ETV Bharat / bharat

'మేము గెలిస్తే సాగు చట్టాలు రద్దు' - priyanka gandhi on farm laws

కిసాన్​ పంచాయత్​ కార్యక్రమంలో భాగంగా నూతన సాగు చట్టాలపై కాంగ్రెస్​ నేత ప్రియాంక గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్​ అధికారంలోకి వస్తే చట్టాలను రద్దు చేస్తామన్నారు.

priyanka gandhi
సాగు చట్టాలపై ప్రియాంక గాంధీ కీలక వ్యాఖ్యలు
author img

By

Published : Feb 10, 2021, 4:55 PM IST

Updated : Feb 10, 2021, 5:46 PM IST

కాంగ్రెస్​ అధికారంలోకి వస్తే నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తామని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా ప్రకటించారు. ఉత్తర్​ప్రదేశ్​లోని సహరన్​పూర్​లో బుధవారం నిర్వహించిన కిసాన్​ పంచాయత్​ కార్యక్రమంలో భాగంగా ఈ వ్యాఖ్యలు చేశారు.

అవమానిస్తున్నారు..

ఈ చట్టాలు కేవలం కోటీశ్వరులకే మేలు చేస్తాయని.. వారే రైతుల పంట ఉత్పత్తికి ధరలు నిర్ణయిస్తారని ఆరోపించారు ప్రియాంక. చట్టాలు రద్దు చేసేవరకు కాంగ్రెస్​ పోరాడుతుందని అన్నారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీపై విమర్శలు చేశారు. మోదీ సహా భాజపా నేతలు.. నిరసన తెలుపుతున్న రైతులను అవమానిస్తున్నారని అన్నారు.

priyanka gandhi
సాగు చట్టాలపై ప్రియాంక గాంధీ కీలక వ్యాఖ్యలు
priyanka gandhi
సాగు చట్టాలపై ప్రియాంక గాంధీ కీలక వ్యాఖ్యలు

అంతా డ్రామా..

కిసాన్​ పంచాయత్​ కార్యక్రమంపై భాజపా నేతలు స్పందించారు. రైతుల పేరుతో నాటకం జరుతోందని ఉత్తర్​ప్రదేశ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఆనంద్​ స్వరూప్​ శుక్లా వ్యాఖ్యానించారు. ప్రభుత్వ వ్యతిరేక శక్తులు అంతర్జాతీయ స్థాయిలో విమర్శలకు యత్నిస్తున్నాయని అన్నారు. రైతు ఉద్యమంపై ఇటీవల స్పందించిన పలువురు విదేశీ ప్రముఖలను ఉద్దేశిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రధానిపై వ్యతిరేకత వ్యక్తం చేయవచ్చు కానీ.. దేశం మీద కాదన్నారు. కేవలం వార్తల్లో నిలవడం కోసమే పలువురు ఇటువంటి కార్యక్రమాలు చేపడుతున్నారని కేంద్ర న్యాయశాఖ మంత్రి బ్రిజేష్​ పథక్​ అన్నారు.

ఇదీ చదవండి : 'ఈ మాటలతో ఇక మహిళకు రక్షణ ఉంటుందా?'

కాంగ్రెస్​ అధికారంలోకి వస్తే నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తామని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా ప్రకటించారు. ఉత్తర్​ప్రదేశ్​లోని సహరన్​పూర్​లో బుధవారం నిర్వహించిన కిసాన్​ పంచాయత్​ కార్యక్రమంలో భాగంగా ఈ వ్యాఖ్యలు చేశారు.

అవమానిస్తున్నారు..

ఈ చట్టాలు కేవలం కోటీశ్వరులకే మేలు చేస్తాయని.. వారే రైతుల పంట ఉత్పత్తికి ధరలు నిర్ణయిస్తారని ఆరోపించారు ప్రియాంక. చట్టాలు రద్దు చేసేవరకు కాంగ్రెస్​ పోరాడుతుందని అన్నారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీపై విమర్శలు చేశారు. మోదీ సహా భాజపా నేతలు.. నిరసన తెలుపుతున్న రైతులను అవమానిస్తున్నారని అన్నారు.

priyanka gandhi
సాగు చట్టాలపై ప్రియాంక గాంధీ కీలక వ్యాఖ్యలు
priyanka gandhi
సాగు చట్టాలపై ప్రియాంక గాంధీ కీలక వ్యాఖ్యలు

అంతా డ్రామా..

కిసాన్​ పంచాయత్​ కార్యక్రమంపై భాజపా నేతలు స్పందించారు. రైతుల పేరుతో నాటకం జరుతోందని ఉత్తర్​ప్రదేశ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఆనంద్​ స్వరూప్​ శుక్లా వ్యాఖ్యానించారు. ప్రభుత్వ వ్యతిరేక శక్తులు అంతర్జాతీయ స్థాయిలో విమర్శలకు యత్నిస్తున్నాయని అన్నారు. రైతు ఉద్యమంపై ఇటీవల స్పందించిన పలువురు విదేశీ ప్రముఖలను ఉద్దేశిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రధానిపై వ్యతిరేకత వ్యక్తం చేయవచ్చు కానీ.. దేశం మీద కాదన్నారు. కేవలం వార్తల్లో నిలవడం కోసమే పలువురు ఇటువంటి కార్యక్రమాలు చేపడుతున్నారని కేంద్ర న్యాయశాఖ మంత్రి బ్రిజేష్​ పథక్​ అన్నారు.

ఇదీ చదవండి : 'ఈ మాటలతో ఇక మహిళకు రక్షణ ఉంటుందా?'

Last Updated : Feb 10, 2021, 5:46 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.