థను పరమాణు స్థాయిలో ప్రభావితం చేస్తారు. ఆ సమయంలో దర్యాప్తు అధికారులు అడిగే ప్రశ్నలకు నిందితుడు తేలికగా సమాధానాలు వెల్లడిస్తాడు. స్పృహలో ఉన్నప్పుడు చెప్పని విషయాలనూ స్వేచ్ఛగా బహిరంగపరుస్తాడు. ఆ సమయంలో ఆయన పల్స్‌, బీపీని నిపుణులు అనుక్షణం పర్యవేక్షిస్తారు. ఒకవేళ అవి పడిపోతున్నట్లు గ్రహిస్తే.. వెంటనే నిందితుడికి ఆక్సిజన్‌ అందిస్తారు.

పాలిగ్రాఫ్‌, నార్కో పరీక్షలను చేయడానికి ఆ వ్యక్తి అంగీకారం తప్పనిసరి. అతడి అంగీకారం లేకుండా బ్రెయిన్‌ మ్యాపింగ్, పాలిగ్రాఫ్‌, నార్కో అనాలిసిస్‌ టెస్టులను నిర్వహించకూడదని సుప్రీం కోర్టు ఇదివరకే తీర్పు ఇచ్చింది. అయితే, నార్కో అనాలసిస్‌లో వ్యక్తి ఇచ్చే స్టేట్‌మెంట్లను ప్రధాన సాక్షాలుగా కోర్టులు పరిగణించవు. కేవలం వాటిని ఆధారంగానే తీసుకుంటాయి.

డీఎన్‌ఏ నివేదిక ఆలస్యమెందుకో..?
ఈ కేసులో నిందితుడు అఫ్తాబ్‌ ఆమిన్‌ పూనావాలను అరెస్టు చేసి రెండు వారాలకు పైనే అయ్యింది. నిందితుడు చెప్పిన వివరాల మేరకు శ్రద్ధావిగా భావిస్తున్న కొన్ని శరీర భాగాలను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే అవి మృతురాలివేనా? అని చెప్పేందుకు మాత్రం ఇంతవరకూ ఎలాంటి ఆధారాల్లేవు. దీన్ని తేల్చేందుకు చేపట్టిన డీఎన్‌ఏ పరీక్షల నివేదిక ఇంతవరకూ రాకపోవడంపై ఫోరెన్సిక్‌ నిపుణులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే సిబ్బంది కొరత కారణంగానే జాప్యం జరుగుతోందని అధికారులు చెబుతుండటం గమనార్హం.

శ్రద్ధా హత్య కేసులో అఫ్తాబ్‌ను నవంబరు 12న దిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. ఆ తర్వాత మెహ్‌రౌలీ అటవీ ప్రాంతంలో శ్రద్ధావిగా భావిస్తున్న కొన్ని శరీర అవశేషాలను గుర్తించిన పోలీసులు వాటిని నవంబరు 13న డీఎన్‌ఏ పరీక్షలకు పంపించారు. ఈ పరీక్షల్లో వచ్చిన డీఎన్‌ఏతో శ్రద్ధా కుటుంబ సభ్యుల డీఎన్‌ఏను సరిపోల్చి.. అవి మృతురాలివా? కాదా? అన్నది తెలుసుకోవచ్చు. అయితే ఈ పరీక్షలకు సంబంధించిన నివేదిక ఇంతవరకు రాలేదు. దీనిపై అధికారులు కూడా ఎలాంటి సమాచారం ఇవ్వట్లేదు. "ఇలాంటి కేసుల్లో మేం అత్యంత గోప్యత పాటిస్తాం. అందుకే ఆ శరీర భాగాల గురించి బయటకు ఎలాంటి వివరాలు చెప్పట్లేదు" అని రోహిణి ప్రాంత ఫోరెన్సిక్‌ సైన్స్‌ లాబొరేటరీ అసిస్టెంట్‌ పీఆర్‌ఓ రజనీశ్‌ కుమార్‌ చెప్పారు.

అయితే నివేదిక ఆలస్యంపై ఫోరెన్సిక్‌ నిపుణులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. "మానవ అవశేషాలు భద్రపర్చని స్థితిలో ఉన్నా.. ఏడాది క్రితం నాటివైనా వాటి నుంచి డీఎన్‌ఏను తెలుసుకునేందుకు 24 గంటల కంటే ఎక్కువ సమయం పట్టదు. ఆరు నెలల తర్వాత లభించిన మృతదేహాలకు చర్మం, మాంసం లేకపోయినా ఎముకల్లో ఉండే మజ్జ లాంటి కణజాలం ఏడాది వరకు సజీవంగానే ఉంటుంది. దాంతో సులువుగానే డీఎన్‌ఏను తెలుసుకోవచ్చు" అని బనారస్‌ హిందూ యూనివర్సిటీకి చెందిన జెనెటిక్స్‌ ప్రొఫెసర్‌ జ్ఞానేశ్వర్‌ చౌబే అన్నారు. 2021లో జార్జియా రాణి కెటెవాన్‌ 400 ఏళ్ల హత్య మిస్టరీని డీఎన్ఏ ద్వారా ఛేదించిన బృందంలో చౌబే కూడా సభ్యుడిగా ఉన్నారు. శ్రద్ధా కేసులో డీఎన్‌ఏ పరీక్షలు ఆలస్యమవడం దురదృష్టకరమని, దీని వల్ల ప్రజల్లోకి ప్రతికూల సంకేతాలు వెళ్తాయని ఆయన అన్నారు. ఈ కేసులో డీఎన్‌ఏను ఐసోలేట్‌ చేయడం బహుశా సవాల్‌గా మారొచ్చని మరో ఫోరెన్సిక్‌ నిపుణులు డా. తంగరాజ్‌ అన్నారు. అయితే ఇలాంటి కేసుల్లోనూ డీఎన్‌ఏను గుర్తించేందుకు మూడు రోజులకు మించి పట్టదని తెలిపారు.

సిబ్బంది కొరత వల్లేనా..?
అయితే రాష్ట్ర ప్రభుత్వ లాబొరేటరీల్లో సిబ్బంది కొరత కారణంగానే ఈ నివేదికలు ఆలస్యమవుతున్నాయని ఫోరెన్సిక్‌ అధికారులు చెబుతున్నారు. శ్రద్ధా కేసును చేపట్టిన ఎఫ్‌ఎస్‌ఎల్‌ రోహిణి లాబొరేటరీలో వర్క్‌ లోడ్‌కు తగినంత డీఎన్‌ఏ నిపుణులు అందుబాటులో లేరని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. సగం మందితోనే ఈ లాబొరేటరీ నడుస్తున్నట్లు తెలుస్తోంది. పెండింగ్‌ కేసులు ఎక్కువగా ఉండటం, ప్రాధాన్యత క్రమాల వల్లే ఈ నివేదిక ఆలస్యమవుతున్నట్లు సమాచారం.

అఫ్తాబ్‌కు భారీ భద్రత..
సోమవారం ఫోరెన్సిక్‌ పరీక్షల అనంతరం అఫ్తాబ్‌ను ల్యాబ్‌ నుంచి జైలుకు తరలిస్తుండగా కొందరు వ్యక్తులు కత్తులతో పోలీసు వ్యాన్‌పై దాడి చేశారు. దీంతో అతడికి భద్రతను పెంచారు. మంగళవారం ఉదయం మిగతా ఫోరెన్సిక్‌ పరీక్షల కోసం అతడిని మరోసారి ఎఫ్‌ఎస్‌ఎల్‌ రోహిణి ల్యాబ్‌కు తరలించారు. భారీ భద్రత మధ్య అతడిని ఇక్కడకు తీసుకొచ్చారు. ల్యాబ్‌ ముందు కూడా భారీగా పోలీసులు మోహరించారు.

ఇవీ చదవండి: ఆఫ్తాబ్​ హత్యకు యత్నం.. కత్తులతో దాడి.. శ్రద్ధ ఉంగరం కొత్త గర్ల్‌ఫ్రెండ్‌కు గిఫ్ట్‌!

ఆఫ్తాబ్​కు 13 రోజుల జ్యుడిషియల్‌ కస్టడీ.. శ్రద్ధ హత్య కేసులో కీలక విషయాలు వెలుగులోకి!

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన శ్రద్ధావాకర్​ హత్య కేసు దర్యాప్తులో మరో ముందడుగు పడింది. నిందితుడు అఫ్తాబ్​ పూనావాలాకు నార్కోటెస్ట్ నిర్వహించాలంటూ పోలీసులు చేసిన అభ్యర్థనను దిల్లీ కోర్టు అంగీకరించింది. పోలీసుల అభ్యర్థన మేరకు డిసెంబర్​ 1, 5 తేదీల్లో రోహిణిలోని ఫోరెన్సిక్ సైన్స్​ ల్యాబ్​లో పరీక్ష నిర్వహించాలని కోర్టు సూచించినట్లు అఫ్తాబ్​ తరఫు న్యాయవాది తెలిపారు.

నార్కో అనాలసిస్‌ అంటే?
నార్కో అనాలసిస్‌ అనేది గ్రీకు పదమైన నార్కో (అనెస్థీషియా అని అర్థం) నుంచి వచ్చింది. ఈ పరీక్షలో భాగంగా వ్యక్తి శరీరంలోకి ఓ ఔషధాన్ని (సోడియం పెంటోథాల్‌, స్కోపలామైన్‌,, సోడియం అమైథాల్‌) ఎక్కిస్తారు. దీన్నే ట్రూత్‌ సీరం అని కూడా అంటారు. ఆ వ్యక్తి వయసు, ఆరోగ్యం, భౌతిక స్థితి ఆధారంగా ఔషధ డోసును ఇస్తారు. ఇది ఇచ్చిన కొన్ని సెకన్లలోనే ఆ వ్యక్తి స్పృహ కోల్పోతాడు. ఈ సమయంలో వ్యక్తి నాడీ వ్యవస్థను పరమాణు స్థాయిలో ప్రభావితం చేస్తారు. ఆ సమయంలో దర్యాప్తు అధికారులు అడిగే ప్రశ్నలకు నిందితుడు తేలికగా సమాధానాలు వెల్లడిస్తాడు. స్పృహలో ఉన్నప్పుడు చెప్పని విషయాలనూ స్వేచ్ఛగా బహిరంగపరుస్తాడు. ఆ సమయంలో ఆయన పల్స్‌, బీపీని నిపుణులు అనుక్షణం పర్యవేక్షిస్తారు. ఒకవేళ అవి పడిపోతున్నట్లు గ్రహిస్తే.. వెంటనే నిందితుడికి ఆక్సిజన్‌ అందిస్తారు.

పాలిగ్రాఫ్‌, నార్కో పరీక్షలను చేయడానికి ఆ వ్యక్తి అంగీకారం తప్పనిసరి. అతడి అంగీకారం లేకుండా బ్రెయిన్‌ మ్యాపింగ్, పాలిగ్రాఫ్‌, నార్కో అనాలిసిస్‌ టెస్టులను నిర్వహించకూడదని సుప్రీం కోర్టు ఇదివరకే తీర్పు ఇచ్చింది. అయితే, నార్కో అనాలసిస్‌లో వ్యక్తి ఇచ్చే స్టేట్‌మెంట్లను ప్రధాన సాక్షాలుగా కోర్టులు పరిగణించవు. కేవలం వాటిని ఆధారంగానే తీసుకుంటాయి.

డీఎన్‌ఏ నివేదిక ఆలస్యమెందుకో..?
ఈ కేసులో నిందితుడు అఫ్తాబ్‌ ఆమిన్‌ పూనావాలను అరెస్టు చేసి రెండు వారాలకు పైనే అయ్యింది. నిందితుడు చెప్పిన వివరాల మేరకు శ్రద్ధావిగా భావిస్తున్న కొన్ని శరీర భాగాలను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే అవి మృతురాలివేనా? అని చెప్పేందుకు మాత్రం ఇంతవరకూ ఎలాంటి ఆధారాల్లేవు. దీన్ని తేల్చేందుకు చేపట్టిన డీఎన్‌ఏ పరీక్షల నివేదిక ఇంతవరకూ రాకపోవడంపై ఫోరెన్సిక్‌ నిపుణులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే సిబ్బంది కొరత కారణంగానే జాప్యం జరుగుతోందని అధికారులు చెబుతుండటం గమనార్హం.

శ్రద్ధా హత్య కేసులో అఫ్తాబ్‌ను నవంబరు 12న దిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. ఆ తర్వాత మెహ్‌రౌలీ అటవీ ప్రాంతంలో శ్రద్ధావిగా భావిస్తున్న కొన్ని శరీర అవశేషాలను గుర్తించిన పోలీసులు వాటిని నవంబరు 13న డీఎన్‌ఏ పరీక్షలకు పంపించారు. ఈ పరీక్షల్లో వచ్చిన డీఎన్‌ఏతో శ్రద్ధా కుటుంబ సభ్యుల డీఎన్‌ఏను సరిపోల్చి.. అవి మృతురాలివా? కాదా? అన్నది తెలుసుకోవచ్చు. అయితే ఈ పరీక్షలకు సంబంధించిన నివేదిక ఇంతవరకు రాలేదు. దీనిపై అధికారులు కూడా ఎలాంటి సమాచారం ఇవ్వట్లేదు. "ఇలాంటి కేసుల్లో మేం అత్యంత గోప్యత పాటిస్తాం. అందుకే ఆ శరీర భాగాల గురించి బయటకు ఎలాంటి వివరాలు చెప్పట్లేదు" అని రోహిణి ప్రాంత ఫోరెన్సిక్‌ సైన్స్‌ లాబొరేటరీ అసిస్టెంట్‌ పీఆర్‌ఓ రజనీశ్‌ కుమార్‌ చెప్పారు.

అయితే నివేదిక ఆలస్యంపై ఫోరెన్సిక్‌ నిపుణులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. "మానవ అవశేషాలు భద్రపర్చని స్థితిలో ఉన్నా.. ఏడాది క్రితం నాటివైనా వాటి నుంచి డీఎన్‌ఏను తెలుసుకునేందుకు 24 గంటల కంటే ఎక్కువ సమయం పట్టదు. ఆరు నెలల తర్వాత లభించిన మృతదేహాలకు చర్మం, మాంసం లేకపోయినా ఎముకల్లో ఉండే మజ్జ లాంటి కణజాలం ఏడాది వరకు సజీవంగానే ఉంటుంది. దాంతో సులువుగానే డీఎన్‌ఏను తెలుసుకోవచ్చు" అని బనారస్‌ హిందూ యూనివర్సిటీకి చెందిన జెనెటిక్స్‌ ప్రొఫెసర్‌ జ్ఞానేశ్వర్‌ చౌబే అన్నారు. 2021లో జార్జియా రాణి కెటెవాన్‌ 400 ఏళ్ల హత్య మిస్టరీని డీఎన్ఏ ద్వారా ఛేదించిన బృందంలో చౌబే కూడా సభ్యుడిగా ఉన్నారు. శ్రద్ధా కేసులో డీఎన్‌ఏ పరీక్షలు ఆలస్యమవడం దురదృష్టకరమని, దీని వల్ల ప్రజల్లోకి ప్రతికూల సంకేతాలు వెళ్తాయని ఆయన అన్నారు. ఈ కేసులో డీఎన్‌ఏను ఐసోలేట్‌ చేయడం బహుశా సవాల్‌గా మారొచ్చని మరో ఫోరెన్సిక్‌ నిపుణులు డా. తంగరాజ్‌ అన్నారు. అయితే ఇలాంటి కేసుల్లోనూ డీఎన్‌ఏను గుర్తించేందుకు మూడు రోజులకు మించి పట్టదని తెలిపారు.

సిబ్బంది కొరత వల్లేనా..?
అయితే రాష్ట్ర ప్రభుత్వ లాబొరేటరీల్లో సిబ్బంది కొరత కారణంగానే ఈ నివేదికలు ఆలస్యమవుతున్నాయని ఫోరెన్సిక్‌ అధికారులు చెబుతున్నారు. శ్రద్ధా కేసును చేపట్టిన ఎఫ్‌ఎస్‌ఎల్‌ రోహిణి లాబొరేటరీలో వర్క్‌ లోడ్‌కు తగినంత డీఎన్‌ఏ నిపుణులు అందుబాటులో లేరని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. సగం మందితోనే ఈ లాబొరేటరీ నడుస్తున్నట్లు తెలుస్తోంది. పెండింగ్‌ కేసులు ఎక్కువగా ఉండటం, ప్రాధాన్యత క్రమాల వల్లే ఈ నివేదిక ఆలస్యమవుతున్నట్లు సమాచారం.

అఫ్తాబ్‌కు భారీ భద్రత..
సోమవారం ఫోరెన్సిక్‌ పరీక్షల అనంతరం అఫ్తాబ్‌ను ల్యాబ్‌ నుంచి జైలుకు తరలిస్తుండగా కొందరు వ్యక్తులు కత్తులతో పోలీసు వ్యాన్‌పై దాడి చేశారు. దీంతో అతడికి భద్రతను పెంచారు. మంగళవారం ఉదయం మిగతా ఫోరెన్సిక్‌ పరీక్షల కోసం అతడిని మరోసారి ఎఫ్‌ఎస్‌ఎల్‌ రోహిణి ల్యాబ్‌కు తరలించారు. భారీ భద్రత మధ్య అతడిని ఇక్కడకు తీసుకొచ్చారు. ల్యాబ్‌ ముందు కూడా భారీగా పోలీసులు మోహరించారు.

ఇవీ చదవండి: ఆఫ్తాబ్​ హత్యకు యత్నం.. కత్తులతో దాడి.. శ్రద్ధ ఉంగరం కొత్త గర్ల్‌ఫ్రెండ్‌కు గిఫ్ట్‌!

ఆఫ్తాబ్​కు 13 రోజుల జ్యుడిషియల్‌ కస్టడీ.. శ్రద్ధ హత్య కేసులో కీలక విషయాలు వెలుగులోకి!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.