కాంగ్రెస్ అధికారంలోకి వస్తే నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తామని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా ప్రకటించారు. ఉత్తర్ప్రదేశ్లోని సహరన్పూర్లో బుధవారం నిర్వహించిన కిసాన్ పంచాయత్ కార్యక్రమంలో భాగంగా ఈ వ్యాఖ్యలు చేశారు.
అవమానిస్తున్నారు..
ఈ చట్టాలు కేవలం కోటీశ్వరులకే మేలు చేస్తాయని.. వారే రైతుల పంట ఉత్పత్తికి ధరలు నిర్ణయిస్తారని ఆరోపించారు ప్రియాంక. చట్టాలు రద్దు చేసేవరకు కాంగ్రెస్ పోరాడుతుందని అన్నారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీపై విమర్శలు చేశారు. మోదీ సహా భాజపా నేతలు.. నిరసన తెలుపుతున్న రైతులను అవమానిస్తున్నారని అన్నారు.


అంతా డ్రామా..
కిసాన్ పంచాయత్ కార్యక్రమంపై భాజపా నేతలు స్పందించారు. రైతుల పేరుతో నాటకం జరుతోందని ఉత్తర్ప్రదేశ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఆనంద్ స్వరూప్ శుక్లా వ్యాఖ్యానించారు. ప్రభుత్వ వ్యతిరేక శక్తులు అంతర్జాతీయ స్థాయిలో విమర్శలకు యత్నిస్తున్నాయని అన్నారు. రైతు ఉద్యమంపై ఇటీవల స్పందించిన పలువురు విదేశీ ప్రముఖలను ఉద్దేశిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రధానిపై వ్యతిరేకత వ్యక్తం చేయవచ్చు కానీ.. దేశం మీద కాదన్నారు. కేవలం వార్తల్లో నిలవడం కోసమే పలువురు ఇటువంటి కార్యక్రమాలు చేపడుతున్నారని కేంద్ర న్యాయశాఖ మంత్రి బ్రిజేష్ పథక్ అన్నారు.
ఇదీ చదవండి : 'ఈ మాటలతో ఇక మహిళకు రక్షణ ఉంటుందా?'